హైదరాబాద్ లో రోజురోజుకూ పాశ్చత్య సంస్కృతీ పెరిగిపోతుంది. కో లివింగ్ పీజీలు ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఉద్యోగం, చదువు పేరుతో మహా నగరంలో అడుగుపెట్టిన యువత రంగురంగుల లోకంలో పడిపోతున్నారు. తేనే పూసిన కత్తులతో దోస్తీ చేస్తున్నారు. ఇలాంటి వారి బలహీనతలను క్యాష్ చేసుకుందుకు కొందరు మోసగాళ్లు వల వేస్తున్నారు.
అందమైన అబ్బాయిలను ఎరగా వేసి అమ్మాయిలను మోసం చేసేందుకు తెగిస్తున్నారు. ఇందులో భాగమే అద్దెకు బాయ్ ఫ్రెండ్. మార్కెట్లో వస్తువులకు ఇచ్చినట్లు వీరికి భారీ ఆఫర్లు.. డిస్కౌంట్లు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం చూసిన జనాలు నోటి మీద వేలేసుకుంటున్నారు. హతవిధి.. ఏం పోయే కాలం దాపురించింది అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఈ గంట, అరగంట బాయ్ ఫ్రెండ్ల ఫీజు వివరాలు ఇలా వున్నాయి.
ఇన్ స్టా, టెలిగ్రామ్,ఫేస్ బుక్ వేదికగా 1st ఆగస్టు స్పెషల్ – 50% ఆఫ్. రెంట్ బాయ్ ఫ్రెండ్, యువర్ పర్సనల్ కంపానియన్ అంటూ రకరకాల డిస్కౌంట్ ప్యాకేజీలను ప్రచారం చేస్తున్నారు. కాఫీ మీట్ కు రూ. 499 , సినిమా డేట్ కు రూ.1249, షాపింగ్ కు రూ. 1499, ఈవెంట్లకు, పెళ్లిళ్లకు తోడుగా వచ్చేందుకు రూ. 1999, 10 గంటల ఫుల్ ప్యాకేజి 4,499లంటూ మెనూ కార్డు ప్రచారం చేస్తున్నారు. అందమైన అబ్బాయిల ఫోటోలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ప్రకటన చూసిన వెంటనే హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇదంతా సైబర్ నేరగాళ్ళు విసురుతున్న డేటింగ్ ట్రాప్ అని హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జన్నార్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. రెంట్ బాయ్ ఫ్రెండ్ ప్రకటనపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
ఇలాంటి ప్రకటనలు ఎవరూ నమ్మవద్దని, పొరపాటున కూడా డబ్బులు చెల్లించవద్దని తెలిపారు. అపరిచిత వ్యక్తులతో కలిసి తిరిగితే చేజేతులా సమస్యలు కొని తెచ్చుకున్నట్టేనని, ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి మోసం చేసే అవకాశం వుందని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేయొద్దని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే 1930 కు కాల్ చేయాలని సూచించారు. తల్లీదండ్రులు కూడా పిల్లలపై ఒక కన్నేయాలని, ఏం చేస్తున్నారు, ఎవరితో ఛాటింగ్ చేస్తున్నారన్నది గమనించాలని కమిషనర్ సజ్జన్నార్ సలహా ఇచ్చారు.
This post was last modified on August 8, 2026 8:59 pm
తెలుగు సినిమా నటులు రాజకీయాలు చేయడం ఎప్పట్నుంచో ఉన్నదే. కానీ ఈ మధ్య పరిస్థితులు మారిపోయాయి. సినిమాలు వేరు, రాజకీయాలు…
ఈ వారం భారీ సినిమాల ట్రైలర్లు వరసగా రోజుకొకటి సందడి చేశాయి. అన్నీ పెద్ద అంచనాలు పెట్టుకున్న చిత్రాలు కావడంతో…
కొన్ని సినిమాలకు మంచి టాక్ వచ్చినా అవి థియేట్రికల్ గా భారీ రెవెన్యూలు చూపించకపోవచ్చు. అంత మాత్రాన వాటిని ఫ్లాప్…
ఒకప్పుడు లక్షలాది రూపాయల కట్నకానుకలు ముట్టచెబితేనే కానీ అమ్మాయిల పెళ్లిళ్లు కావడం కష్టమయ్యేది. లేకపోతే అత్తారింటి వేధింపులు భరించాల్సి వచ్చేది.…
500, 1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత భారత దేశంలో యూపీఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు వీధిలో కూరగాయల…
2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు పార్టీల…