Trends

భారత్ కు భారీ షాక్.. ఆసుపత్రిలో అభిషేక్!

టీ20 వరల్డ్ కప్ 2026లో బలంగా ఉన్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని, ఆరోగ్యం కాస్త క్షీణించడంతో ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఫిబ్రవరి 12న నమీబియాతో జరగబోయే కీలక మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండటం అనుమానంగానే కనిపిస్తోంది.

అమెరికాతో జరిగిన మ్యాచ్ సమయంలోనే అభిషేక్ శర్మ ఆరోగ్యం బాలేదని తెలుస్తోంది. ఆ మ్యాచ్‌లో కేవలం ఒక్క బంతికే అవుట్ అవ్వగా, ఫీల్డింగ్ సమయంలో కూడా మైదానంలోకి రాలేదు. అతని స్థానంలో సంజూ శామ్సన్ ఫీల్డింగ్ చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇతర ఆటగాళ్లతో కలిసి కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా అభిషేక్ రాలేదంటే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తీవ్రమైన జ్వరం కారణంగా సెలైన్ బాటిళ్లు ఎక్కించినట్లు సమాచారం.

జట్టు అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డోషేట్ ఈ విషయంలో స్పందిస్తూ.. అభిషేక్ శర్మ ఇంకా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అయితే రేపు జరిగే మ్యాచ్ నాటికి కోలుకుంటారని ఆశిస్తున్నట్లు మీడియాకు చెప్పారు. మరోవైపు బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఫలితాలు వచ్చిన తర్వాతే డిశ్చార్జ్ విషయంపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఏదేమైనా నమీబియా మ్యాచ్ లో అతని ఆడటం కష్టమేనని అనుకుంటున్నారు.

ఇదే సమయంలో జట్టులోకి వాషింగ్టన్ సుందర్ వచ్చి చేరడం భారత్‌కు కాస్త ఊరటనిచ్చే విషయం. నమీబియా మ్యాచ్ కోసం అతని ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అలాగే కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఫిట్‌గా ఉన్నారని, ప్రాక్టీస్ సెషన్‌లో చురుగ్గా పాల్గొంటున్నారని కోచ్ వివరించారు. ఇక అభిషేక్ శర్మ లేకపోవడం ఓపెనింగ్ విభాగంలో మళ్ళీ సంజూ శంసన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కానీ అతను ఫామ్ లోలేకపోవడం కొంత రిస్క్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అభిషేక్ త్వరగా కోలుకోకపోతే, సూపర్ 8 మ్యాచ్‌ల నాటికి ఫిట్‌నెస్ సాధించడం జట్టుకు చాలా ముఖ్యం. నమీబియా వంటి చిన్న జట్టుపై జరిగే మ్యాచ్‌లో ప్రయోగాలు చేసినా పర్లేదు కానీ, మెగా టోర్నీలో ఇలాంటి అనారోగ్య సమస్యలు జట్టును కలవరపెట్టేవే.

This post was last modified on February 11, 2026 11:44 am

Share

Recent Posts

పవన్ కళ్యాణ్ – ఒక జన సేవకుడి ప్రస్థానం

సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…

31 minutes ago

తమిళనాడులో అప్పుడే పెడాకులా…

మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…

36 minutes ago

స్థానిక ఎన్నికలకు SIR చిక్కుముడి?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…

56 minutes ago

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

3 hours ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

4 hours ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

9 hours ago