Political News

ఖ‌మ్మం పాలిటిక్స్‌లో నాడు తుమ్మ‌ల‌.. నేడు పువ్వాడ‌.. సేమ్ సీన్‌!

తెలంగాణ‌-ఏపీ స‌రిహ‌ద్దు జిల్లాగా ఉన్న ఖ‌మ్మం రాజ‌కీయాల్లో నేత‌లు మారారు. కానీ, రాజ‌కీయ వైఖ‌రులు మాత్రం మార‌లేద‌నే టాక్ స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. గ‌తంలో మాజీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు హ‌వా చ‌లాయించారు. ఆయ‌న ఎవ‌రినీ ఎద‌గ‌నిచ్చేవారు కాద‌నే టాక్ ఉంది. అంతేకాదు.. ఆయ‌న అనుమ‌తి లేకుండా.. అధికారులు పూచిక పుల్ల‌ను కూడా క‌ద‌ల‌నిచ్చేవారు కాదు. దీంతో ఏ ప‌ని కావాల‌న్నా.. ఎంత‌టి వారైనా.. తుమ్మ‌ల సార్ అనుమ‌తి …

Read More »

కేసీఆర్ హ‌వాకు దుబ్బాక బ్రేకులు వేస్తుందా?

తెలంగాణ‌లోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ఇటీవ‌ల ముగిసిన ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించిన రిజ‌ల్ట్ ఇంకా రాలేదు. అయితే, ఎగ్జిట్ పోల్ ఫ‌లితంలో మాత్రం బీజేపీకి అవ‌కాశం ఉంద‌నే సంకేతాలు వచ్చాయి. మ‌రికొన్ని సంస్థ‌లు టీఆర్ఎస్ గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నాయి. ఒక‌వేళ‌.. మొద‌టి అంచ‌నానే నిజ‌మైతే.. అంటే.. దుబ్బాక‌లో బీజేపీనే గెలుపు గుర్రం ఎక్కితే.. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ దూకుడుకు బ్రేకులు ప‌డ‌తాయ‌నే వ్యాఖ్య‌లు ఓ …

Read More »

తాళ్ళపాక దంపతుల రాజీనామా ..టీడీపీలో కలకలం

తెలుగుదేశం పార్టీని ఎన్టీయార్ పెట్టినప్పటి నుండి యాక్టివ్ గా పనిచేస్తున్న తాళ్ళపాక రమేష్ రెడ్డి దంపతులు రాజీనామా చేయటం పార్టీలో సంచలనంగా మారింది. సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమను కాదని కొత్తగా వచ్చిన వారిని కూడా చంద్రబాబునాయుడు అందలం ఎక్కిస్తున్నాడన్న కోపంతోనే తాము రాజీనామా చేసినట్లు తాళ్ళపాక రమేష్ రెడ్డి చెప్పటం గమనార్హం. గతంలో ఎన్టీయార్ ను బూతులు తిట్టిన వారిని, ఎన్టీయార్ దిష్టిబొమ్మలను దహనం చేసిన వారికి …

Read More »

వైసీపీ సోషల్ మీడియా టీంలో అసంతృప్తా ?

జరుగుతున్నది చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు 2014 నుండి మొన్నటి ఎన్నికల వరకు అలుపెరగకుండా గట్టిగా కృషి చేస్తున్న సోషల్ మీడియా విభాగాన్ని పెద్దలు నిర్లక్ష్యం చేస్తున్నారనే అసంతృప్తి మొదలైంది. నిజానికి 2014లో తెలుగుదేశంపార్టీ విజయం సాధించటంలో పార్టీ సోషల్ మీడియా విభాగానిది చాలా కీలక పాత్రనటంలో సందేహం లేదు. అయితే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకనో టీడీపీ పెద్దలు సోషల్ మీడియా విభాగాన్ని …

Read More »

త‌మ్మినేని కోసం బ‌ల‌య్యేదెవ‌రు? వైసీపీలో చ‌ర్చ‌!

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారామ్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సిందే-ఇదీ కొన్నాళ్లుగా వైసీపీ నేత‌ల్లో వినిపిస్తున్న మాట‌. దీనికి కార‌ణం.. ఆయ‌న రాజ్యాంగ బ‌ద్ధ‌మైన స్పీక‌ర్ ప‌ద‌విలో ఉండి కూడా రాజ‌కీయాల ‌ను మాట్లాడ‌లేకుండా ఉండ‌డ‌మే! గతంలోనూ చంద్ర‌బాబు హ‌యాంలో మంత్రి ప‌ద‌విని అలంక‌రించిన ఆయ‌న‌.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో చాలా ఏళ్ల విరామం త‌ర్వాత నెగ్గిన నేప‌థ్యంలో బీసీ కోటాలో మంత్రి ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, జ‌గ‌న్ …

Read More »

కేంద్రాన్ని క‌డిగేసిన కేటీఆర్

తెలంగాణ‌లో టీఆర్ఎస్ వెర్స‌స్ కాంగ్రెస్ పాత క‌థ‌. ఇప్పుడంతా టీఆర్ఎస్ వెర్స‌స్ బీజేపీనే. కాంగ్రెస్‌ను ప‌క్క‌కు నెట్టేసి బీజేపీనే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షస్థానంలోకి వ‌చ్చేసింది. టీఆర్ఎస్‌ను గ‌ట్టిగా ఢీకొడుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక సంద‌ర్భంగా రెండు పార్టీ మ‌ధ్య వైరం ఏ స్థాయిలో సాగిందో తెలిసిందే. అక్క‌డ టీఆర్ఎస్ అభ్య‌ర్థికి బీజేపీ క్యాండిడేట్ గ‌ట్టి పోటీనే ఇచ్చాడ‌ని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఐతే త‌మ పార్టీని బీజేపీ ఎంత‌గా టార్గెట్ చేస్తుంటే.. …

Read More »

ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న ఆ కేసు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓ విషాదాంతం అంద‌రినీ క‌ల‌చి వేస్తోంది. ఒక సీఐ వేధింపులు తాళ‌లేక ఒక కుటుంబం మొత్తం ఆత్మ‌హత్య‌కు పాల్ప‌డ‌టం, చ‌నిపోవ‌డానికి ముందు త‌మ దీన స్థితిని తెలియ‌జేస్తూ వీడియో రిలీజ్ చేయ‌డం, ఆ వ్య‌క్తి మైనారిటీ కావ‌డంతో సంబంధిత కేసు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌కు చెందిన ఆటో డ్రైవ‌ర్ అబ్దుల్ స‌లాం కుటుంబం ఇటీవ‌ల కౌలూరు ప్రాంతంలో రైలు ప‌ట్టాల‌పై ప‌డుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. అబ్దుల్‌తో …

Read More »

ఆ ఎంఎల్ఏ కు క్యాడర్ తో గొడవలే గొడవలు

అవును మీరు చదివింది కరెక్టే. ఎవరైనా పార్టీలో ఇమడలేకపోవచ్చు కానీ ఏకంగా రాజకీయాల్లోనే ఇమడలేక పోవటం ఏమిటనే సందేహం రావచ్చు. ఈ కథనం మొత్తం చదవితే విషయం అర్ధమైపోతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా గూడురు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటిచేసి గెలిచిన వరప్రసాద్ వ్యవహారమే పార్టీలో ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గడచిన ఆరున్నరేళ్ళుగా ఎంఎల్ఏకి ప్రతిరోజు నేతలతోను, క్యాడర్ తోను గొడవలు …

Read More »

టీడీపీ ఉత్తరాంధ్ర నేతలపై బీజేపీ కన్నేసిందా ?

అవుననే అంటున్నారు కమలంపార్టీ నేతలు. ఇందుకు ముందుగా ఉత్తరాంధ్రను వేదికగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. టీడీపీలో సంవత్సరాల పాటు కీలకంగా ఉన్న విజయనగరం జిల్లా నేత గద్దె బాబురావును బీజేపీలో చేర్చుకోవటం ఇందులో భాగమనే అంటున్నారు. గద్దె కూడా అనేక కారణాల వల్ల చంద్రబాబునాయుడు నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. ఈ విషయాన్ని కమలనాధులు గ్రహించారు. అందుకనే చురుగ్గా పావులు కదిపారు. కొందరు సీనియర్లను గద్దెతో మాట్లాడించారు. దాంతో గద్దె కూడా …

Read More »

పోలవరం..ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారా ?

పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేందుకు తాజాగా మొదలైన నిధుల వివాదం కారణంగా జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారా ? పార్టీ నేతల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్ అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు విషయంలో రూ. 47615 కోట్లతో సవరించిన అంచనాలకు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు కేంద్ర జలశక్తి శాఖ కూడా ఆమోదం తెలిపింది. అయితే తాజాగా ఆర్ధికశాఖ మొకాలడ్డింది. 2014లో ఆమోదించిన అంచనాల ప్రకారం రూ. 20 …

Read More »

రెండోసారి కూడా మోడి మంత్రం పనిచేయలేదా ?

బీహార్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడి మంత్రం పనిచేయలేదా ? మూడోదశ పోలింగ్ జరిగిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ను గమనిస్తే ఇదే విషయం అర్ధమైపోతుంది. బీహార్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ నిజమైతే మోడి వరుసగా రెండోసారి కూడా ఫెయిల్ అయినట్లే అనుకోవాలి. ఎందుకంటే 2015 ఎన్నికల సందర్భంగా బీహార్ జనాలపై మోడి ఎన్ని వరాలు కురిపించినా ఎవరు నమ్మలేదు. ఇపుడు కూడా చాలా వరాలే ప్రకటించినా ఉపయోగం …

Read More »

ట్రంప్ ట్వీట్‌పై మామూలు ట్రోలింగ్ కాదు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గత పర్యాయం అనూహ్య విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. రెండోసారి గెలవబోడని ఎప్పట్నుంచో సంకేతాలు అందుతున్నాయి. మామూలుగానే ఆయన తీరు, పనితీరూ రెండూ సంతృప్తిగా లేకపోగా కరోనా వైరస్ మిణుకుమిణుకుమంటున్న ఆశల మీదా నీళ్లు చల్లేసింది. వైరస్‌ను డీల్ చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడని అపప్రథ మూటగట్టుకున్న ట్రంప్ ఓటమి లాంఛనమే అనుకున్నారంతా. ఐతే ఉన్నంతలో పోటీ ఇవ్వగలిగాడు కానీ.. విజయం మాత్రం సాధించలేకపోయాడు. ట్రంప్ ఓటమి …

Read More »