మార్చి 19 విడుదల కాబోతున్న దురంధర్ 2 ది రివెంజ్ మీద నెలకొన్న హైప్ ఎంతో మళ్ళీ చెప్పనక్కర్లేదు. దీని పంపిణి కోసమే జియో స్టూడియోస్ సంస్థ హైదరాబాద్ లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టడం కన్నా సెన్సేషన్ ఇంకేముంటుంది.
ఏపీ తెలంగాణ కలిపి ఎంతలేదన్నా వంద కోట్లకు పైగా గ్రాస్ వర్కౌట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు ముందస్తు అంచనా వేస్తున్నాయి. అయితే యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇది సాధ్యమే కానీ కాంపిటీషన్ లో ఉన్న టాక్సిక్ వల్ల వసూళ్లు ప్రభావితం చెందటం గురించి నిర్మాతల్లో కొంచెం టెన్షన్ లేకపోలేదు. దీన్నలా ఉంచితే దురంధర్ కి సంబంధించి మరో ఆసక్తికరమైన లీక్ చక్కర్లు కొడుతోంది.
దాని ప్రకారం ఈ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ రెండో భాగంతో ఆగిపోవడం లేదట. ఫస్ట్ పార్ట్ లో సస్పెన్స్ లో పెడుతూ వచ్చిన బడే సాబ్ ని క్లైమాక్స్ లో ప్రవేశపెట్టి అతనికి, రణ్వీర్ సింగ్ పోషించిన హంజా పాత్రకు మధ్య యుద్ధాన్ని ఫైనల్ అండ్ కంక్లూజన్ గా మూడో భాగంలో చూపిస్తారని ముంబై వర్గాల కథనం.
బడే సాబ్ గా ఇమ్రాన్ హష్మీ దాదాపు ఖరారేనని, దానికి సంబంధించిన షూట్ కూడా ఇటీవలే చేశారని అంటున్నారు. మరి దురంధర్ 2లో ఏముంటుందనే అనుమానం రావడం సహజం. పంజాబ్ కు చెందిన హంజా కుటుంబం ఎలాంటి దురాగతానికి బలయ్యిందో చూపిస్తూ దానికి ప్రతీకారం సీక్వెల్ లో ఉంటుందట.
అంటే హంజా జీవితం నాశనం కావడానికి దోహదం చేసిన వాళ్ళు పాకిస్థాన్ మాఫియా గ్యాంగ్ సభ్యులు కాబట్టి వాళ్ళను తుదముట్టించేందుకే మాధవన్ అడగ్గానే గూఢచారిగా వెళ్ళడానికి రణ్వీర్ సింగ్ ఒప్పుకున్నాడనేది అంతర్గతంగా వినిపిస్తున్న మాట.
ప్రస్తుతం ఇవన్నీ స్పెక్యులేషన్ల దశలో ఉన్నాయి కాబట్టి నిజమని చెప్పలేం కానీ సంజయ్ దత్ ఈసారి ఎక్కువసేపు రచ్చ చేస్తారని వినిపిస్తోంది. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ రూపంలో వస్తున్న దురంధర్ 2లో దర్శకుడు ఆదిత్య దార్ భార్య, హీరోయిన్ యామిని ధార్ ఒక స్పెషల్ క్యామియో చేసిందని అంటున్నారు. చూడాలి నిజమో కాదో.
This post was last modified on February 7, 2026 6:37 pm
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…