టీ20 వరల్డ్ కప్ 2026లో బలంగా ఉన్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని, ఆరోగ్యం కాస్త క్షీణించడంతో ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఫిబ్రవరి 12న నమీబియాతో జరగబోయే కీలక మ్యాచ్కు అతను అందుబాటులో ఉండటం అనుమానంగానే కనిపిస్తోంది.
అమెరికాతో జరిగిన మ్యాచ్ సమయంలోనే అభిషేక్ శర్మ ఆరోగ్యం బాలేదని తెలుస్తోంది. ఆ మ్యాచ్లో కేవలం ఒక్క బంతికే అవుట్ అవ్వగా, ఫీల్డింగ్ సమయంలో కూడా మైదానంలోకి రాలేదు. అతని స్థానంలో సంజూ శామ్సన్ ఫీల్డింగ్ చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇతర ఆటగాళ్లతో కలిసి కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా అభిషేక్ రాలేదంటే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తీవ్రమైన జ్వరం కారణంగా సెలైన్ బాటిళ్లు ఎక్కించినట్లు సమాచారం.
జట్టు అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డోషేట్ ఈ విషయంలో స్పందిస్తూ.. అభిషేక్ శర్మ ఇంకా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అయితే రేపు జరిగే మ్యాచ్ నాటికి కోలుకుంటారని ఆశిస్తున్నట్లు మీడియాకు చెప్పారు. మరోవైపు బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఫలితాలు వచ్చిన తర్వాతే డిశ్చార్జ్ విషయంపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఏదేమైనా నమీబియా మ్యాచ్ లో అతని ఆడటం కష్టమేనని అనుకుంటున్నారు.
ఇదే సమయంలో జట్టులోకి వాషింగ్టన్ సుందర్ వచ్చి చేరడం భారత్కు కాస్త ఊరటనిచ్చే విషయం. నమీబియా మ్యాచ్ కోసం అతని ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అలాగే కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఫిట్గా ఉన్నారని, ప్రాక్టీస్ సెషన్లో చురుగ్గా పాల్గొంటున్నారని కోచ్ వివరించారు. ఇక అభిషేక్ శర్మ లేకపోవడం ఓపెనింగ్ విభాగంలో మళ్ళీ సంజూ శంసన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కానీ అతను ఫామ్ లోలేకపోవడం కొంత రిస్క్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అభిషేక్ త్వరగా కోలుకోకపోతే, సూపర్ 8 మ్యాచ్ల నాటికి ఫిట్నెస్ సాధించడం జట్టుకు చాలా ముఖ్యం. నమీబియా వంటి చిన్న జట్టుపై జరిగే మ్యాచ్లో ప్రయోగాలు చేసినా పర్లేదు కానీ, మెగా టోర్నీలో ఇలాంటి అనారోగ్య సమస్యలు జట్టును కలవరపెట్టేవే.
This post was last modified on February 11, 2026 11:44 am
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష భగ్నం, కాక్రోచ్ జనతా…