Political News

జనగణమన పాడి జగన్ వాకవుట్

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సభ మొదలైంది. అందరూ అనుకున్నట్లుగానే ఏపీ మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ సభ్యులు సభకు అటెండెన్స్ కోసం హాజరయ్యారు.

పట్టుమని 10 నిమిషాలు కూర్చోకుండా వాకౌట్ చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని పదే పదే అడ్డుకోవాలని చూశారు.

గవర్నర్ ప్రసంగానికి గౌరవమిచ్చి కూర్చోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు హితవు పలుకుతున్నా వారు వినలేదు. ఆ తర్వాత లడ్డూలో కల్తీ నెయ్యి అంశం, మెడికల్ కాలేజీల పీపీపీ అంశానికి నిరసనగా వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సస్పెన్షన్ వేటు నుంచి తప్పించుకునేందుకు, 6 నెలల హాజరు నిబంధనను సంతృప్తి పరిచేందుకు సభకు హాజరయ్యాం అనిపించుకొని జంప్ అయ్యారు.

అయితే, ప్రత్యేకంగా వైసీపీ సభ్యుల కోసమే అన్నట్లు అసెంబ్లీ చరిత్రలో తొలిసారి డిజిటల్ అటెండెన్స్ విధానం తీసుకువచ్చారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. గతంలో అయితే అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు పెట్టి వెళ్లిపోతే సరిపోయేది. కానీ, వైసీపీ సభ్యులు సభకు రాకుండా మొహం చాటేస్తూ సంతకం పెట్టి అటు నుంచి అటు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే ఫేషియల్ రికగ్నిషన్‌ ద్వారా అసెంబ్లీలో సభ్యుల అటెండెన్స్ తీసుకోవాలని కొత్త రూల్ తెచ్చారు.

అంటే ఇకపై, అసెంబ్లీకి వచ్చి లోపల కూర్చుంటేనే అటెండెన్స్ కౌంట్ అవుతుంది. ఇకపై అటెండెన్స్ రిజిస్టర్‌లో హాజరు పద్దతి ఉండదని ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ తెలిపారు. కాగా, అంతకుముందు అసెంబ్లీ ప్రాంగణంలో జగన్ తో పాటు వైసీపీ సభ్యులంతా ప్లకార్డులు, బ్యానర్లతో నిరసన వ్యక్తం చేశారు.

తమకు ప్రతిపక్షంగా గుర్తింపునివ్వరని, ఏపీలో ప్రజా సమస్యలపై, కుప్పకూలిన శాంతిభద్రతలపై నిలదీయనివ్వరని జగన్ ప్లకార్డు పట్టుకొని నిరనస వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ నిరసనలో పాల్గొని రాని ప్రతిపక్ష హోదా కావాలని నినాదాలు చేశారు.

This post was last modified on February 11, 2026 10:57 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

5 minutes ago

వెయ్యి కోట్ల విధ్వంసం వారం రోజుల్లోనే

అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…

2 hours ago

మంగళగిరిని లోకేశ్ వీడాల్సిందేనా…?

లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…

3 hours ago

ప్రభాస్ ప్రేమిస్తే ఇంతే

నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…

3 hours ago

ఘోర బస్సు ప్రమాదం 10 మంది సజీవదహనం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…

5 hours ago

పవన్ ప్రయాణం… సందేహాలు అనవసరం

ఇటీవల విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం విషయంలో అభిమానులు ఎంత మాత్రం హ్యాపీగా లేరన్నది వాస్తవం. వింటేజ్ పవన్…

7 hours ago