Political News

మోడీ ఎఫెక్ట్: ఉచితాల వైపు వడివడిగా అడుగులు!

వచ్చే రెండు మూడు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కీలక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు ప్రధాని మోడీ భయం పట్టుకుందా? ముఖ్యంగా ఆయన వ్యూహం, దూకుడుపై అంచనాలు వేయలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ఉచిత పథకాలను మరిన్ని ప్రకటించడంతో పాటు, ఇప్పటికిప్పుడు వాటిని అమలు చేస్తూ ఓటు బ్యాంకును పదిలం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వచ్చే ఏప్రిల్ మే మధ్య తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అసోంలలో ఎన్నికలు జరగనున్నాయి.

అయితే వీటిలో బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న, అధికారంలోకి రావాలనే లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రాలు రెండు ఉన్నాయి. వీటిలో పశ్చిమ బెంగాల్ ముందువరుసలో ఉంది. తర్వాత తమిళనాడు, కేరళ ఉన్నాయి. ఇక అసోంలో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఈ నేపథ్యంలో అతి పెద్ద రాష్ట్రాలపై బీజేపీ సహా ప్రధాని మోడీ చాలానే వ్యూహాలు అమలు చేస్తున్నారు. గతంలో లేని విధంగా వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా చేస్తున్నారు.

ఈ క్రమానికి తోడు ‘సర్’ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం తొలగిస్తున్న లక్షలాది ఓట్లు కూడా స్థానిక ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలను తీవ్ర స్థాయిలో కలవరానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటా బయటా పోరు సాగించే క్రమంలో ఎక్కడ చిన్న తేడా కొట్టినా మొత్తం పరిస్థితికే ఇబ్బందులు తప్పవని గ్రహిస్తున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తే అమలు చేసే ఉచిత పథకాలను ఇప్పుడే ప్రారంభించేస్తున్నారు. ఇది కొంత విచిత్రంగా ఉన్నా ప్రజలను తమవైపు నిలబెట్టుకునేందుకు ఇంతకన్నా మార్గం ఆయా పార్టీలకు కనిపించడం లేదు.

గత నెలలో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం మహిళల ఖాతాల్లో 5000 రూపాయల చొప్పున జమ చేసింది. వాస్తవానికి ఇది వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఇస్తామని చెప్పిన మాట. కానీ ముందుగానే వేసేసి మహిళలను తమవైపు నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏకంగా యువతను టార్గెట్ చేసుకుని కీలక పథకాన్ని ప్రకటించడంతో పాటు దానిని అమల్లో కూడా పెట్టేశారు. అదే ‘నిరుద్యోగ భృతి’. తాము మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు 1500 చొప్పున ఇస్తామని ప్రకటించిన మమతా బెనర్జీ దానిని తాజాగా అమలు కూడా చేసేశారు.

యువసాథి

‘యువ సాథి’ (యువతకు చేరువగా) పేరుతో ప్రారంభించిన ఈ పథకం కింద 21 ఏళ్లు నిండిన యువతకు నెలకు రూ.1500 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. 40 ఏళ్ల వయస్సు ఉన్న వారి వరకు దీనిని అమలు చేస్తారు. వాస్తవానికి ఈ పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. కానీ పైకి ఎన్ని చెప్పినా బీజేపీ వ్యూహాలు, ప్రధాని మోడీ దూకుడుతో మమతా బెనర్జీ తక్షణమే నిధులు మంజూరు చేసి యువత ఖాతాల్లో సొమ్ములు వేయడం గమనార్హం. ఎన్నికలు సమీపించే కొద్దీ ఇలాంటి చిత్రాలు ఇంకా ఎన్నో చూడాల్సి ఉంటుందోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

This post was last modified on March 7, 2026 10:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ అన్నా క్యాంటీన్లను తీసేసింది అందుకేనా?

వైసీపీ హ‌యాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జ‌గ‌న్‌.. పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నం కూడా పెట్ట‌లేక పోయార‌ని సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శించారు.…

5 hours ago

అమరావతిపై ఇంత విషమేంటి నాని గారు?

ఏపీ రాజ‌ధాని అమ‌రావతిపై వైసీపీ నాయ‌కులు అదే అక్క‌సు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. రాజ‌ధానిపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన…

6 hours ago

లాయర్ అవతారమెత్తిన రాజు గారు

కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…

6 hours ago

ఎట్టకేలకు వర్మ త్యాగానికి ఫలితం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…

6 hours ago

జోష్ తగ్గింది జగన్

వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…

7 hours ago

టీడీపీలో లోకేష్ శ‌కం… ఇక కథ వేరుంటది

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించారు. దీనికి ప్రస్తుత మంత్రి నారా…

7 hours ago