కరోనా విజృంభించిన సమయంలో దీనికి నివారణగా మందును రూపొందించి రాత్రికి రాత్రి సంచలనం సృష్టించిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ప్రాంతానికి చెందిన ఆనందయ్య.. నిజానికి చాలా నిదానస్తుడనే పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఆనందయ్య.. తాజాగా ముఖ్యమంత్రి జగన్.. సహా ఇటీవల వరకు సన్నిహితంగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘లాభం’ లేదనే తనను వదిలేశారని నిప్పులు చెరిగారు. మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించకపోవడం బాధాకరమని ఆనందయ్య అన్నారు. …
Read More »మోదీని ఎదురించి.. పీఎం పీఠం ఎక్కేదెవరు..?
భారత ప్రధానిగా ప్రస్తుతం నరేంద్రమోడీ కొనసాగుతున్నారు. ఆయన కాకుండా.. భవిష్యత్తులో ఆ పదవిని అదిరోహించేంది ఎవరు..? అసలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చే సత్తా ఎవరికైనా ఉందా..? కాంగ్రెస్ ఈసారైనా నిలపడగలదా..? లేదా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటై.. అది బీజేపీ ని ఓడించగలదా..? వంటి ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో పడింది ప్రశ్నం అనే సంస్థ. ఈ మేరకు 12 రాష్ట్రాల్లో సర్వే కూడా చేసింది. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, …
Read More »చిరు సార్.. ఆ క్రెడిట్ నాది కాదు.. సీఎం జగన్ ట్వీట్
అవకాశం ఉన్న ప్రతీ సందర్భంలో.. సీఎం జగన్ను మెగాస్టార్ చిరు పొగుడుతూనే ఉన్న విషయం తెలిసిందే. దానిపై ఎవరికీ ఏ అభిప్రాయం ఉన్నా… సీఎం జగన్ను ఆయన సోదరుడు, జనేసనాని పవన్ విమర్శిస్తున్నా.. చిరు మాత్రం అభినందనలు చెబుతూనే ఉన్నారు. తాజాగా ఈ నెల 21న రాష్ట్రంలో సుమారు 13.72 లక్షల మందికి ఒకే రోజు మెగా వ్యాక్సినేషన్ సండే పేరిట టీకాలు వేశారు. ఈ సందర్భంగా… టీమ్ ఏపీ, …
Read More »ఈ దేశంలో ఒక్క కేసు కూడా లేదట..నిజమేనా ?
మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. గడచిన ఏడాదిన్నరగా యావత్ ప్రపంచం కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్న విషయం తెలిసిందే. చాలా దేశాల్లో లక్షలమంది చనిపోయారు. చాలా దేశాల ఆర్ధిక పరిస్ధితి తల్లకిందలైపోయింది. కరోనా వైరస్ దెబ్బకు కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే మారిపోయాయి. చాలా దేశాల్లో ఎన్నెన్నో జరిగిపోతున్నా ఉత్తర కొరియాలో మాత్రం ఒక్కటంటే కనీసం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదట. ఈ విషయాన్ని ఎవరో చెప్పటం …
Read More »జగన్ వాదన నిలుస్తుందా ?
అప్పుడెప్పుడో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు. అయిపోయిన పనులకు బిల్లులు చెల్లించకపోతే పనులుచేసిన కాంట్రాక్టర్ల పరిస్ధితి ఏమిటనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించటంలేదు. 2018-19లో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో జరిగిన పనులకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు. 2018-19లో పనుల బిల్లులను 2019 ఆర్థిక సంవత్సరం తర్వాత చెల్లించాలి. కానీ ప్రభుత్వం మారిపోవడంతో అంతా తారుమారైపోయింది. ఆ దెబ్బకు అప్పట్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు బిల్లులు రాలేదు. చిత్తూరు …
Read More »మోడి ధైర్యమిదేనా ?
రాజకీయాల్లో ప్రత్యర్ధుల్లో ఐక్యత రానంత వరకు నరేంద్రమోడి ఫుల్లు హ్యాపీనే. ఈ విషయం తాజా రాజకీయాలను గమనిస్తే ఎవరికైనా అర్ధమైపోతుంది. నిజానికి ఎన్డీయే అధికారంలోనే ఉన్నా నేతృత్వం వహిస్తున్న బీజేపీని మినహాయిస్తే మిగిలిన పార్టీల బలం అంతంత మాత్రమే. అయితే యూపీఏ వ్యవహరం చూస్తే కాంగ్రెస్ తో పాటు ఇతర భాగస్వామ్య పార్టీల బలం కూడా అంతంతమాత్రమే కావటంతో మోడి ఫుల్లు ఖుషీగా ఉన్నారు. అందుకనే జనాలకు కూడా ప్రత్యామ్నాయం …
Read More »కొడాలి నానికి.. నందమూరి వారసుడి వార్నింగ్.. మ్యాటరేంటి?
ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని కి నందమూరి వారసుడు చైతన్య కృష్ణ వార్నింగ్ ఇచ్చారు. కొడాలి నాని… ఇటీవల చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైతన్య కృష్ణ.. కొడాలి నాని పై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేస్తూ నోటికొచ్చినట్లు తిడితే సహించేది లేదని హెచ్చరించారు. లోకేష్ జోలికి వస్తే తాటతీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే …
Read More »జగన్ కంపెనీపై హైకోర్టుకు వెళ్లిన ఎంపీ రఘురామ…
నరాసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇప్పుడు సింగిల్ ఎజెండాతో పని చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు.. వారికుటుంబానికి చెందిన వ్యాపార సంస్థలపై ఏదో ఒక లిటిగేషన్ ను తెర మీదకు తీసుకొచ్చి కోర్టును ఆశ్రయించటం అలవాటుగా మారింది. తాజాగా ఆ పరంపరలో మరో పిటిషన్ ను ఏపీ హైకోర్టులోదాఖలు చేశారు. జగన్ కంపెనీ అయిన సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్ లీజు …
Read More »బడ్జెట్ నిధులన్నీ పులివెందులకే.. జగనన్న దూకుడు
రాష్ట్రంలో ఇప్పటికీ అనేక నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగడం లేదని ఎమ్మెల్యేలు నెత్తీ నోరూ మొత్తు కుంటున్నారు. అది కూడా అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. అయితే.. ఆయా నియోజక వర్గాలకు నిధులు ఇచ్చేందుకు వెనుకాడుతున్న ముఖ్యమంత్రి జగన్.. తన సొంత నియోజకవర్గం కడప జిల్లా పులివెందులకు మాత్రం నిధులు పారిస్తున్నారు. ఇప్పటికే గడిచిన రెండేళ్లలో ప్రవేశ పెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్లలో పులివెందుల నియోజకవర్గానికి భారీ ఎత్తున …
Read More »జగన్ చనిపోయింది నిజమేనా ?
పోలీసులు చేసిన ప్రకటన నిజమే అయితే మావోయిస్టులకు పెద్ద దెబ్బ అనే అనుకోవాలి. మావోయిస్టు కేంద్రకమిటి సభ్యుడు, తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరినారాయణ అలియాస్ జగన్ మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. కొద్దిరోజులుగా కోవిడ్ తో బాధపడుతున్న జగన్ సోమవారం సాయంత్రం గుండెపోటుతో మరణించినట్లు బస్తర్ జిల్లా అడవుల్లో ఒక్కసారిగా ప్రచారం మొదలైంది. జగన్ మృతి వార్త వాస్తవమేనని దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ కూడా ధృవీకరించారు. …
Read More »ఎంపీ నవనీత్ కౌర్కు సుప్రీం ఊరట.. తాజా ఆదేశాలు ఇవే!
క్యాస్ట్ సర్టిఫికెట్ విషయంలో ఇటీవల కాలంలో తీవ్ర వివాదమైన ఎంపీ నవనీత్ కౌర్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ‘శీను-వాసంతి-లక్ష్మి’ మూవీతో ఫేమస్ అయిన.. నవనీత్కౌర్ మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా గత ఎన్నికల్లో విజయం సాధించారు. పార్లమెంటులో గట్టి వాయిస్ కూడా వినిపించే నాయకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. “మోడీ.. తన మనసులో మాటలు చెబుతున్నారు. కానీ, రైతుల మనసులో మాటలు కూడా వినిపించుకోండి. ఈ ప్రజలు …
Read More »ముంచుకొస్తున్న డెల్టా ఫ్లస్.. ఇది మరీ డేంజర్!
కరోనా మహమ్మారి మన దేశంలో విలయతాండవం సృష్టించింది. ఈ మహమ్మారి సెకండ్ వేవ్ లో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే.. దాని నుంచి కోలుకుంటున్నాం. కాగా.. అంతలోనే.. ఈ మహమ్మారి మరో రూపంలో పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండో దశలో అత్యధిక కేసులకు కారణమైన డెల్టా వేరియంట్.. ఇప్పుడు డెల్టాప్లస్ వేరియంట్గా రూపాంతరం చెందింది. దాంతో ప్రభుత్వాలు ఈ కొత్తరకం ప్రభావాన్ని అంచనా వేసే పనిలోపడ్డాయి. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates