Political News

చిన్నమ్మకు కమలనాథుల ఆఫర్ ఇదేనా?

చెలరేగిపోయి చరిత్ర సృష్టిస్తానని చెప్పిన చిన్నమ్మ.. అందుకు భిన్నంగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లుగా చెప్పిన రాజకీయ సంచలనంగా మారారు. తెర వెనుక ఏదో జరిగిందన్న మాట బలంగా వినిపిస్తున్నా.. ఏం జరిగిందన్న విషయాన్ని మాత్రం క్లియర్ గా చెప్పలేని పరిస్థితి. తాజాగా ఆ విషయాలు బయటకు వచ్చేశాయి. చిన్నమ్మ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన దాని వెనుక చాలా పె..ద్ద కథే నడిచినట్లుగా చెబుతున్నారు. రెండు అడుగులు వెనక్కి వేయటం …

Read More »

ఏపీలో ఏబీసీడీ రాజ్యం.. బాబు కామెంట్.. మేయ‌ర్ అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న‌

ప్ర‌స్తుతం విశాఖ మ‌హాన‌గ‌రాన్ని ఏ2 అనే శ‌ని ప‌ట్టింది– అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. విశాఖ కార్పొ రేష‌న్ ప‌రిధిలో టీడీపీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున రెండు రోజుల పాటు ఆయ‌న ప్ర‌చారం చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో తొలిరోజు.. శుక్ర‌వారం ఆయ‌న ప‌లు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పెందుర్తి కూడలిలో ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖపట్నానికి ఏ2 శని పట్టిందని టీడీపీ అధినేత …

Read More »

బెంగాల్లో హై ఓల్డేజ్ టెన్షన్ మొదలైందా ?

అవును పశ్చిమబెంగాల్లో అసలైన టెన్షన్ ఇపుడే మొదలైంది. శుక్రవారం మమతాబెనర్జీ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాను చూడగానే చాలామంది షాక్ కు గురయ్యారు. ఇందుకు కారణం ఏమిటంటే తొందరలో జరగబోయే ఎన్నికల్లో మమత నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తుండటమే. నందిగ్రామ్ నియోజకవర్గమంటే అలాంటిలాంటి నియోజకవర్గం కాదు. అందుకనే ఏక కాలంలో ఇటు అధికార తృణమూల్ కాంగ్రెస్ తో పాటు అటు బీజేపీలో కూడా టెన్షన్ పెరిగిపోతోంది. సంవత్సరాల …

Read More »

జాతీయ కమిటిలో చంద్రబాబు

మొత్తానికి చంద్రబాబునాయుడు విషయంలో కేంద్రప్రభుత్వం కాస్త సానుకూలంగా స్పందిచినట్లే అనిపిస్తోంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో ఎలా నిర్వహించాలనే విషయంలో సలహాలు ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం జాతీయస్ధాయిలో ఓ కమిటిని నియమిచింది. ఇందులో వివిధ రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులున్నారు. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, గవర్నర్లు, జాతీయ పార్టీల అధినేతలు, ప్రతిపక్ష నేతలు కూడా ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అనేకమంది ఉన్న ఈ కమిటిలో తెలుగు వాళ్ళకు కూడా …

Read More »

మమత బలం పుంజుకుంటోందా ?

ఇపుడు యావత్ దేశం ఎంతో ఆతృతంగా ఎదురుచూస్తున్న ఎన్నికలు పశ్చిమబెంగాల్ దే. తొందరలో జరగబోయే ఎన్నికల్లో విజయంసాధించి హ్యాట్రిక్ కొట్టాలని మమత బెనర్జీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ జెండాను ఎగరేయాలని నరేంద్రమోడి డైరెక్షన్లో అమిత్ షా చేయని ప్రయత్నంలేదు. ఈ నేపధ్యంలోనే రాబోయే ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు ఒకరిపై మరొకరు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్నారు. ప్రభుత్వంలో అస్ధిరపరిచేందుకు బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. …

Read More »

ఫ్యాక్ట్ చెక్ .. వాటెన్ ఐడియా జగన్ జీ

మీడియా మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నంత కాలంలో అసత్యాల ప్రచారం చాలా తక్కువగా ఉండేది. ఎప్పుడైతే సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిందో.. లెక్కలు పూర్తిగా మారిపోయాయి. నిజాల కంటే అబద్ధాల ప్రచారమే ఎక్కువైంది. అసత్యాల్ని సత్యాలుగా భ్రమించేలా పోస్టులు సిద్ధం చేయటం.. ఆడియో.. వీడియోలను తమకు అనుకూలంగా మార్ఫింగ్ చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. దీంతో.. అందరూ అసత్యాల ప్రచారానికి బలి అవుతుంటారు. ఇలాంటి తీరుకు చెక్ పెట్టేందుకు వీలుగా …

Read More »

తిరుపతిలో మిత్రపక్షాల బలమెంతో తెలుసా ?

తొందరలోనే జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం నీకా నాకా అన్నట్లుగా మిత్రపక్షాలు బీజేపీ-జనసేనలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. మిత్రపక్షాల్లో ఎందుకింత పోటీ ఉందంటే నియోజకవర్గం పరిధిలో తమకు విపరీతమైన బలం ఉందని రెండు పార్టీలు కూడా దేనికదే అనుకోవటమే. ఇందుకు రెండు పార్టీలు కూడా ఎవరి కారణాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే ఉపఎన్నికలో ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని పక్కన పెట్టేద్దాం. దానికి …

Read More »

వైసీపీకి ఇదంతా అవసరమా ?

అధికార వైసీపీకి ఇదంతా అవసరమా ? అనే డౌటు పెరిగిపోతోంది. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సందర్భంగా కొన్ని చోట్ల పెద్ద వివాదాలు రేగాయి. వివాదాల్లో ముఖ్యమైనది ఏమిటంటే ప్రతిపక్షాల తరపున పోటీ చేయాలని అనుకున్న కొందరు అభ్యర్ధుల సంతకాలను ఫోర్జరీలు చేసి నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పటమే. పోటీకి సిద్దమైన తమ నామినేషన్లు తమకు తెలియకుండానే విత్ డ్రా అయినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించటంతో కొందరు అభ్యర్ధులు విస్తుపోయారు. …

Read More »

కేరళలో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా మెట్రోమ్యాన్

మెట్రోమ్యాన్ అంటే ఎవరికైనా శ్రీధరనే గుర్తుకొస్తారు. మెట్రోమ్యాన్ అంటే దేశంలో మెట్రో రైళ్ళ రూపకల్పనకు, డీటెల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారీ, మెట్రో లైన్ల డిజైన్ తదితరాల్లో శ్రీధరన్ సిద్ధహస్తుడనటంలో సందేహంలేదు. అలాంటి మెట్రోమ్యాన్ను బీజేపీ కేరళలో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించింది. గడచిన పదిరోజులుగా శ్రీధరన్, బీజేపీలో చేరుతారనేది ఖాయమైపోయింది. కేరళలో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తాను ఉంటానంటు స్వయంగా మెట్రోమ్యానే ప్రకటించారు. ఆయన ప్రకటననే ఈరోజు కేరళ పార్టీ అధ్యక్షుడు …

Read More »

ఏపీపై కన్నేసిన ఓవైసీ.. తొలిసారి బెజవాడలో ఎంట్రీ

హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీకి మాత్రమే పరిమితమైన మజ్లిస్.. గడిచిన కొన్నేళ్లుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తన సత్తా చాటుతోంది. గురి చూసి కొట్టినట్లుగా.. అత్యంత వ్యూహాత్మకంగా.. పరిమిత స్థానాల్లోనే బరిలోకి దిగే ఈ పార్టీ తొలిసారి ఏపీలో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా జరుగుతున్న పురపాలిక ఎన్నికల్లో MIM పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. అయితే.. ఏపీలోని మిగిలిన ప్రాంతాల్ని అస్సలు టచ్ చేయని ఈ పార్టీ.. విజయవాడను మాత్రమే టార్గెట్ …

Read More »

పంతం నెగ్గించుకున్న కేశినేని

మొత్తానికి అనేక వివాదాల తర్వాత విజయవాడ ఎంపి కేశినేని నాని తన పంతాన్ని నెగ్గించుకున్నారు. విజయవాడ ఎంపి కూతురు శ్వేతను తెలుగుదేశం పార్టీ తరపున మేయర్ అభ్యర్ధిగా చంద్రబాబునాయుడు ప్రకటించారు. తన కూతురు శ్వేతను మేయర్ అభ్యర్ధిగా ప్రకటింపచేయాలని ఎంపి గట్టిగానే ప్రయత్నించారు. ఇదే సమయంలో శ్వేతను కాకుండా ఇతర సామాజికవర్గాలకు చెందిన వారిని ప్రకటించాలని ఇతర నేతలు గట్టిగానే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలోనే ఎంపికి మాజీ …

Read More »

కమల్ ముందు జాగ్రత్త పడుతున్నాడా ?

మక్కల్ నీది మయ్యుం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్ ముందు జాగ్రత్తలు పడుతున్నట్లే అనిపిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయటానికి ఏర్పాట్లు చేసుకున్నారట. మామూలుగా ఒకటికంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేసే వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. మొదటి రకమేమో తమ గెలుపుపై నూరుశాతం ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. ఇక రెండో రకమేమో ఒక్కచోటే పోటీచేస్తే గెలుపుపై అనుమానం ఉండేవాళ్ళు. గతంలో టీడీపీని పెట్టినపుడు ఎన్టీయార్ …

Read More »