Political News

మెల్లిగా పార్టీనీ లాగేసుకుంటున్నారా ?

మహారాష్ట్ర శివసేన లో రెండో అంకానికి తెర లేచింది. ముందేమో పార్టీ చీఫ్ ఉద్థవ్ థాక్రే పై తిరుగుబాటు లేవదీసిన ఏక్ నాథ్ షిండే పార్టీని నిట్టనిలువుగా చీల్చేశారు. పార్టీకి చెందిన 55 మంది ఎంఎల్ఏల్లో 40 మంది షిండే వర్గంలోకి వెళ్ళిపోయారు. బీజేపీ మద్దతుతో ఉద్థవ్ ప్రభుత్వాన్ని దింపేసి షిండే ఏకంగా ముఖ్యమంత్రయిపోయారు. సో థాక్రే నుండి ప్రభుత్వాన్ని లాగేసుకున్న షిండే నెక్స్ట్ స్టెప్ ఏమిటి ? నెక్స్ట్ …

Read More »

నరహరిది లక్కీ ఛాన్సేనా ?

గంటా నరహరి గురించే పార్టీలో ఇపుడు చర్చించుకుంటున్నారు. పార్టీలోకి ఇలా వచ్చారో లేదో చంద్రబాబునాయుడు అలా టికెట్ ప్రకటించేశారు. వచ్చే ఎన్నికల్లో రాజంపేట లోక్ సభ నుండి పోటీ చేయబోతున్నట్లు నరహరి పేరును చంద్రబాబు ప్రకటించారు. గంటా తెలుగుదేశం పార్టీలో చేరింది వారంరోజుల క్రితమే. పారిశ్రామికవేత్తగా పేరున్న గంటా ఆర్ధికంగా మంచి స్ధితిలోనే ఉన్నారు. మాజీ ఎంఎల్ఏ డీకే సత్యప్రభ సోదరికి గంటా అల్లుడవుతారు. బలిజ సామాజికవర్గానికి చెందిన గంటాకు …

Read More »

అధికారమంటే అహంకారం కాదు: జ‌గ‌న్‌

jagan

‘అధికారం అంటే అహంకారం కాదు.. ప్రజలపై మమకారం అని నిరూపించాం’ అని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని.. గుంటూరులో జ‌రుగుతున్న‌ వైసీపీ ప్లీనరీలో ఆయ‌న మాట్లాడుతూ.. 2009 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామ‌న్నారు. “2011లో పార్టీ పెట్టుకున్నాం. ఈ ప్రయాణంలో ఎన్ని ముళ్లున్నా, ఎన్ని రాళ్లు పడినా.. ఎన్ని వ్యవస్థలు మనపై కత్తిగట్టినా..ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆ కట్టుకథలకు …

Read More »

కోవర్టులతో తీవ్రంగా నష్టపోతాం

పార్టీలోని కోవర్టులతో తీవ్రంగా నష్టపోవటం ఖాయమని చంద్రబాబునాయుడు అన్నారు. కలికిరిలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. మొన్నటి కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి రెండు కారణాలుగా తేల్చారు. మొదటిది తాను ఏమరుపాటుగా ఉండటం. రెండో కారణం పార్టీలోని కోవర్టులే దెబ్బకొట్టడమని చెప్పారు. కుప్పంలో పార్టీ ఓడిపోయిన తర్వాత తాను మేల్కొన్నట్లు చెప్పారు. భవిష్యత్తులో అలాంటి దెబ్బ పడకూడదనే తాను కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నట్లు చెప్పారు. అందరికీ …

Read More »

వైసీపీకి విజ‌య‌మ్మ గుడ్‌బై.. ష‌ర్మిల‌తోనే ప్ర‌యాణం!

ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆ పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలిగా ఉన్న విజ‌య‌మ్మ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీలో త‌న ప‌ద‌వికి ఆమె రాజీనామా స‌మ‌ర్పిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక నుంచి తాను తెలంగాణ‌లో త‌న బిడ్డ ష‌ర్మిల పార్టీకి ప‌నిచేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. గుంటూరులో ఈ రోజు ఉద‌యం ప్రారంభ‌మైన వైసీపీ ప్లీన‌రీ వేదిక‌గా.. మాట్లాడిన ఆమె త‌న గౌర‌వ అధ్య‌క్షురాలి ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే త‌న …

Read More »

ఆ న‌లుగురి చేతిలో బందీ అయిన టీ కాంగ్రెస్‌..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ న‌లుగురి చేతిలో బందీ అయిందా..? వారు చెప్పిన‌ట్లే పార్టీ పెద్ద‌లు వినాల‌ని ఆదేశిస్తున్నారా..? వారు సూచించిన వారికే టికెట్ల కేటాయింపు ఉంటుందా..? ఆ జిల్లాలో వారు చెప్పిందే వేద‌మా..? అప్పుడే నియోజ‌క‌వ‌ర్గాల‌ను కూడా పంచుకున్నారా..? వారి ఆధిప‌త్య ధోర‌ణితో అధ్య‌క్షుడు రేవంత్ కూడా ఏమీ చేయ‌లేక‌పోతున్నారా..? ఆ న‌లుగురి వైఖ‌రి ప‌ట్ల ద్వితీయ శ్రేణి నేత‌లు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారా..? అంటే పార్టీ వ‌ర్గాలు అవున‌నే …

Read More »

చింత‌మ‌నేని ఆగ్ర‌హం ఎవ‌రిమీద‌!?

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్‌.. చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను పేకాట శిబిరానికి వెళ్ల‌క పోయిన‌ప్ప‌టికీ.. త‌న పేరు ఉంద‌నే ప్ర‌చారం చేయ‌డం.. పోలీసు రైడ్ తర్వాత పారిపోయినట్లు వచ్చిన పుకార్లపై ఆయ‌న ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ క్ర‌మంలో ఆయన చేసిన కామెంట్లు.. ఎవ‌రికీ అర్ధం కాలేదని అంటున్నారు. ఎందుకంటే.. ఆయ‌న త‌న కామెంట్లలో ఎవ‌రిని ఆక్షేపించారు. ఎవ‌రిని తిట్టిపోశారు..? …

Read More »

మోడీ స్నేహం మంచిది కాదా..ఇంట‌ర్నేష‌న‌ల్ డిబేట్‌

అంత‌ర్జాతీయ స్థాయిలో భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై ఒక ఆస‌క్తిక‌ర చ‌ర్చ ప్రారంభ‌మైంది. ఆయన స్నేహితులు వ‌రుస‌గా ప‌ద‌వులు కోల్పోవ‌డం.. త‌ర్వాత జ‌రుగుతున్న ప‌రిణామాలు వంటివి.. సెంటిమెంటుకు ఆజ్యం పోస్తున్నారు. దీంతో మోడీ స్నేహితులు.. ప‌ద‌వులు పోగొట్టుకుంటున్నార‌నే.. సెంటిమెంటు.. అంత‌ర్జాతీయంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ప్ర‌ధాని మోడీకి స్నేహితులుగా ఉన్న అభివృద్ధి చెందిన దేశాధి నేత‌లు.. ప‌ద‌వులు పోగోట్టుకున్నారు. ఇక‌, పొరుగున ఉన్న పాకిస్తాన్ …

Read More »

వైసీపీకి విజ‌య‌మ్మ రాజీనామా.. ప్లీన‌రీ వేదిక‌గా గుడ్‌బై..!

వైఎస్ విజ‌య‌మ్మ‌. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌తీమ‌ణిగానే కాదు.. కాంగ్రెస్‌ను ఎదిరించి.. ఢిల్లీ కాంగ్రెస్ పెద్ద‌ల‌కు భారీ షాక్ ఇస్తూ.. వైఎస్ కుమారుడు ప్ర‌స్తుత ఏపీ సీఎం జ‌గ‌న్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌర‌వ అధ్య‌క్షురాలు. కేవ‌లం ఈ ప‌ద‌వికి మాత్ర‌మే ఆమె ప‌రిమితం కాలేదు. ఈ రోజు ఏపీలో వైసీపీ స‌ర్కారు ఏర్ప‌డ‌డంలో కీల‌క రోల్ పోషించారు. 2014 ఎన్నిక‌ల్లోనూ.. 2019 ఎన్నిక‌ల్లోనూ.. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి …

Read More »

పొత్తులు ఉన్న‌ట్టా.. లేన‌ట్టా.. నేత‌ల త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

ఇప్పుడు ఈ మాటే జ‌న‌సేన‌లో వినిపిస్తోంది. ఎందుకంటే.. ఎన్నిక‌ల‌కు కేవ‌లం మ‌రో రెండు సంవ‌త్స‌రాలు మాత్ర‌మే ఉంది. అయితే.. పొత్తుల విష‌యంలో మాత్రం ఇప్ప‌టి వ‌రకు ఒక క్లారిటీ లేదు. దీంతో ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు.. త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు పెట్టుకుని ముందుకు సాగాల‌ని.. ప‌వన్ భావిస్తున్న‌ట్టు స్ఫ‌ష్టంగా తెలుస్తోంది. అయితే.. పొత్తుల విష‌యంలో ప్ర‌స్తుతం ఆయ‌న చెలిమి చేస్తున్న బీజేపీ కానీ.,. ఇటు.. టీడీపీ …

Read More »

నీచ ప్ర‌చారంతోనే వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది: చింత‌మనేని ఫైర్‌

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ వైసీపీపై తీవ్ర‌స్తాయిలో విరుచుకు ప‌డ్డారు. కోడి పందేల్లో లేని వ్యక్తిని ఉన్నట్లుగా చూపటమే కొందరి అజెండాగా మారిందని ధ్వజమెత్తారు. ఇలాంటి నీచమైన ప్రచారంతోనే వైసీపీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. అసత్యాల వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు కూకటివేళ్లతో ప్రక్షాళన చేసే సమయం దగ్గర పడిందన్నారు. కోడిపందేల్లో పాల్గొనని వ్యక్తిని పాల్గొన్నట్లుగా చూపటమే కొందరి జెండా అజెండాగా మారిందని చింత‌మేనేని …

Read More »

చంద్రబాబును అసెంబ్లీ ఏమి చేయబోతోంది ?

డేటా చోరీలో చంద్రబాబునాయుడే కీలక సూత్రదారిగా సభాసంఘం తేల్చేసింది. చంద్రబాబు, అప్పటి ఐటి శాఖ మంత్రిగా పనిచేసిన లోకేష్ ఆదేశాల ప్రకారమే కిందస్ధాయి ఉద్యోగులు, కొందరు బయటవ్యక్తులు గోప్యంగా ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసినేట్లు సభాసంఘానికి నాయకత్వం వహిస్తున్న తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకరరెడ్డి ప్రకటించారు. తాము లోతైన విచారణ జరిపిన తర్వాత చంద్రబాబు, లోకేష్ పాత్రకు ఆధారాలు దొరికినట్లు చెప్పారు. తొందరలోనే తమ నివేదికను అసెంబ్లీకి …

Read More »