కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్సు ఎక్కాలి.. తెలంగాణ వెళ్ళడానికి హైదరాబాద్ బస్సు ఎక్కాలి.. మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలి సారూ.. అంటూ మాజీ మంత్రిని ఓ వ్యక్తి ఫోన్లో అడిగిన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినడానికి, పలకడానికి కొత్తగా అనిపించిన ఈ పదం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. మరోవైపు సోషల్ మీడియాలో దీనిపై మీమ్స్, సెటైర్లు, జోకులు హోరెత్తిస్తున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మొదటిసారిగా ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన మీడియా సమావేశంలో’మావిగన్’ అనే పదాన్ని ప్రస్తావించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానిస్తూ రూ.15,000 నుంచి 20,000 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేయడానికి వీలుగా ఈ ‘మావిగన్’ కారిడార్ను ఆయన ప్రత్యామ్నాయ రాజధానిగా తెరపైకి తెచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు అవసరమని, అభివృద్ధి చెందిన నగరాలను కలుపుకుంటే మౌలిక వసతులు వెంటనే అందుబాటులోకి వస్తాయని ఆయన వాదించారు. వచ్చే ఎన్నికల్లో మావిగని అజెండాగా ఎన్నికలకు వెళ్తామని ఈమధ్య తెల్చి చెప్పారు.
అయితే సోషల్ మీడియాలో దీనిపై ట్రోల్స్ వచ్చాయి. మావిగన్’ వినడానికి ఏదో హాలీవుడ్ సినిమా పేరులా, కొత్త రకం తుపాకీ (Gun) పేరులా ఉందంటూ నెటిజన్లు జోకులు వేశారు. గతంలో అమరావతిని గ్రాఫిక్స్ అన్నవాళ్లు, ఇప్పుడు మూడు నగరాల పేర్లను కలిపి ‘షాట్కట్ స్పెల్లింగ్’ రాజధానిని తెచ్చారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి.
కాగా, మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కు ఓ వ్యక్తి కాల్ చేసిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి జోగి రమేష్కు ఫోన్ చేసి, “సార్, నేను మావిగన్ వెళ్ళాలి.. ఏ బస్సు ఎక్కాలి? ఏ స్టాండ్లో దిగాలి?” అని వ్యంగ్యంగా అడిగారు. అది ఒక ప్రాంతం కాదు, మూడు నగరాల కలయిక. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చాక నువ్వే స్వయంగా మావిగన్ కారిడార్ను చూస్తావు” అని రమేష్ సమాధానమిచ్చారు. ఈ సంభాషణ నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది.
This post was last modified on July 8, 2026 5:47 am
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…