తిరుమల శ్రీవారి లడ్డూపై ప్రజల ఆలోచన ఎలా ఉంది? వారు ఏమన్నారు? ముఖ్యంగా వైసీపీ హయాంలో ఎలాంటి అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమైంది?.. ఇదీ.. ఇప్పుడు తెరమీదికి వచ్చిన కీలక విషయం. ఐ-టీడీపీ విభాగం.. గతంలో సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు సోషల్ మీడియాలో శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసిన కామెంట్లను, పోస్టులను గుదిగుచ్చి.. ఇప్పుడు ప్రచారంలోకి తీసుకువచ్చారు. దీనిలో పదుల సంఖ్యలో పోస్టులు కనిపిస్తున్నాయి.
చాలా మంది చెప్పిన ఏకైక కారణం.. నెయ్యి గురించే. నెయ్యి వాసన రావడం లేదని.. నూనె మాదిరిగా ఉందని..ముక్క కంపు కొడుతోందని ఎక్కువ మంది పేర్కొన్నారు. మరికొందరు కనీసం.. ఒక్కరోజు కూడా నిల్వ ఉండడం లేదన్నారు. ఇంకొందరు తమ స్థానిక దేవాలయాల్లో కూడా ఇలాంటి ప్రసాదాలు ఎప్పుడూ పెట్టలేదని వ్యాఖ్యానించారు.
ఇవన్నీ.. 2020-23 మధ్య చేసిన పోస్టులే కావడం గమనార్హం. అంతేకాదు.. వారు తమ భక్తికి కొంత పరిధిలు వేసుకుని.. `ఇంతకన్నా వ్యాఖ్యానించలేక పోతున్నాం.“ అని చెప్పడం కూడా ఈ పోస్టుల్లో స్పష్టంగా ఉంది.
ఎందుకిలా?
ప్రస్తుతం.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం.. కేవలం రాజకీయం కోసమేనని వైసీపీ ఎదురు దాడి చేస్తోంది. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఉద్దేశ పూర్వకంగానే తమపై దాడి చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారానికి, రాజకీయాలకు సంబంధం లేదని.. సామాన్య భక్తుల మనోభావాలనే తాము ప్రస్తావిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. దీనికి బలమైన ప్రాతిపదిక కనిపిస్తున్నా.. ప్రచారంలో వెనుకబడి ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. సాధారణ భక్తులు గతంలో చేసిన పోస్టులను ఇప్పుడు తెరమీదికి తీసుకువచ్చారు. ఇది రాజకీయం కాదని నిరూపిస్తున్నారు.
This post was last modified on February 7, 2026 7:50 pm
కొందరు నటులు పెద్ద పెద్ద పాత్రలు చేయకపోయినా.. చిన్న చిన్న క్యారెక్టర్లతోనే ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతారు. పావలా శ్యామల అలాంటి…
సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని అందరూ భావిస్తారు. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడికి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఏదో ఒక అడ్డంకి ఎదురు కావడం కామన్ అయిపోయింది. పవన్ ప్రతిపక్షంలో ఉండగా…
టాక్సిక్ తప్పుకుని మార్చి 19 ఉస్తాద్ భగత్ సింగ్ రావడం కన్ఫర్మ్ అయ్యాక ఇప్పుడు డెకాయిట్ గురించిన చర్చ మూవీ…
గత ఏడాది తండేల్ తో సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య ఈసారి వృషకర్మగా రాబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్…
ఫిబ్రవరి మొత్తం దాదాపుగా డ్రైగా గడిపేసిన టాలీవుడ్ బాక్సాఫీస్ మార్చిలో మంచి బోణీ కోసం ఎదురు చూస్తోంది. ఎంత పిల్లల…