తిరుమల శ్రీవారి లడ్డూపై ప్రజల ఆలోచన ఎలా ఉంది? వారు ఏమన్నారు? ముఖ్యంగా వైసీపీ హయాంలో ఎలాంటి అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమైంది?.. ఇదీ.. ఇప్పుడు తెరమీదికి వచ్చిన కీలక విషయం. ఐ-టీడీపీ విభాగం.. గతంలో సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు సోషల్ మీడియాలో శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసిన కామెంట్లను, పోస్టులను గుదిగుచ్చి.. ఇప్పుడు ప్రచారంలోకి తీసుకువచ్చారు. దీనిలో పదుల సంఖ్యలో పోస్టులు కనిపిస్తున్నాయి.
చాలా మంది చెప్పిన ఏకైక కారణం.. నెయ్యి గురించే. నెయ్యి వాసన రావడం లేదని.. నూనె మాదిరిగా ఉందని..ముక్క కంపు కొడుతోందని ఎక్కువ మంది పేర్కొన్నారు. మరికొందరు కనీసం.. ఒక్కరోజు కూడా నిల్వ ఉండడం లేదన్నారు. ఇంకొందరు తమ స్థానిక దేవాలయాల్లో కూడా ఇలాంటి ప్రసాదాలు ఎప్పుడూ పెట్టలేదని వ్యాఖ్యానించారు.
ఇవన్నీ.. 2020-23 మధ్య చేసిన పోస్టులే కావడం గమనార్హం. అంతేకాదు.. వారు తమ భక్తికి కొంత పరిధిలు వేసుకుని.. `ఇంతకన్నా వ్యాఖ్యానించలేక పోతున్నాం.“ అని చెప్పడం కూడా ఈ పోస్టుల్లో స్పష్టంగా ఉంది.
ఎందుకిలా?
ప్రస్తుతం.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం.. కేవలం రాజకీయం కోసమేనని వైసీపీ ఎదురు దాడి చేస్తోంది. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఉద్దేశ పూర్వకంగానే తమపై దాడి చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారానికి, రాజకీయాలకు సంబంధం లేదని.. సామాన్య భక్తుల మనోభావాలనే తాము ప్రస్తావిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. దీనికి బలమైన ప్రాతిపదిక కనిపిస్తున్నా.. ప్రచారంలో వెనుకబడి ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. సాధారణ భక్తులు గతంలో చేసిన పోస్టులను ఇప్పుడు తెరమీదికి తీసుకువచ్చారు. ఇది రాజకీయం కాదని నిరూపిస్తున్నారు.
This post was last modified on February 7, 2026 7:50 pm
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…
మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…
రేపు ప్రారంభం కావాల్సిన పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏప్రిల్ 8కి వాయిదా వేయడం అభిమానుల్లో ఖంగారు పుట్టిస్తోంది.…