తన మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు.. శనివారం ఉదయమే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం.. శ్రీవారి ప్రసాదాన్ని రుచి చూశారు. ఆ తర్వాత.. ఫ్యామిలీ అంతా గెస్ట్ హౌస్కు వెళ్లిపోగా.. సీఎం చంద్రబాబు సహా తిరుమల బోర్డు చైర్మన్ నాయుడు, అధికారులతో కలిసి.. ఆయన క్యూలైన్లను పర్యవేక్షించేందుకు వెళ్లారు.
ఈ సందర్భంగా తిరుమల మాడ వీధుల్లో దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన భక్తులతో చంద్రబాబు మాట్లాడారు. “ఏమ్మా తిరమల లడ్డూ తిన్నావా.. ఎలా ఉంది?“ అంటూ.. పలువురు మహిళలను ప్రశ్నించారు. దీనికి వారు సంతోషం వ్యక్తం చేశారు. చాలా బాగుందని, నాణ్యంగా ఉందని సమాధానం ఇచ్చారు. అంతేకాదు.. గతంతో పోలిస్తే.. ఇప్పుడు నాణ్యత చాలా బాగుందని రెగ్యులర్ భక్తులు కొందరు చెప్పారు. అనంతరం.. అన్నదాన సత్రాన్ని కూడా చంద్రబాబు పరిశీలించారు.
అయితే.. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి వెయిటింగ్ సమయాన్ని తగ్గించాలని చంద్రబాబు సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది శ్రీవారిని దర్శించుకునేలా కృత్రిమ మేధను విని యోగించుకోవాలని సూచించారు. టెక్నాలజీని వినియోగించుకుని.. క్యూ లైన్ల నిర్వహణను క్రమబద్ధీకరిం చాలని తెలిపారు. అదేవిధంగా భద్రతకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలని.. అన్యమత ధోరణులకు అవకాశం ఇవ్వరాదని కూడా అధికారులకు తేల్చి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
