ఏపీ సీఎం జగన్.. ప్రస్తుతం తన వైఖరి మార్చుకున్నారు. ప్రభుత్వం చేసేది ప్రజలకు చెప్పాలంటూ.. అధికారులకు చెబుతున్నారు. అంతేకాదు.. తన అనుకూల మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు సిద్ధపడాలంటూ.. లేఖలు సైతం రాశారు. మరి దీనికి కారణం.. ఏంటి? అంటే.. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన అనుచరులు చేస్తున్న వ్యతిరేక ప్రచారం వర్కవుట్ అవుతోందని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రజలకు సరైన …
Read More »రుయాసుపత్రిలో చనిపోయింది ఎంతమంది ?
ఘటన జరిగి 48 గంటలు అయిపోయినా రుయా ఆసుపత్రిలో చనిపోయింది ఎంతమంది అనే విషయమై జాబితా వెల్లడికాకపోవటమే విచిత్రంగా ఉంది. మామూలుగా దుర్ఘటన జరిగిన వెంటనే మృతుల జాబితాతో పాటు ఇతరత్రా వివరాలను అధికారయంత్రాంగం ప్రకటించేస్తుంది. అయితే తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారి సంఖ్యను ప్రకటించిన జిల్లా కలెక్టర్ జాబితాను మాత్రం విడుదల చేయకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఘటన జరగ్గానే 11 మంది చనిపోయినట్లు కలెక్టర్ …
Read More »ప్రధానిపై కిషన్ రెడ్డి కామెంట్.. అర్థం మారిపోయిందే
దేశంలో కరోనా ఉద్ధృతి రెండో దశలో ఇంతగా పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా అంతర్జాతీయ మీడియా దగ్గర్నుంచి సామాన్యుల వరకు అందరూ నిందిస్తున్నది ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాలనే. కరోనా సెకండ్ వేవ్ గురించి నిపుణులు హెచ్చరించినా మోడీ బృందం పెడచెవిన పెట్టిందని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని, ఎన్నికలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని.. ఫలితమే ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా మరణ మృదంగం అని అందరూ నిందిస్తున్నారు. …
Read More »తెలంగాణలో లాక్డౌన్.. కేసీఆర్ వ్యూహం
కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి నేపథ్యంలో దేశంలో మెజారిటీ రాష్ట్రాలు కొన్ని వారాల ముందు నుంచే లాక్ డౌన్ బాట పట్టాయి. దక్షిణాదిన తెలుగు రాష్ట్రాలు మినహా అన్ని స్టేట్స్లోనూ లాక్ డౌన్ పెట్టేశారు. ఏపీలో ఉదయం 6 నుంచి 12 వరకు మినహా కర్ఫ్యూ పెట్టడంతో దాదాపు లాక్ డౌన్ అమలు చేసినట్లే అయింది. కానీ చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నీ కరోనాను అదుపు చేయడానికి లాక్ డౌన్ మినహా …
Read More »కంచుకోటను టీడీపీ వదిలేసుకున్నట్టేనా ?
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యవహారం చూస్తే… పార్టీ అభిమానులు నివ్వెరపోతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ను టార్గెట్ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండడం మంచిదే అయినా.. క్షేత్ర స్థాయిలో బలంపై అంచనావేసుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రతిపక్షం పాత్ర పోషించినప్పటికీ.. మరోవైపు.. నియోజకవర్గాలపై దృష్టి పెడుతూనే ముందుకు సాగింది. ఏ నియోజకవర్గం లో ఏం జరుగుతోంది? ఏ నేత ఎలా వ్యవహరిస్తున్నారనే విషయంపై నిరంతరం మానిటరింగ్ చేసుకున్న …
Read More »జగన్ గుడ్ లుక్స్లో మాజీ సీఎం కొడుకు ?
ఏపీలో అధికార వైసీపీలో పదవుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నేతలకు పదవులు వచ్చాయి. గ్రామ, మండల, పట్టణ, నగర, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పదవులు వైసీపీ నేతలకే వచ్చేస్తున్నాయి. పై నుంచి కింద వరకు వైసీపీ అధికారం మామూలుగా లేదు. ఈ పదవుల సంగతి ఎలా ఉన్నా చట్ట సభల్లోకి ఎంట్రీ ఇచ్చే విషయంలో మాత్రం చాలా మంది ఆశలు పెట్టుకుని ఉన్నారు. …
Read More »జగన్ ఆరోపణలపై భారత్ బయోటెక్ స్పందన
ఓవైపు కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తుంటే.. ఈ సమయంలో ప్రాణాలు నిలిపే సంజీవనిగా భావిస్తున్న వ్యాక్సిన్ డిమాండుకు తగ్గట్లు సరఫరా లేక దేశవ్యాప్తంగా జనాలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వ్యాక్సిన్ నిల్వలు మరీ తక్కువగా ఉన్నాయి. కొత్త వాళ్లకు తొలి డోస్ వేయడం సంగతలా ఉంచితే.. ఇప్పటికే ఫస్ట్ డోస్ వేసుకుని, సెకండ్ డోస్ వేసుకోవాల్సిన గడువు రావడంతో టీకా కేంద్రాలకు వెళ్తుంటే నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. …
Read More »నిన్న భట్టి, నేడు డీఎస్… ఈటల స్పీడు పెంచేశారు
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్న సంకేతాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురై మంత్రివర్గం నుంచి గెంటేయబడ్డ ఈటల రాజేందర్… తన భవిష్యత్తు బాటను పక్కాగానే ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ బాట నిర్మాణంపై ఈటల జెట్ స్పీడుతో సాగుతున్న వైనం కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనంగా మంగళవారం రాత్రి టీపీసీసీ చీఫ్ మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయిన …
Read More »ఆ సీనియర్ నేతకు కేసీఆర్ రెండు బంపర్ ఆఫర్లు… పోటీ ఎక్కడో ?
తెలంగాణలో ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ హాట్గా ప్రకంపనలు రేపుతోంది. ఊహించని విధంగా ఈటలను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయడంతో పాటు ఆయన శాఖలకు కూడా కేసీఆర్ తీసేసుకున్నారు. ఇక ఆయన సొంత నియోజకవర్గం హుజూరాబాద్లో పరిణామాలు కూడా శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ ఉన్న పోలీసులు, ఎంఆర్వోలు, ఎంపీడీవోలు అందరూ మారిపోతున్నారు. ఈటల నియోజకవర్గంలో ఆయన మాట ఎంతమాత్రం చెల్లుబాటు కాకుండా చేసేశారు. ఇప్పుడు అక్కడ …
Read More »మంత్రి వెల్లంపల్లి నిర్వాకం.. జగన్ ఆఫీస్ నుంచి ఫోన్..!
విజయవాడకు చెందిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు సీఎంవో నుంచి ఫోన్ వచ్చిందట! ‘ఇలా చేస్తే.. ఎలా? ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిందంతా కూడా మట్టిపాలై పోయిందిగా..!’ అని సున్నితంగా ఓ కీలక సలహాదారుడు.. మందలించినట్టు విజయవాడ రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రస్తుతం కరోనా సమయంలో ప్రభుత్వం వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి.. 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇస్తోంది. ఈ క్రమంలో విజయవాడ నడిబొడ్డున …
Read More »హైకోర్టు ఆదేశాలు కూడా లెక్కచేయటం లేదా ?
అవును క్షేత్రస్ధాయి పరిస్ధితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కరోనా వైరస్ చికిత్స కోసం ఏపి నుండి హైదరాబాద్ కు వస్తున్న రోగులను తెలంగాణా సరిహద్దుల్లో పోలీసులు నిలిపేస్తున్నారు. సోమవారం నుండి కర్నూలు, కృష్ణాజిల్లా, గుంటూరు సరిహద్దుల్లో పోలీసులు ప్రత్యేకించి డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఏపిలోని ఏ ప్రాంతంనుండి తెలంగాణాలోకి ప్రవేశించాలనా పోలీసులు అడ్డుకుంటున్నారు. దాంతో చెక్ పోస్టులు, టోల్ గేట్ల దగ్గర పెద్ద గోల జరుగుతోంది. ఈ విషయాన్ని మీడియాలో తెలుసుకున్న …
Read More »జగన్ జీ.. ఈ వాదన కరెక్టేనా?
ఇండియాలో వ్యాక్సిన్ ఉత్పత్తి దిశగా అత్యంత వేగంగా పరిశోధనలు చేసి ‘కోవాగ్జిన్’ పేరుతో వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చి.. దాని పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది భారత్ బయోటెక్ సంస్థ. కరోనా కథ మొదలవడానికి చాలా ఏళ్ల ముందు నుంచే వ్యాక్సిన్, డ్రగ్స్ తయారీలో భారత్ బయోటెక్కు మంచి పేరుంది. ఈ సంస్థ యాజమాన్యంలో భాగమైన రేచస్ ఎల్లాకు రామోజీ మనవరాలికి కొన్నేళ్ల ముందు పెళ్లి జరిగింది. అప్పుడు భారత్ బయోటెక్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates