Trends

పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా

ఆసియా కప్ 2025లో భారత్ , పాక్ మ్యాచ్ గతంలో కంటే కాస్త చప్పగానే సాగింది. అయితే దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించింది. పాకిస్థాన్‌ను 127 పరుగులకే పరిమితం చేసి, లక్ష్యాన్ని 16వ ఓవర్‌లోనే చేధించింది. 7 వికెట్ల తేడాతో గెలిచిన భారత్ గ్రూప్‌ A లో అగ్రస్థానంలో నిలిచింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు మాత్రమే సాధించింది. సహిబ్జాదా ఫర్హాన్ (40) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ తడబడిపోయారు. ఫఖర్ జమాన్ (17), షాహీన్ అఫ్రిదీ (33 నాటౌట్; 16 బంతుల్లో 4 సిక్సర్లు) కొంత పోరాడినా స్కోరు పెద్దగా పెరగలేదు. కుల్దీప్ యాదవ్ (3/18) తన స్పిన్ మాయాజాలంతో పాక్ బ్యాట్స్‌మెన్ లను కట్టడి చేశాడు. అక్షర్ పటేల్ (2/18), బుమ్రా (2/28) కూడా కీలక వికెట్లు పడగొట్టారు.

128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచే పాక్ బౌలర్లపై దాడి చేసింది. అభిషేక్ శర్మ (31; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. గిల్ (10) త్వరగా ఔటైనా, సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్; 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) జట్టును విజయానికి చేర్చాడు. తిలక్ వర్మ (31) జాగ్రత్తగా ఆడి, మధ్య ఇన్నింగ్స్‌లో స్థిరత్వం ఇచ్చాడు. చివర్లో శివమ్ దూబే (10 నాటౌట్) అవసరమైన రన్స్ సాధించాడు.

భారత్ బౌలర్ల ప్రదర్శన మొత్తం మ్యాచ్‌ను నిర్ణయించింది. పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు తీసిన బౌలర్లు, మధ్య ఓవర్లలో పాకిస్థాన్ రన్‌రేట్‌ను తగ్గించారు. ప్రత్యేకంగా కుల్దీప్ యాదవ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌లో మొదట దూకుడు, ఆపై స్థిరత్వం, చివరగా స్మూత్ ఫినిషింగ్‌తో టీమ్ ఇండియా క్లినికల్ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆసియా కప్ 2025లో భారత్ మరోసారి ఫేవరెట్‌గా నిలిచింది. పాక్‌తో గత మ్యాచ్‌లలోనూ ఆధిపత్యం కొనసాగించిన భారత్, ఈ సారి కూడా అదే తరహా ఆటతీరు చూపింది. తక్కువ లక్ష్యం అయినా దాన్ని ఎంత సులభంగా ఛేదించిందో చూస్తే, టీమ్ ఇండియా ఫామ్‌లో ఉందని స్పష్టమవుతోంది. ఇక వచ్చే మ్యాచ్‌లో భారత్‌ను ఎదుర్కోవడం ఏ జట్టుకైనా పెద్ద సవాలే.

This post was last modified on September 14, 2025 11:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

11 hours ago