Political News

ఎల్నినో… ఏపీలో ఈ జిల్లాలపై ప్రభావం ఎక్కువేనట!

ఖరీఫ్ సీజన్ మొదలై నెల కావొస్తుంది. కానీ ఆకాశం నుంచి చుక్క నీటి జాడలేదు. మేఘాలు మొఖం చాటేశాయి. ఇదంతా ఎల్నినో ప్రభావమేనని శాస్ట్రవేత్తలు చెబుతున్నారు. విత్తనాలు చల్లి ఎరువుల కోసం ఎదురుచూడాల్సిన ఈ సమయంలో అన్నదాతలు నాలుగు చినుకుల కోసం తలెత్తి చూస్తున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం కూడా సన్నద్థం అవుతోంది.

ముఖ్యంగా ఎల్నినో ప్రభావం ఏఏ జిల్లాలలో ఎక్కవగా ఉండబోతోంది అనే అంశంపై అధికారులతో కలసి ఓ అంచనాకు వస్తోంది. జూన్ నెలలో రాష్ట్రంలో -25 శాతం వర్షపాతం లోటు నమోదవగా, జూలై నెలలో ఇప్పటివరకు -41 శాతం లోటు నమోదైందని తెలిపారు. ప్రస్తుత అంచనాల ప్రకారం జూన్ నుంచి నవంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల సీజన్ మొత్తం -27 శాతం వర్షపాతం లోటుతో ముగిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

మొత్తం ఏపీలో 688 మండలాలు ఉన్నాయి. ఎల్నినో ప్రభావం 105 మండలాలు తీవ్రంగా ఉంబోతోంది. 208 మండలాలు మధ్యస్థ స్థాయిలో ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాలు తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

కర్నూలు, నంద్యాల, చిత్తూరు, వైఎస్సార్ కడప, తిరుపతి, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో మధ్యస్థ స్థాయి ప్రభావం ఉండే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం నెలకొన్న ఎల్-నినో పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కాలంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు ముందస్తు ప్రణాళికలతో పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.

This post was last modified on July 8, 2026 11:15 am

Share

Recent Posts

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

47 minutes ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

1 hour ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

1 hour ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

2 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

5 hours ago

బండ్ల కూతురి పెళ్లికి రానిది పవన్ ఒకరే

బండ్ల గ‌ణేష్ అనే న‌టుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్ర‌లు చేసింది లేదు. న‌టుడిగా అత‌డిది గొప్ప కెరీర్ కాదు.…

5 hours ago