Political News

పవన్ భీషణ ప్రతిజ్ఞ..అంత సీన్ ఉందా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఏమనయ్యా అంటే వచ్చే ఎన్నికల్లో ఎంఎల్ఏ అన్నే రాంబాబును ఎట్టి పరిస్దితిలోను గెలవనిచ్చేది లేదని. మొన్నటి ఎన్నికల్లో ప్రకాశంజిల్లాలోని గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటి చేసిన రాంబాబు సుమారు 81 వేల ఓట్ల మెజారిటితో గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి రాంబాబును వచ్చే ఎన్నికల్లో గెలవకుండా అడ్డుకుంటానని పవన్ శపథం చేశారు. ఇంతకీ విషయం …

Read More »

ఒక్క అడుగైనా ముందుకేయగలడా ?

పంచాయితి ఎన్నికల ప్రక్రియ వివాదం తారస్ధాయికి చేరుకుంటోంది. ఎలాగైనా ఎన్నికలు జరపాల్సిందే అని స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇదే సమయంలో ఎన్నికల నిర్వహణలో పాల్గొనేది లేదని ఉద్యోగులు తెగేసి చెబుతున్నారు. తమ ప్రాణాలకు రక్షణ లేకుండా ఎలక్షన్ డ్యూటి చేయమని తమను ఒత్తిడి చేసే హక్కు ఎవరికీ లేదని ఉద్యోగసంఘాల నేతలు గట్టిగానే మాట్లాడుతున్నారు. శనివారం మధ్యాహ్నం నిమ్మగడ్డ ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్సుకు …

Read More »

మోడీ స‌భలో మ‌మ‌త సంచ‌ల‌నం

న‌రేంద్ర మోడీ పేరెత్తితే చాలు శివాలెత్తిపోయే నేత‌ల్లో మ‌మ‌తా బెన‌ర్జీ ఒక‌రు. ఒక‌ప్పుడు మోడీని వ్య‌తిరేకించిన నారా చంద్ర‌బాబు నాయుడు, కేసీఆర్ లాంటి నేత‌లు త‌ర్వాత స్వ‌రం మార్చేశారు కానీ.. మ‌మ‌త మాత్రం ఎప్పుడూ మోడీ వ్య‌తిరేకే. కాంగ్రెస్ పార్టీని మంచి మోడీ స‌ర్కారుతో యుద్ధం చేస్తోంది ఈ ప‌శ్చిమ బెంగాల్ సీఎం. అందులోనూ త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే బెంగాల్ ఎన్నిక‌ల్లో మ‌మ‌త నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్‌కు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా బీజేపీ …

Read More »

మోడి జమిలి ఎన్నికల జపానికి కారణం ఇదేనా ?

దేశంలో జమిలి ఎన్నికలు జరగాలని నరేంద్రమోడి ప్రతిపాదించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడో మూలనపడిన జమిలి ఎన్నికలను మళ్ళీ ఎందుకని తెరపైకి తీసుకొచ్చారు ? ఎందుకంటే తాజాగా ఇండియాటుడే-కార్వీ సంస్ధలు నిర్వహించిన సర్వే సమాధానం చెబుతోంది. మూడ్ ఆఫ్ ది నేషన్ అనే విషయంలో జరిపిన సర్వేలో ఇప్పటికిప్పుడు కానీ ఎప్పుడు ఎన్నికలు జరిపినా కానీ మళ్ళీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని తేలింది. అంటేట సర్వేలో చెప్పింది చెప్పినట్లు …

Read More »

ఎన్నికలు బాయ్ కాట్ చేస్తాం: ఏపీ ఉద్యోగ సంఘాలు

ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓ పక్క ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుందని నేడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మరోపక్క, వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేమంటూ సుప్రీం కోర్టును ఏపీ సర్కార్ ఆశ్రయించింది. మరోవైపు, ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్యోగుల సంఘాలు కూడా ససేమిరా అంటున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలు సంచలన ప్రకటన చేశాయి. పంచాయతీ …

Read More »

చిరు-ప‌వ‌న్‌-ముద్ర‌గ‌డ‌.. కాపు రాజ‌కీయాలు ఎటు వైపు?!

రాష్ట్రంలో కాపు సామాజిక వ‌ర్గం రాజ‌కీయం ఎలా ఉంది? ఎటు వెళ్తోంది? ఉభ‌య గోదావ‌రి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, విశాఖ స‌హా ఎనిమిది జిల్లాల్లో బ‌లంగా ఉన్న కాపుల‌కు రాజ‌కీయ వేదిక ఏదైనా ఉందా? వారిని న‌డిపించే నాయ‌కుడు క‌నిపిస్తున్నాడా? అంటే.. ప్ర‌శ్న‌లు త‌ప్ప స‌మాధానం క‌నిపించ‌డం లేదు. త‌మ‌కు స‌రైన నాయ‌కుడు, స‌రైన రాజ‌కీయ వేదిక ఏదీ లేకుండా పోయింద‌నే ఆవేద‌న కాపు సామాజిక వ‌ర్గంలో బ‌లంగా వినిపిస్తోంది. …

Read More »

నాన్న కూడా సీరియస్ అయ్యారు కానీ.. తర్వాత తగ్గారు జగన్

ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఈసీ అన్నట్లుగా పరిస్థితి ఉంది. పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. అదే సమయంలో.. దాన్ని ససేమిరా అన్నట్లుగా ఉంది ఏపీ ప్రభుత్వం. నోటిఫికేషన్ కు రోజు ముందు.. ఇద్దరు ఐఏఎస్.. ఒక ఐపీఎస్ అధికారితో పాటు పలువురు అధికారులపై బదిలీ వేటు వేస్తూ నిమ్మగడ్డ రమేశ్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం …

Read More »

పెరిగిపోతున్న ‘జనవరి 26’ టెన్షన్

ఒకవైపు జనవరి 26 రిపబ్లిక్ డే దినోత్సవ ఏర్పాట్లు. మరోవైపు అదేరోజు వేలాది ట్రాక్టర్లతో మూడు వ్యవసాయ చట్టాలపై నిరసన ప్రదర్శనకు నిర్ణయం. దీంతో 26వ తేదీన ఢిల్లీలో ఏమి జరగబోతోందో అర్ధంకాక మామూలు జనాలకు టెన్షన్ పెరిగిపోతోంది. కేంద్రం అమల్లోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో గడచిన రెండు నెలలుగా ఢిల్లీ శివార్లలోని సింఘూ దగ్గర వేలాదిమంది రైతులు చేస్తున్న ఉద్యమం అందరికీ …

Read More »

చిన్నమ్మ విషయంలో ఏమి జరుగుతోంది ?

తమిళనాడులో చిన్నమ్మగా పాపులరైన శశికళ విషయంలో ఏమి జరుగుతోందో అర్ధంకాక ఆమె అభిమానులు టెన్షన్ పడిపోతున్నారు. ఈనెల 27వ తేదీన బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలు నుండి శశికళ విడులవుతారని అందరు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆమె విడుదల సందర్భంగా జైలు నుండి తమిళనాడులో ఆమె నివాసం వరకు భారీ స్వాగత ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 27వ తేదీన విడులయ్యే చిన్నమ్మను ఊరేగింపుగా చెన్నైకు తీసుకెళ్ళేందుకు వెయ్యికార్లతో భారీ ర్యాలీని …

Read More »

బ్రేకింగ్: ఏపీలో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ

అంచనాలు నిజమయ్యాయి. ముందుగా చెప్పినట్లే పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. నాలుగు దశల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన ఆయన.. తొలి దశలో విజయనగరం.. ప్రకాశం జిల్లా మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ముందుకు వెళుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ తమ నిర్ణయానికి భిన్నంగా సుప్రీంకోర్టు నిర్ణయం ఉంటే తప్పకుండా పాటిస్తామన్నారు. …

Read More »

11 జిల్లాల్లోనే ఎన్నికలు..రెండు జిల్లాల మినహాయింపు

స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ ఆలోచన ప్రకారం జరుగుతున్న పంచాయితీ ఎన్నికలు షెడ్యూల్ అమల్లోకి వస్తే ముందుగా 11 జిల్లాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఎన్నికలు జరగటం లేదు. ఎందుకంటే పోయిన ఏడాది మార్చిలో స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలను, ఘర్షణలను నివారించలేకపోయిన కారణంగా పై జిల్లాల కలెక్టర్లపై నిమ్మగడ్డ చర్యలకు సిఫారసు చేశారు. అయితే వాళ్ళపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే …

Read More »

విజయసాయి వాహనంపై దాడి ఘటనలో ఏ1గా చంద్రబాబు

రామతీర్థ పర్యటనలో విజయసాయిరెడ్డి వాహనంపై దాడి ఘటనలో A1గా చంద్రబాబు, A2గా అచ్చెన్నాయుడు, A3గా కళా వెంకట్రావు పేర్లను పోలీసులు చేర్చడం చర్చనీయాంశమైంది. దీంతోపాటు, ఈ ఘటనకు సంబంధించి మరో 12 మందిని ముద్దాయిలుగా పోలీసులు చేర్చారు. కాగా, బుధవారం నాడు కళా వెంకటరావును విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామతీర్థం పర్యటనలో విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్లు, చెప్పులు వేయించారనే.. అభియోగంపై …

Read More »