రాం గోపాల్ వర్మ అంటేనే ఒక బ్రాండ్. ఆయన సినిమాలకు హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేదు. ఇండియా వెండితెర మీద తనదైన ముద్ర వేసిన అద్భుతమైన దర్శకుడు. అందుకే వర్మ సినిమాకు హిట్, ప్లాప్ అనేవి వర్తించవు. ఎన్నో వండర్ ఫుల్ సినిమాలు నిర్మించిన వర్మ గత కొన్నేళ్లుగా పరమ చెత్త సినిమాలు చేశాడు. అయినా ఆయన క్రేజ్ తగ్గలేదు. మళ్ళీ కొత్త సినిమా ఎప్పుడు చేస్తాడా అని ఎదురు చూసే వాళ్ళే ఎక్కువ. అభిమానులను అసంతృప్తికి గురిచేయకుండా వర్మ కొత్త సినిమా కమిట్ అయ్యాడు.
ముంబై అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ల నేపథ్యంలో పోలీస్ కంపెనీ పేరుతో కొత్త సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దావుద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ గ్యాంగ్ ల మధ్య జరిగిన పోరాటాలను కట్టడి చేసేందుకు ఆనాటి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్క్వాడ్ స్పూర్తితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
టీ సీరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ గా బాలీవుడ్ నటుడు హర్ష వర్ధన్ రాణే నటిస్తున్నట్లు సమాచారం.
ఈ తరహా సినిమాలు తెరకెక్కక చాలా రోజులైంది. ముంబై ప్రజలు కూడా గ్యాంగ్ స్టర్లను మరిచిపోయారు. ఇప్పుడంతా ఇండియన్ సినిమా ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది. కేజీఎఫ్ మాయలో పడింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కథలు అలరిస్తున్నాయి. కర్ణాటక బంగారు గనుల్లో అధికారం చేజిక్కించుకున్న రాకీ కథ ఆ మధ్య బాగా అలరించింది. వర్థరాజ మన్నార్ కథతో వచ్చిన సలార్ హిట్ కొట్టింది. ముంబై బయటి ప్రపంచంలోని డార్క్, యాక్షన్, గ్యాంగ్ వార్ లు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు వర్మ పోలీస్ కంపెనీ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.
This post was last modified on August 11, 2026 9:56 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…