ఒకప్పటితో పోలిస్తే తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుకి సంబంధించి అంత తేలిగ్గా జీవోలు రావట్లేదు. ఓవైపు ప్రభుత్వం అంత తేలిగ్గా జీవోకు అంగీకరించట్లేదు. ఇంకోవైపు కోర్టుల్లో చిక్కులు ఎదురవుతున్నాయి. అయినా సరే గత ఏడాది కాలంలో కొందరు నిర్మాతలు గట్టిగా ప్రయత్నించి అదనపు రేట్లకు అనుమతులు తెచ్చుకున్నారు. ఆ జీవోల ద్వారా ప్రయోజనమూ పొందారు.
కానీ అంతటితో సంబరం అయిపోలేదు. అదనపు రేట్ల ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం ఇప్పుడు ప్రభుత్వానికి చెల్లించక తప్పట్లేదు. ఈ మొత్తాన్ని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సినీ కార్మికుల సంక్షేమం కోసం ఈ నిధులు ఉపయోగిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
టికెట్ల రేట్ల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 పర్సంట్ సినీ కార్మికుల సంక్షేమానికి చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకుముందే ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఐతే సీఎం నోటి మాటగా చెప్పిన దాన్ని సినీ నిర్మాతలు పెద్దగా పట్టించుకున్నట్లుగా లేదు. ఇలా ఆదాయంలో వాటాను వెనక్కి ఇచ్చారా లేదా అని ఎవ్వరూ పరిశీలించే ప్రయత్నం కూడా చేయలేదు. ఐతే సీఎం మాట ఇప్పుడు ఉత్తర్వులుగా మారింది.
గత ఏడాది వ్యవధిలో ధరల పెంపు ద్వారా ప్రయోజనం పొందిన అఖండ-2, ది రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు, పెద్ది లాంటి సినిమాలకు సంబంధించి ఎగ్జిబిటర్ల నుంచి 20 శాతం వాటాను వసూలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మొత్తాన్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. మరి ఈ ఆదేశాలపై నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on August 19, 2026 4:22 pm
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…