దేశంలోని ప్రముఖుల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించిందనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వంపై విచారణ సాధ్యమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పెగాసస్ అనే సాఫ్ట్ వేర్ ద్వారా కేంద్రం దేశంలోనే వందల మంది ప్రముఖుల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తోందనే వార్తలు ఆమధ్య దేశంలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఫోన్ల ట్యాపింగ్ పై ఎంతమంది కేంద్రాన్ని ప్రశ్నించినా సమాధానం రాలేదు. దాంతో కొందరు జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు సుప్రింకోర్టులో …
Read More »హుజూరాబాద్ ఫైనల్ రిజల్ట్ ఇదేనా ?
తెలంగాణలో ఎంతో ఉత్కంఠకు గురి చేస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక అంతిమ ఫలితం ఎలాగుండబోతోందనేది సస్పెన్సుగా మారిపోయింది. రోజుకో మలుపు తిరుగుతున్న ఉపఎన్నిక తీరుతో బెట్టింగుల జోరు విపరీతంగా పెరిగిపోతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమైతే ఇప్పటికే వందల కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగిందట. పోలింగ్ తేదీ 30 దగ్గరవుతున్నకొద్దీ బెట్టింగ్ జోరు మరింతగా పెరిగిపోతోంది. అందరిలోను అనేక రూపాల్లో టెన్షన్ పెంచేస్తున్న ఉప ఎన్నికలో అంతిమ విజయం బీజేపీ …
Read More »పార్టీ పెట్టి ఎనిమిదేళ్లు.. ఇంకా పార్ట్ టైం పాలిటిక్సేనా?
దేనికైనా ఒక కాలనిర్ణయం ఉంటుంది. నేడు తాజాగా ఉన్నది రేపటికి పాతదవుతుంది. ఇప్పుడు ఇదే వ్యాఖ్యలు.. జనసేన గురించి జోరుగా వినిపిస్తున్నాయి. ఈ పార్టీని కొత్తది అనుకోవాలా? పాతది అనుకోవాలా? అనేది చర్చ. ఎందుకంటే..పార్టీ పెట్టి 8 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ పార్టీకి బూత్ స్తాయిలో కార్యకర్తలు లేరు. కమిటీలూ లేవు.. ఇటీవల.. హైదరాబాద్లో జిల్లా పార్టీ అధ్యక్షుల సమావేశం నిర్వహిస్తే.. అంతా పేలవంగా కనిపించింది. దీంతో ఫొటోలనుకూడా మీడియాకు …
Read More »భూమన.. పెద్దల సభకేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కావాల్సినంత సస్పెన్స్ ఉంది. థ్రిల్లర్ సినిమాను మించి ఇప్పుడు ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం.. టీడీపీ కార్యాలయాలపై దాడులు ఇలా పరిణామాలు రసవత్తరంగా మారాయి. ఆ సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు వైసీపీ పార్టీలో ప్రధానంగా రెండు విషయాలపై చర్చలు సాగుతున్నాయి. అందులో ఒకటి.. కొత్త మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనేది కాగా.. మరొకటి వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎవరికి …
Read More »టీడీపీ దూకుడు : పబ్లిక్ టాక్ ఏంటి?
తాజాగా ఏపీలో జరిగిన ఘటనల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించిన తీరుపై నెటిజన్లు.. ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. రైట్ వేవ్లో బాబు రియాక్షన్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య జరిగిన వివాదంలో నేరుగా చంద్రబాబు జోక్యం చేసుకుని మంచి పనిచేశారని.. అంటున్నారు. నిజానికి ఇప్పుడు కనుక ఊరుకుని ఉంటే.. టీడీపీ పై ప్రజల్లో సానుభూతి పెరిగేది కాదని అంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు దీక్షకు …
Read More »వచ్చే రెండున్నరేళ్లకు వైసీపీ సూపర్ ప్లాన్…!
ఏపీ అధికార పార్టీ వైసీపీ.. వచ్చే రెండున్నరేళ్లకు సంబంధించి మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసుకుందా ? బలమైన పార్టీగా ఉన్న వైసీపీ.. మరింత బలంగా దూసుకుపోయేందుకు రెడీ అవుతోందా ? అంటే.. తాజాగా మారుతు న్న పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. ఈ ఏడాది చివరిలో అంటూ రాబోయే రెండు మాసాల్లోనే సీఎం జగన్ రెండు సంచలన నిర్ణయాలు తీసుకునే వీలుందని చెబుతున్నారు. వీటిలో ఒకటి.. మంత్రి వర్గాన్ని …
Read More »బీజేపీ మేనిఫెస్టో విడుదల.. హుజురాబాద్ ప్రజలకు ఆఫర్లు
హుజురాబాద్ ఉప ఎన్నిక మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో సంక్షేమానికి పెద్ద పీఠ వేశారు. రైతులు, విద్యార్థులు, బాలికలు మహిళల సంక్షేమమే ధ్యేయంగా మెనిఫెస్టో రూపొందించారు. అన్ని రంగాలకు సుముచిత స్థానం కల్పించిన ఈ మోనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్చుగ్ మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఇందులో నియోజకవర్గ ఓటర్లను ఆకర్షించేందుకు భారీ ఆఫర్లు ప్రకటించారు. హుజురాబాద్లో బీజేపీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కచ్చితంగా …
Read More »అన్న కోసం కష్టపడుతున్న చెల్లి
తన అన్నకు ఢిల్లీ పీఠాన్ని అందించేందుకు.. కేంద్రంలో గద్దెనెక్కించేందుకు ఆ చెల్లి తీవ్రంగా కృషి చేస్తోంది. దేశంలో బలహీన పడ్డ పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు అవసరమైన అవకాశాన్ని రెండు చేతులా అంది పుచ్చుకోవడం కోసం ఆ చెల్లి అహర్నిశలూ కష్టపడుతున్నారు. ఇంతకీ ఆ చెల్లి ఎవరంటే.. ప్రియాంక గాంధీ. ఆ అన్న మరెవరో కాదు రాహుల్ గాంధీ. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో జరిగే రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో …
Read More »కేసీఆర్కు పూర్తి స్వేచ్ఛ ఉంది: అనిల్
దళితుల సాధికారత కోసమే దళిత బంధు పథాకాన్ని తీసుకువచ్చామని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. ఈ పథకాన్ని సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని గులాబీ నేతలు కూడా చెబుతున్నారు. తెలంగాణలో అన్ని పార్టీల నేతలు దళిత బంధు పథాకాన్ని స్వాగతించారు. అయితే అమలుపై అనేక సందేహాలు వ్యక్తం చేశారు. దళిత బంధు పథకాన్ని ఎన్నికల స్టంట్అని కూడా విమర్శించారు. ఎందుకంటే హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఈ పథకాన్ని కేసీఆర్ ప్రకటించారు. …
Read More »ఈ సారి మేనిఫెస్టో ఇలా వద్దు సార్.. జగన్ కు మంత్రి సలహా
వైసీపీ ప్రభుత్వంలో కీలక శాఖను చూస్తున్న ఓ మంత్రి తాజాగా నేరుగా ముఖ్యమంత్రితోనే ఫైరయ్యారనే వ్యాఖ్యలు వైసీపీ నేతల మధ్య గుసగుసగా సాగుతున్నాయి. “ఈ సారి మేనిఫెస్టో ఇలా వద్దు సార్!!” అంటూనే.. మీరు హామీలు ఇచ్చి.. మౌనంగా ఉంటారు.. డబ్బులు తేలేక మేం ఛస్తున్నాం!! అంటూ.. ఆయన అసహనం కూడా వ్యక్తం చేశారట. పేరు చెప్పేందుకు ఎవరూ సాహసించడం లేదు కానీ.. ఆ మంత్రి మాత్రం సీఎంపైనే ఫైరయ్యారనేది …
Read More »బాబుకు జ్ఞానోదయం.. మళ్లీ మళ్లీ కుప్పం టూర్ !
తెలుగు దేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇప్పటికీ జ్ఞానోదయమైందా? ఇన్ని రోజులుగా తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని పట్టించుకోని ఆయన ఇప్పుడు దానిపై ప్రత్యేక దృష్టి సారించారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పరిషత్ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీని దెబ్బ కొట్టిన వైసీపీ మంచి ఫలితాలు సాధించింది. దీంతో బాబు సొంత నియోజకవర్గంలోనే టీడీపీకి దెబ్బ పడింది. మరోవైపు వైసీపీ కూడా …
Read More »కేసీఆర్ మాటలకు అర్థాలే వేరులే!
రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా దాని వెనక ఓ పరమార్థం ఉంటుందని అంటారు. తమ రాజకీయ ప్రయోజనాల కోణంలోనే ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకుని అందుకు అనుగుణంగానే మాట్లాడుతారు. అందుకే ఏవరైనా నాయకుడు ఏదైనా మాట్లాడితే దాని వెనక ఇంకేం అర్థం ఉందో అనే వెతకాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఇక రాజకీయ చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అంతటి వ్యక్తి ఏవైనా వ్యాఖ్యలు చేశారంటే వాటి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates