ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై కేంద్రంలోని ఎస్సీ కమిషన్ సీరియస్ అయింది. రాష్ట్రంలో మత మార్పిడులు జరుగుతున్నాయా? లేదా? అని ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఎందుకు సమాచారం ఇవ్వడం లేదు? అని నిలదీసింది. మీరు సమాధానం ఇవ్వడం లేదంటే.. మత మార్పుడులు జరుగుతున్నాయన్న పిటిషనర్ల వాదనతో తాము ఏకీభవించాల్సి ఉంటుందని.. హెచ్చరించింది. ఇదే జరుగుతున్నట్టు భావిస్తే.. చర్యలకు ఉపక్రమిస్తామని.. నిజాలను దాచడం కూడా నేరమేనని.. స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర …
Read More »అమరావతి అందరిదీ…హైకోర్టు సీజే మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు
అమరావతి రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దు చట్టం, పాలనా వికేంద్రీకరణ చట్టాలపై హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పిటిషన్ల విచారణలో జాప్యం జరిగిందని, త్వరగా వీటి విచారణ పూర్తి చేస్తామని నూతన సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు. ఈ క్రమంలోనే నేడు ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు …
Read More »బీజేపీకి భారీ మైనస్ ?
తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మైనస్ లు తప్పేట్లు లేదు. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ జరిపిన సర్వేలో పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోను కమలం పార్టీయే అధికారంలోకి వస్తుందని ఓ అంచనా. అయితే అన్ని రాష్ట్రాల్లోను పెద్ద మైనస్ తప్పేట్లు లేదని స్పష్టంగా కనబడుతోంది. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ పరిస్ధితి ఎలాగున్నా ఉత్తరప్రదేశ్ లో మాత్రం పెద్ద ఎత్తున సీట్లను కోల్పోబోతున్నట్లు సర్వేలో బయటపడిందట. …
Read More »ఈటల స్థానాన్ని భర్తీ చేయబోతున్న కేసీఆర్!
కేసీఆర్ వ్యూహాలు ఓ పట్టాన ఎవరికీ అర్థం కావు. ప్రత్యర్థులు అర్థం చేసుకునే లోపే ఆయన తన పనిని పూర్తి చేస్తారు. ఎవరికీ అంతుచిక్కకుండా ఆయన వ్యూహాలుంటాయి. చివరికి గులాబీ పార్టీ నేతలకు కూడా ఆయన చిక్కరు. అంతా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. భవిష్యత్తును ఇప్పుడే అంచనా వేసి పావులు కదపడంలో కేసీఆర్ దిట్ట. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో అందరి ఊహాగానాలను భిన్నంగా వ్యవహరించి.. గులాబీ శిబిరానికి కూడా కొత్త …
Read More »సీఎం జగన్ రియాక్షన్.. భేష్.. నెటిజన్ల ఫిదా!!
ఏపీ సీఎం జగన్.. ఒక విషయంపై ఇమ్మిడియెట్గా రియాక్ట్ అయ్యారు. తాను ప్రయాణిస్తున్న మార్గంలో దుర్వాసన రావడం.. గమనించిన ఆయన.. దీనిపై అధికారులను నిలదీశారు. వెన్వెంటనే వారిని రంగంలోకి దింపి.. అసలు ఏం జరిగిందనే విషయంపై ఆరా తీసి.. సమస్య పరిష్కారానికి కృషి చేశారు. విషయం ఏంటంటే.. జాతీయ రహదారి వెంట తీవ్రమైన దుర్వాసన వెదజల్లడంపై.. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో …
Read More »బాబుకు అక్కడ ఇద్దరు శత్రువులు
కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక అధికార వైసీపీకి అనుకూలంగా వచ్చేట్లే ఉంది. పోలింగ్ తుది దశకు వచ్చిన దశలో చంద్రబాబునాయుడు మాట్లాడిన మాటలతో అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోయాయి. ఎన్నికలో గెలవటం కోసం అధికార వైసీపీ ఇన్ని దౌర్జన్యాలు చేయాలా ? అధికార పార్టీ నేతలు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా ? అంటు పలు విమర్శలు చేశారు. వైసీపీ నేతలను శాపనార్థాలు పెట్టారు. వైసీపీ నేతలు దగ్గరుండి మరీ దొంగ ఓట్లు …
Read More »కాంగ్రెస్ చేజేతులారా!
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి జోరుతో రాష్ట్రంలో తిరిగి పుంజుకుంటున్న పార్టీ.. మరింత బలోపేతం అయేందుకు వచ్చిన అవకాశాన్ని చేజేతులారా వదులుకుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలవకముందు ఆయన్ని పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేశారని సమాచారం. ఈటల లాంటి నాయకుడు పార్టీలోకి వస్తే ఓ ఎమ్మెల్యే సీట దక్కడంతో పాటు ప్రజల్లో పార్టీ మరింత …
Read More »దొంగ ఓటర్లు, పోలీసు లాఠీ చార్జీలు..చంద్రబాబు ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని కుప్పం మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. అయితే.. అడుగడుగునా వివాదాలు.. దొంగ ఓటర్లు, పోలీసు లాఠీ చార్జీలు.. ఇలా.. తీవ్ర వివాదానికి కేంద్రంగా ఈ ఎన్నికలు మారిపోయాయి. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చరిత్రలో ఎన్నికలను ఇంత అపహాస్యం చేసిందెన్నడూ లేదని చంద్రబాబు అన్నారు. కుప్పం మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్లో …
Read More »అమరావతిని ఇలా చేస్తారా? జగన్ సర్కారుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..
ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రాష్ట్రంలో జగన్ వచ్చిన తర్వాత..అభివృద్ధి జరగడం లేదని.. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని.. పెట్టుబడులు కూడా రావడం లేదని.. పెద్ద ఎత్తున విమర్శలు చేస్తో్ంది. అయితే.. దీనిని కొందరు రాజకీయ దృష్టితోనే చూశారు. అయితే.. ఇప్పుడు.. రాష్ట్ర హైకోర్టు కూడా ఇదే వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి అంతా నిలిచిపోయినట్లు అనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాష్ట్ర రాజధాని …
Read More »ఆమెతో విభేదాలు.. ఆయనకు నో ఎమ్మెల్సీ!
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్.. సొంత పార్టీకే చెందిన కీలక నేతకు మాత్రం విస్మరించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీఎంకు విధేయుడిగా ఉన్నప్పటికీ ఆయన ఎమ్మెల్సీ ఆశ మాత్రం తీరలేదని చెప్తున్నారు. అందుకు ప్రధాన కారణంగా ఓ మహిళా ఎమ్మెల్యే అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకీ ఆ నేత ఎవరంటే.. మర్రి రాజశేఖర్. గుంటూరు జిల్లాకు చెందిన ఈ సీనియర్ నేతకు ఈ సారి …
Read More »సోలోగానే కాంగ్రెస్.. అయ్యేనా సక్సెస్
వచ్చే ఏడాది దేశంలో జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచి దృష్టి సారించాయి. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేయాలంటే ఇప్పుడీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తమ సత్తా చాటడం పార్టీలకు కీలకం. అందుకే కేంద్రంలో అధికారంలో …
Read More »ప్రపంచకప్కు విలువ లేకుండా పోయిందే
భారత జట్టు ఈసారి టీ20 ప్రపంచకప్ సెమీస్ కూడా చేరకపోవడం టోర్నీ ముందే కళ తప్పింది. అయినా సరే.. సెమీఫైనల్ మ్యాచ్లు రసవత్తరంగా సాగడంతో మళ్లీ కొంతమేర టోర్నీ మీద ఆసక్తి కలిగింది. కానీ ఫైనల్ ఏకపక్షంగా సాగడంతో ఆసక్తి సన్నగిల్లిపోయింది. మ్యాచ్ చప్పగా మారిపోయింది. ముగింపులో ఉత్కంఠే లేదు. ఏ ఎగ్జైట్మెంట్ లేకుండా ప్రపంచకప్ ముగిసిపోయింది. 2015, 2019 వన్డే ప్రపంచకప్పుల్లో ఫైనల్ దాకా వచ్చి చివరి మెట్టుపై …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates