Trends

తెలంగాణ‌లో వేడెక్కిన స‌వాళ్ల రాజ‌కీయం!

తెలంగాణ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. అధికార కాంగ్రెస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య గ‌త కొన్ని రోజులుగా సాగుతున్న స‌వాళ్లు.. గురువారం రోడ్డెక్కాయి. మీ స‌వాల్‌ను మేం స్వీక‌రిస్తున్నామంటూ.. బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు కేటీఆర్ చేసిన ప్ర‌క‌ట‌నతో ప్ర‌భుత్వ ప‌రంగా కూడా అంతే దీటుగా స్పంద‌న వ‌చ్చింది. ఈ క్ర‌మంలో మంత్రులు అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌, పొన్నం ప్ర‌భాక‌ర్‌లు ముందుగానే గ‌న్ పార్క్ ద‌గ్గ‌ర‌కు చేరుకున్నారు. అయితే.. మ‌రో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద‌కే వ‌స్తున్నాన‌ని చెప్ప‌డంతో కేటీఆర్ అక్క‌డే తిష్జ వేశారు.

ఇక‌, గ‌న్ పార్క్ వ‌ద్ద మంత్రుల‌తో చ‌ర్చించేందుకు బ‌య‌లు దేరిన హ‌రీష్‌రావును పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో ఇరు ప‌క్షాల మ‌ధ్య తోపులాట జ‌రిగి.. హ‌రీష్‌రావు కింద ప‌డిపోయారు. అనంత‌రం.. హ‌రీష్‌రావును నాట‌కీయ ప‌రిణామాల క్ర‌మంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మ‌రోవైపు.. తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద పోలీసులు మోహ రించారు. మంత్రి జూప‌ల్లికి అక్క‌డ‌కు వ‌స్తున్నార‌ని తెలియ‌డంతో బీఆర్ ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఉద్రిక్త‌త‌లు మ‌రింత పెరిగాయి.

స‌వాళ్లు ఇవీ..

ఇటీవ‌ల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా అప్పుల విష‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు బీఆర్ ఎస్ కూడా అంతే దీటుగా స్పందిస్తోంది. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. 60 వేల కోట్ల రూపాయ‌ల అప్పులు మాత్ర‌మే ఉన్నాయ‌ని సీఎం చెబుతున్నారు. కానీ, కేసీఆర్ మ‌యాంలో ఏకంగా 8 ల‌ల కోట్ల‌కుపైగానే అప్పులు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేశార‌ని ఆరోపించారు. అదేవిధంగా విద్యార్థుల‌కు క‌నీస వ‌స‌తులు కూడా క‌ల్పించ‌లేద‌ని.. గురుకులాల‌కు గ్ర‌హ‌ణం ప‌ట్టించార‌ని వ్యాఖ్యానించారు.

ఈ నేప‌థ్యంలో స‌ద‌రు విష‌యాల‌పై చ‌ర్చకు సిద్ధ‌మ‌ని.. మీరే అప్పులు చేస్తూ.. మాపై తోస్తున్నార‌ని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.త ఆము 3.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే అప్పులు చేశామ‌ని, కానీ, తెలంగాణ నుంచి ప‌న్నులు వ‌సూలు చేసి ఢిల్లీ పెద్ద‌ల‌కు మోస్తున్నార‌ని ఎదురు దాడి చేశారు. అదేస‌మ‌యంలో గురుకులాల‌కు కూడా తాము అన్యాయం చేయ‌లేద‌ని, మెరుగైన వ‌స‌తులు క‌ల్పించామ‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఇరు ప‌క్షాలు చ‌ర్చ‌కు సిద్ధం కాగా.. ఉద్రిక్త‌త‌లు పెరిగి.. రాజ‌ధాని ప్రాంతంలో పోలీసులు మోహ‌రించారు.

This post was last modified on July 2, 2026 1:17 pm

Share

Recent Posts

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

2 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

5 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

5 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

5 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

7 hours ago

జగన్ కేసుల లోగుట్టు సాయిరెడ్డి విప్పనున్నారా?

వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…

9 hours ago