Political News

‘అందుకే ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌న‌మ‌ని చెబుతున్నా’

ప్రపంచంలోని ప‌లు దేశాల్లో వృద్ధ జ‌నాభా ఇప్పుడు పెను స‌వాలుగా మారుతోంద‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. మ‌న‌దేశం మాత్ర‌మే ప్ర‌స్తుతం యువత ఎక్కువ‌గా ఉంద‌న్నారు. అయితే వ‌చ్చే 20 ఏళ్ల త‌ర్వాత ఈ ప‌రిస్థితి కూడా తారుమార‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌నాల‌ని పిలుపునిస్తున్న‌ట్టు చెప్పారు. వ‌యోజన జ‌నాభా స‌మ‌తుల్యం కావాలంటే ఇప్ప‌టి నుంచే సంతానోత్ప‌త్తిపై దృష్టి పెట్టాల‌న్నారు. అందుకే ఏపీలో మూడో బిడ్డ‌ను క‌నేవారికి ఆర్థిక సాయం చేస్తామ‌ని హామీ ఇచ్చిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

ఢిల్లీలో జరుగుతున్న ‘రైసినా డైలాగ్’ కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి 110 ప్ర‌పంచ దేశాల‌కు చెందిన ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ ప్ర‌పంచ దేశాల అభివృద్ధి, ఆర్థిక వ్య‌వ‌హారాల్లో భార‌త దేశ ప్ర‌జ‌ల పాత్ర ఎంతో ఉంద‌న్నారు. ప్ర‌పంచంలో ఎక్క‌డికి వెళ్లినా ఏపీ స‌హా దేశ ప్ర‌జ‌లు క‌నిపిస్తార‌న్నారు. వారి ఆలోచ‌న‌లు ఎక్క‌డ ఉన్నా దేశానికి ప్ర‌యోజ‌నం క‌లిగించేలా, దేశం పేరును ప్ర‌పంచ వ్యాప్తంగా వినిపించేలా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ఐటీ రంగంలో భార‌త పౌరుల దూకుడు ఎలాంటిదో అంద‌రికీ తెలిసిందేన‌న్నారు. ఇప్పుడు డిప్లొమ‌సీ, ఫ్లెక్సిబిలిటీల్లోనూ దూకుడుగా ఉన్నార‌ని తెలిపారు.

సంస్క‌ర‌ణ‌ల మంత్రం..

అన్ని రంగాల్లోనూ సంస్క‌ర‌ణ‌ల‌కు పెద్దపీట వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఇప్ప‌టికే చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌లు దేశాన్ని అభివృద్ధి ప‌థంలో ముందుకు తీసుకువెళ్తున్నాయ‌ని చెప్పారు. ఏపీలో తాము కూడా కేంద్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న సంస్క‌ర‌ణ‌ల‌తో పాటు సొంతంగా కూడా కొన్ని సంస్క‌ర‌ణ‌ల‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నారు. దీనిలో భాగంగానే సంతానోత్ప‌త్తిపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించామ‌ని చెప్పారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు తీసుకురానున్న‌ట్టు తెలిపారు.

ప్ర‌పంచానికే విద్యుత్..

ప్ర‌పంచ దేశాల‌కు సైతం భార‌త్ విద్యుత్‌ను విక్ర‌యించుకునే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ఇది త్వ‌ర‌లోనే సాకారం అవుతుంద‌న్నారు. దీనికి విద్యుత్ రంగంలో తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌లే కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. ఇక ఏపీ రాజ‌ధాని అమ‌రావతి గురించి మాట్లాడుతూ ఇక్కడ సృజ‌నాత్మ‌క న‌గ‌రాన్ని నిర్మిస్తున్నామ‌న్నారు. అదేవిధంగా డ్రోన్ సిటీ, ఎల‌క్ట్రానిక్ న‌గ‌రాల‌ను కూడా నిర్మిస్తున్నామ‌ని, భ‌విష్య‌త్తు టెక్నాల‌జీలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయ‌ని వివ‌రించారు.

This post was last modified on March 7, 2026 10:34 pm

Share

Recent Posts

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

1 hour ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

2 hours ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

7 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

10 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

11 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

11 hours ago