మెరుగైన వైద్యం కోసం.. అందునా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందేందుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి దేశ రాజధానికి వెళ్లిన నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఇప్పుడో అర్థం కాని ప్రశ్నగా మారారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఆరోగ్యం మీద శ్రద్ధ ఎంతన్నది పక్కన పెడితే.. తనను అరెస్టు చేసి.. జైలుకు పంపే క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలకు బదులు తీర్చుకోవాలని …
Read More »యోగి పాలనకు జీరో మార్కులు.. బీజేపీ గెలుపు కష్టమేనా?
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత.. ఇప్పుడు బీజేపీ నేతల ఆశలు.. ఊసులు అన్నీ కూడా ఉత్తరప్రదేశ్పైనే ఉన్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం కావడం, ఇక్కడ అధికారంలోకి వచ్చే పార్టీ..కేంద్రంలో చక్రం తిప్పుతుందనే.. నానుడి ఉండడం.. పైగా భారీ సంఖ్యలో పార్లమెంటు స్థానాలున్న రాష్ట్రంలో అధికారంలోకి రావడం ద్వారా .. ఆయా ఎంపీ స్థానాలపై పట్టు పెంచుకునే అవకాశం ఉండడంతో జాతీయ పార్టీలు ఈ రాష్ట్రంపై పెద్ద ఎత్తున దృష్టి …
Read More »కేటీఆర్ ను వినూత్న కోరిక కోరిన కుర్రాడు..
వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు ఎదురెదురు పడటం అప్పుడప్పుడే జరుగుతుంది. ఇలాంటివేళ.. వారి మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతుందన్న ఆసక్తి అక్కడున్న వారిలో కనిపిస్తోంది. ఇప్పుడు నడుస్తోన్నది కరోనా కాలం. ఎవరో కొద్దిమంది తప్పించి మిగిలిన ప్రముఖులంతా ఇళ్లకో.. ఫాంహౌస్ లకు పరిమితమవుతున్నారు. ఎంతో అవసరం ఉంటే తప్పించి బయటకు వెళ్లటం లేదు. ఇదిలా ఉంటే.. కష్టంలో ఉన్నామంటే చాలు.. వెంటనే స్పందించే సినీ నటుడు సోనూ సూద్.. కరోనా …
Read More »కేసీఆర్ కి షాక్.. ఈటల వెంట మరో నేత..?
మాజీ మంత్రి ఈటల రాజేందర్.. పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పై భూ కబ్జా ఆరోపణలు చేయడంతో.. టీఆర్ఎస్ నుంచి తప్పుకొని.. బీజేపీ వైపు అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ కండువా కప్పుకునేందుకు ఆయన తన ప్రయత్నాలు తాను చేసుకుంటూనే ఉన్నారు. ఒకవైపు ఆ ప్రయత్నాల్లో ఉంటూనే… మరోవైపు టీఆర్ఎస్ లోని కీలక నేతలను కూడా పార్టీకి దూరం చేసేపనిలో ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా …
Read More »ఏపీలో లిక్కర్ బ్రాండ్ల పేర్లు…జగన్ పాలనపై సెటైర్లు?
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు….ఏపీకి స్పెషల్ స్టేటస్ తెచ్చేవరకు నిద్రపోమంటూ వైసీపీ నేతలు ప్రగల్భాలు పలికిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు పోరాడుతూనే ఉంటామని, కేంద్రం మెడలు వంచైనా హోదా తీసుకువస్తామని ఏపీ సీఎం జగన్ కూడా ఎన్నికలకు ముందు గట్టిగానే చెప్పారు. ఈ క్రమంలోనే సీఎం జగన్…ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ…ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతుంటారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాగైతేనేం…మాట తప్పని మడమ …
Read More »ఆనందయ్య మందుపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఎవరికీ పెద్దగా పరిచయం లేని నెల్లూరులోని ఒక కుగ్రామం కృష్ణపట్నం ఇపుడు దేశమంతటా తెలిసిపోయింది. ఆ గ్రామానికి చెందిన ఆనందయ్య ప్రకృతి మూలికలతో చేసిన మందు వాడితే కరోనా ఒకటి రెండు రోజుల్లోనే తగ్గుతుందని ప్రచారం జరగడంతో సోషల్ మీడియా పుణ్యమా అని ఆయన విపరీతంగా పాపులర్ అయ్యారు. అది పల్లెటూరిలో కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితికి దారితీసింది. ఆయనేమీ అనుమతి పొందిన ఆయుర్వేద వైద్యుడు కాకపోవడంతో తర్వాత …
Read More »ఈటలకు గ్యారెంటీ కావాలట
రెండు+రెండు= 4 అని లెక్కల్లో కరెక్టే. కానీ రాజకీయాల్లో ప్రతిసారి 2+2=4 అవుతుందని చెప్పేందుకు లేదు. కొన్నిసార్లు జీరో కూడా కావచ్చు. రాజకీయాలే అంత ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో, ఎవరిని ఎందుకు అదఃపాతాళంలోకి తొక్కేస్తుందో ఎవరు చెప్పలేరు. ఇప్పుడింతా దేనికంటే తెలంగాణా రాజకీయాల్లో ఈ రోజుకి హాట్ టాపిక్ ఎవరయ్యా అంటే మాజీమంత్రి ఈటల రాజేందర్ అనే చెప్పాలి. ఢిల్లీకి వెళ్ళి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో …
Read More »ఈటల బీజేపీలో చేరిక ఆలస్యానికి కారణం ఇదేనా..?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఖాయమని ఇప్పటికే అందరికీ అర్థమయ్యింది. వరసగా ఈటల ఢిల్లీలోని బీజేపీ నేతలతో భేటీ అయిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే.. ఈపాటికి ఆయన ఢిల్లీలోనే కషాయ కండువా కప్పుకున్నట్లు వార్తలు రావాల్సి ఉంది. అయితే.. ఈ విషయంలో ఈటల కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరడం ఖాయం. అయితే.. ఎప్పుడు చేరాలనే విషయమై మరి కొద్ది రోజులు ఆలోచించి …
Read More »అమ్మిరెడ్డిని ఎందుకు బదిలీచేశారబ్బా ?
గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీచేసింది. వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణరాజు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు చేసిన ఫిర్యాదులో ఎస్పీ పేరు కూడా ఉంది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న తనను తొందరగా డిస్చార్జి చేయించాలనే కుట్రలో రిజిస్ట్రార్ కేపీరెడ్డి, టీటీడీ జేఈవో ధర్మారెడ్డితో కలిసి అమ్మిరెడ్డి కుట్ర చేసినట్లు ఎంపి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఎంపి ముగ్గురిపై …
Read More »జగన్.. మోడీ ఆలోచనకు వ్యతిరేకంగా వెళ్తాడా?
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించే విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత పట్టుదలగా ఉన్నాడో తెలిసిందే. మెజారిటీ తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ పరీక్షలు నిర్వహించి తీరాలనే ఆలోచనతో జగన్ ఉన్నాడు. నిజానికి ఇప్పటికే పరీక్షలు మొదలు కావాల్సింది. కానీ కరోనా ఉద్ధృతి దృష్ట్యా పరీక్షలను నెల రోజులు వాయిదా వేశారు. ఐతే నెల రోజుల తర్వాత కూడా కరోనా ముప్పు తొలగిపోతుందన్న గ్యారెంటీ లేదు. పైగా అప్పుడు …
Read More »బీజేపీకి బెంగాల్లో షాక్ తప్పదా ?
వరస వివాదాలతో నరేంద్రమోడి-మమతాబెనర్జీ మధ్య గొడవలు పెరిగిపోతున్న సమయంలోనే బీజేపీకి పెద్ద షాక్ తప్పదని అనిపిస్తోంది. అదేమిటంటే కమలంపార్టీ తరపున గెలిచిన 8 ఎంఎల్ఏలతో పాటు నలుగురు ఎంపిలు తృణమూల్ కాంగ్రెస్ లో చేరటానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తృణమూల్ ప్రతినిధి కునాల్ ఘోష్ మీడియాకు చెప్పారు. అయితే వీరి చేరికపై పార్టీ అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా ఘోష్ చెప్పారు. ఒక విధంగా …
Read More »నాయకులారా.. ఈ అవకాశాన్ని ఎందుకు వాడుకోరు?
కోవిడ్ తీవ్రత ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది. కేసులు, మరణాల విషయంలో సరైన గణాంకాలు కూడా బయటికి రావట్లేదు. వాస్తవ కేసులు, మరణాల సంఖ్యతో పోలిస్తే ప్రభుత్వాలు బయటికి 30 శాతం తక్కువ చెబుతున్నట్లుగా వార్తలొస్తుండటం గమనార్హం. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పిపోగా.. ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో పెద్ద మనసున్న దాతల కోసం బాధితులు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates