సినీ హీరోల మీద ఫ్యాన్స్ వీరాభిమానానికి సంబందించి ఎన్నో ఉదంతాలు చూశాం. కానీ ఇది చాలా చిత్రమైన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శశిభవ్యత అనే అమ్మాయి లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనే అరుదైన జన్యు పరమైన వ్యాధితో బాధ పడుతోంది. తరచూ ఫిట్స్ రావడం, నాడీ వ్యవస్థ దెబ్బ తినడంతో మంచానికే పరిమితం అయిన 18 ఏళ్ల ఈ అమ్మాయికి టాలీవుడ్ యువ కథానాయకుడు రామ్ అంటే వల్లమాలిన అభిమానం.
మతిస్థిమితం కూడా సరిగా లేని ఈ అమ్మాయికి రామ్ పేరు చెబితే.. ఒంట్లో ఉత్సాహం వస్తోంది. శశిభవ్యత తల్లిదండ్రులు.. ఆమెకు రామ్ వీడియోలు, ఫొటోలు చూపించి అన్నం తినిపించి మందులు వేస్తున్నారట. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత.. రామ్ దృష్టికి వచ్చింది.
ఈ అభిమాని పరిస్థితి చూసి కదిలిపోయిన రామ్.. వెంటనే స్పందించాడు. ఆ బాలికతో రామ్ వీడియో కాల్ మాట్లాడాడు. ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాడు. శశిభవ్యతకు అవసరమైన మందులు, ఇతర ఖర్చులు అన్నీ ఇకపై తానే భరిస్తానని రామ్ తెలిపాడు. ఆమె రిపోర్టులు అన్నీ కూడా తనకు అందాయని.. ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు తన వంతుగా ప్రయత్నిస్తానని రామ్ చెప్పాడు.
శశిభవ్యతను సంతోషంగా ఉంచాలని, సరైన మందులు వాడాలని, అన్నీ సమయానికి అందేలా చూడాలని రామ్ సూచించాడు. శశిభవ్యత పరిస్థితిని వెలుగులోకి తెచ్చి తన దృష్టికి తీసుకొచ్చిన అభిమానులు, మీడియా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు రామ్ కృతజ్ఞతలు చెప్పాడు. తమ అమ్మాయి అభిమాన నటుడు ఇలా స్వయంగా స్పందించి భరోసా ఇవ్వడం పట్ల శశిభవ్యత తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
This post was last modified on August 19, 2026 4:19 pm
తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…
విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…
నిన్న విడుదలైన రణబాలి టీజర్ పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అలాని అందరూ యునానిమస్ గా…
అర్జెంటీనాలో జరిగిన ఒక విచిత్ర పరిణామం ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతుంది. రాత్రికి రాత్రే ఒక సముద్రం ఇంకిపోయిందని,…
ఫోల్డబుల్ ఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్. 2019లో తొలి గెలాక్సీ ఫోల్డ్ను తీసుకొచ్చిన ఆ కంపెనీ, అప్పటి నుంచి…
ఫౌజీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా పోస్ట్ పోన్ ఖాయమని…