Trends

భారత్ కు భారీ షాక్.. ఆసుపత్రిలో అభిషేక్!

టీ20 వరల్డ్ కప్ 2026లో బలంగా ఉన్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని, ఆరోగ్యం కాస్త క్షీణించడంతో ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఫిబ్రవరి 12న నమీబియాతో జరగబోయే కీలక మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండటం అనుమానంగానే కనిపిస్తోంది.

అమెరికాతో జరిగిన మ్యాచ్ సమయంలోనే అభిషేక్ శర్మ ఆరోగ్యం బాలేదని తెలుస్తోంది. ఆ మ్యాచ్‌లో కేవలం ఒక్క బంతికే అవుట్ అవ్వగా, ఫీల్డింగ్ సమయంలో కూడా మైదానంలోకి రాలేదు. అతని స్థానంలో సంజూ శామ్సన్ ఫీల్డింగ్ చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇతర ఆటగాళ్లతో కలిసి కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా అభిషేక్ రాలేదంటే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తీవ్రమైన జ్వరం కారణంగా సెలైన్ బాటిళ్లు ఎక్కించినట్లు సమాచారం.

జట్టు అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డోషేట్ ఈ విషయంలో స్పందిస్తూ.. అభిషేక్ శర్మ ఇంకా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అయితే రేపు జరిగే మ్యాచ్ నాటికి కోలుకుంటారని ఆశిస్తున్నట్లు మీడియాకు చెప్పారు. మరోవైపు బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఫలితాలు వచ్చిన తర్వాతే డిశ్చార్జ్ విషయంపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఏదేమైనా నమీబియా మ్యాచ్ లో అతని ఆడటం కష్టమేనని అనుకుంటున్నారు.

ఇదే సమయంలో జట్టులోకి వాషింగ్టన్ సుందర్ వచ్చి చేరడం భారత్‌కు కాస్త ఊరటనిచ్చే విషయం. నమీబియా మ్యాచ్ కోసం అతని ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అలాగే కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఫిట్‌గా ఉన్నారని, ప్రాక్టీస్ సెషన్‌లో చురుగ్గా పాల్గొంటున్నారని కోచ్ వివరించారు. ఇక అభిషేక్ శర్మ లేకపోవడం ఓపెనింగ్ విభాగంలో మళ్ళీ సంజూ శంసన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కానీ అతను ఫామ్ లోలేకపోవడం కొంత రిస్క్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అభిషేక్ త్వరగా కోలుకోకపోతే, సూపర్ 8 మ్యాచ్‌ల నాటికి ఫిట్‌నెస్ సాధించడం జట్టుకు చాలా ముఖ్యం. నమీబియా వంటి చిన్న జట్టుపై జరిగే మ్యాచ్‌లో ప్రయోగాలు చేసినా పర్లేదు కానీ, మెగా టోర్నీలో ఇలాంటి అనారోగ్య సమస్యలు జట్టును కలవరపెట్టేవే.

This post was last modified on February 11, 2026 11:44 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అమరావతి అగ్నిప్రమాదం వెనుక అసలు నిజం

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం ఘటనలో కుట్ర కోణమేమీ లేదని తేలిపోయయింది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన…

42 minutes ago

సంక్రాంతి ‘బరి’ మీద మెగా డాటర్ గురి

వరుణ్ తేజ్ హీరోగా యుదు వంశీ దర్శకత్వం వహించే బరి షూటింగ్ ఇవాళ లాంఛనంగా ప్రారంభమయ్యింది. నీహారిక కొణిదెల నిర్మాత…

1 hour ago

మళ్లీ జగన్ లాంటోళ్లు వస్తే… అమరావతిపై షర్మిల

మళ్లీ ఏ జగన్ లాంటోళ్లు వస్తే అనే ముందుచూపు చంద్రబాబు నాయుడు విజన్ కు నిదర్శనం అని వైయస్ షర్మిల…

2 hours ago

చిరంజీవి రవితేజ… జమీల్ జమాలి ఫ్రెండ్సే

అదేంటి దురంధర్ లో మంత్రి జమీల్ జమాలికి మన టాలీవుడ్ చిరంజీవి, రవితేజకు కనెక్షన్ ఏమనుకుంటున్నారా. కొన్ని సినిమా సంగతులు…

3 hours ago

గుంటూరు రాజకీయం వేడెక్కుతుంది

గుంటూరు తూర్పు.. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న నియోజ‌క‌వ‌ర్గం ఇదే!. అయితే.. దీనిపైనే ఎక్కువ‌గా టాక్ న‌డుస్తోంది. దీనికి…

7 hours ago

ద‌క్షిణాదిపై కేంద్రం ప‌ట్టు.. ప్ర‌మోద‌మా? ప్ర‌మాద‌మా?

ద‌క్షిణాది రాష్ట్రాల‌పై కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం (కూట‌మి) ప‌ట్టు పెంచుకుంటోందా? రాజ‌కీయంగా వ్యూహాత్మక స్టెప్పులు వేస్తోందా? అంటే.. ఒన‌నే అంటున్నారు…

10 hours ago