విశ్వక్ సేన్ ఫంకీ ఇంకో మూడు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇప్పటికైతే హైప్ పరంగా మరీ ఆకాశాన్ని అంటే స్థాయిలో అంచనాలు లేవు కానీ కంటెంట్ డీసెంట్ ఉన్నా చాలు హిట్టయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే అనుకున్నంత తేలిగ్గా అయితే కాదు.
ఎందుకంటే ఫంకీ భుజాల మీద చాలా బరువుంది. ముఖ్యంగా ఏడాదికి పైగా గ్యాప్ ఉన్న విశ్వక్ సేన్ కి పెద్ద సక్సెస్ కావాలి. దీని కోసమే బయట కూడా కనిపించకుండా బ్రేక్ తీసుకున్న విశ్వక్ ఫంకీ ప్రమోషన్ల పరంగా ఎంత కావాలో అంతా చేస్తున్నాడు. ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, స్పూఫ్ వీడియోలు అది ఇది కాకుండా అన్నింట్లో కనిపిస్తున్నాడు.
ఇక దర్శకుడు అనుదీప్ కు సైతం ఫంకీ ఫలితం కీలకం కానుంది. జాతిరత్నాలు తర్వాత తన గ్రాఫ్ అనుకున్న స్థాయిలో లేదు. శివ కార్తికేయన్ ప్రిన్స్ తీవ్రంగా నిరాశ పరచగా రచన బాధ్యతలు నిర్వహించిన ఫస్ట్ డే ఫస్ట్ షో కనీస స్థాయిలో ఆడలేదు. దీంతో తనదైన శైలిలో వన్ లైన్ ఫన్ మీద ఆధారపడి ఫంకీని తీశాడు.
ట్రైలర్ లో జోకులు కొంత మేర నవ్వించాయి కానీ సినిమా మొత్తం ఇదే మీటర్ లో ఉంటుందా లేదానేది చూడాలి. మాములుగా ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ లో తీసే సినిమాలు అరుదుగా ఆడతాయి. కానీ ఫంకీ సీరియస్ విషయాల జోలికి వెళ్లకుండా కేవలం నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకుని వస్తోంది.
దానికి తగ్గట్టే నిర్మాత నాగవంశీ కథ, ఎమోషన్స్ లాంటివి ఆశించకుండా థియేటర్ కు రమ్మని చెబుతున్నారు. అంటే లాజిక్స్ గురించి ఆలోచిస్తే కనెక్ట్ కాదనే ఉద్దేశం కాబోలు. గతంలో కూడా ఆయన ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇచ్చినప్పటికీ అనగనగా ఒక రాజు సక్సెస్ ఊపులో ఉన్న ఆయన మరోసారి తన సక్సెస్ రేట్ ని పెంచుకుంటారో లేదో చూడాలి.
ప్రమోషన్ పరంగా ఒక లోపం ఏమిటంటే బీమ్స్ చేసిన వాటిలో వైరల్ సాంగ్ పడకపోవడం. విజువల్స్ తో పాటు చూశాక ఏమైనా కనెక్ట్ అవుతాయోమో కానీ పెద్ద చార్ట్ బస్టర్ సాంగ్ లేకపోవడం కొంత లోటే. రెండో టాలీవుడ్ సినిమాతో అయినా హీరోయిన్ కయదు లోహర్ కు హిట్టు దక్కుతుందేమో చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…