బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్ ఎస్ ఎస్ భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న నాయకుడు సోము వీర్రాజు పరిస్థితి ఏంటి? ఆయనను త్వరలోనే మార్పు చేస్తారా? ఆయన స్థానంలో వేరేవారికి పగ్గాలు అప్పగించేందుకు బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోందా? దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ నేతలకు సంకేతాలు కూడా ఇచ్చేసిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. నిజానికి రాష్ట్ర బీజేపీ నేతల్లో చాలా సీనియర్ అయిన.. సోము.. తన దూకుడు కారణంగా.. …
Read More »కేసీఆర్ కు షాకిస్తున్న.. ‘తెలంగాణ నిరుద్యోగి మిర్చి బండి’
దానకర్ణుడు సైతం చేయలేని రీతిలో వినూత్న సంక్షేమ పథకాల్ని తీసుకొస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. రైతుబంధు పేరుతో.. పదుల సంఖ్యలో భూములు ఉన్న వారికి సైతం సాయాన్ని అందించిన ఆయన.. తాజాగా దేశంలో మరెవరికీ రాని అద్భుతమైన ఆలోచన చేయటం తెలిసిందే. ‘తెలంగాణ దళితబంధు’ పేరుతో ఆయన చెబుతున్న కాన్సెప్టు వింటున్న వారికి మైండ్ బ్లాక్ అయిపోతోంది. సామాజికంగా వెనుకబడి.. ఆర్థికంగా …
Read More »దటీజ్ నవీన్ .. ప్రచారానికి చాలా దూరంగా
అవును ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురించి చెప్పుకుని తీరాలి. ఎందుకు చెప్పుకోవాలంటే ఒలంపిక్స్ లో పురుషుల, మహిళల హాకీ పోటీల్లో చూపించిన ప్రతిభకు యావత్ దేశం జేజేలు పలుకుతోంది. పురుషుల జట్టు బ్రాంజ్ మెడల్ సాధించటంతో యావత్ దేశం ఫిదా అయిపోయింది. అది కూడా 41 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో మెడల్ సాధించటంతో యావత్ దేశం ఆనంద చెప్పనలవి కావట్లేదు. మెడల్ సంపాదించలేకపోయినా మహిళల జట్టు కూడా …
Read More »మాన్సాస్: ఏపీ సర్కారు లో రెండు వికెట్లు పడ్డాయి
మాన్సాస్, సింహాచలం దేవస్ధానం భూముల్లో జరిగిన అవకతవకల విషయంలో రెండు వికెట్లు పడిపోయాయి. అప్పట్లో భూములను ప్రైవేటుపరం చేయటంలోను, భూముల వివరాలు రికార్డులను మాయం చేయటంలో బాధ్యులుగా పేర్కొంటు ప్రభుత్వం దేవాదాయశాఖ అదనపు కమీషనర్ రామచంద్ర మోహన్ తో పాటు ఆలయ ఏఇవో అయిన సుజాతను సస్పెండ్ చేసింది. మాన్సాస్ ట్రస్టు భూముల వివిదాంతో పాటు సింహాచలం దేవాలయ భూములు రికార్డుల నుండి మాయమైపోయిన విషయంపై పెద్ద వివాదం రేగుతున్న …
Read More »మోడీది మామూలు వాడకం కాదు
తమ రాజకీయాలకు క్రీడలను కూడా కమలనాదులు వదలిపెట్టడంలేదు. ఒలంపిక్స్ లో కొన్ని పతకాలు రాగానే అవన్నీ తమ ప్రభుత్వ విధానాల వల్లే, ప్రోత్సాహం వల్లే సాధ్యమవుతోందంటు బీజేపీ నేతలు, దాని అనుబంధ విభాగాలు సోషల్ మీడియాలో పోస్టులతో హొరెత్తించేస్తున్నారు. సరే దీనికి ధీటుగానే నెటిజన్లు కూడా అంతే ఘాటుగా సమాధానాలు ఇస్తున్నారనుకోండి అది వేరే సంగతి. తాజాగా రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని నరేంద్రమోడి సర్కార్ మేజర్ ధ్యాన్ చంద్ …
Read More »ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్నారా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తొందరలోనే ఉపఎన్నికలు జరగబోతున్న హూజూరాబాద్ నియోజకవర్గం కేంద్రంగా రాష్ట్రంలోని సుమారు 30 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు జనాలు డిమాండ్ చేస్తున్నారు. హుజూరాబాద్ లో ఉపఎన్నికలు రాబట్టే ఎవరూ ఊహించని విధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయని జనాలకు అర్ధమైపోయింది. హుజూరాబాద్ లో జరుగుతున్నట్లే తమ నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి జరగాలంటే ఉపఎన్నికలు రావాల్సిందే అని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. అందుకనే …
Read More »రాజీవ్ ఆనవాళ్లు లేకుండా.. ప్రజల పేరుతో మోడీ ‘రాజకీయం’
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం.. వరుస విజయాలు సాధించి.. కాంగ్రెస్ను ఇప్పటికే ఊపిరి సలపనీయని విధంగా ఇరుకున పెడుతోంది. అంతేకాదు.. బలమైన కాంగ్రెస్ కంచుకోటలను కూడా దక్కించుకుని.. కాంగ్రెస్ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. కనుచూపు మేరలో.. కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి లేకుండా ప్రధాని మోడీ- కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు.. వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు.. కాంగ్రెస్ను ఇప్పటికే ఇరకాటంలోకి నెట్టాయి. ముఖ్యంగా కాంగ్రెస్ను మాత్రమే కాకుండా.. కాంగ్రెస్ వెనుక …
Read More »అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్
బాలీవుడ్ మెగస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంట్లో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. ఈ ఒక్క కాల్ తో.. ముంబయి పోలీసులు కాసేపు పరుగులు పెట్టాల్సి వచ్చింది. అమితాబ్ ఇంటితోపాటు.. ముంబయిలోని మూడు రైల్వే స్టేషన్లలో బాంబులు పెట్టామంటూ బెదిరించాడు గుర్తు తెలియని వ్యక్తి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అమితాబ్ ఇంటికి వెళ్లారు. పలు రైల్వే స్టేషన్ల దగ్గర భద్రత పెంచారు. బాంబు స్క్వాడ్ తో తనిఖీలు …
Read More »పీకే ఎందుకు రాజీనామా చేశాడు ?
పంజాబ్ ప్రభుత్వ సలహాదారు పదవికి ప్రశాంత్ కిషోర్ (పీకే) రాజీనామా చేయటం సంచలనంగా మారింది. ఎన్నికలు వచ్చేఏడాది మార్చిలో ప్రాంతంలో జరుగనున్న సమయంలోనే పీకే ఎందుకు రాజీనామా చేయాల్సొచ్చింది ? అన్న విషయంపైనే ఇపుడు చర్చ జరుగుతోంది. మామూలుగా అయితే పీకే రాజీనామా విషయంపై పెద్దగా చర్చ జరగాల్సినంత సీన్ లేదు. కానీ 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినపుడు తెరవెనుక వ్యూహకర్తగా వ్యవహరించింది పీకేనే. అదే పీకేని ఈమధ్యనే …
Read More »ఏపీలో థియేటర్ల సమస్య కొలిక్కి?
తెలుగు ప్రేక్షకుల సినీ అభిమానం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏమున్నా లేకున్నా మన జనాలకు సినిమా ఉండాలి. అందుకే గత ఏడాది కరోనా వల్ల తలెత్తిన లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడితే మన జనాలు అల్లాడిపోయారు. విరామం తర్వాత మళ్లీ థియేటర్లు తెరిస్తే కొత్త చిత్రాలకు బ్రహ్మరథం పట్టారు. కానీ మళ్లీ కరోనా వచ్చి థియేటర్లను మూత వేయించింది. గత నెలలోనే థియేటర్లపై ఆంక్షలు …
Read More »వైసీపీ ఎంపిపై క్రిమినల్ కేసు ?
ఒంగోలు వైసీపీ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. అదికూడా నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం పోలీసుస్టేషన్ లో కేసు నమోదవ్వటమే విచిత్రంగా ఉంది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు, పోలీసుల కేసు నమోదులోనే కన్ఫ్యూజన్ కనబడుతోంది. విషయం ఏదైనా ఇటు ఇరిగేషన్ అధికారులు, అటు పోలీసుల వైఖరితో ఎంపిపై కేసు నమోదవ్వటం ఇఫుడు పార్టీలో సంచలనంగా మారింది. …
Read More »పరకాల వెర్సస్ జనసైనికులు.. రచ్చ రచ్చే
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఏమాత్రం నచ్చని వ్యక్తుల్లో పరకాల ప్రభాకర్ ఒకరు. పొలిటీషియన్ కమ్ పొలిటికల్ అనలిస్ట్ అయిన పరకాల ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీకి ఇచ్చిన షాక్ ఎలాంటిదో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పార్టీలో చేరిన మేధావి వర్గంలో ఒకడిగా పరకాలకు మంచి గౌరవమే దక్కింది. కానీ కొంత కాలానికే ప్రజారాజ్యం నుంచి బయటికి వచ్చేసిన ఆయన.. తాను నిష్క్రమిస్తున్న విషయాన్ని అదే పార్టీ ఆఫీస్లో కూర్చుని వెల్లడించారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates