Political News

గంజాయి బ్యాచ్ హద్దులు మీరుతుంది

హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి ముఠా నానా హంగామా సృష్టించింది. దాంతో పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది. గంజాయి ముఠాను అరెస్టు చేసి జైలుకు పంపించింది.

హైదరాబాద్ లోని బాలా నగర్ కు చెందిన బొల్ల కిరణ్ కుమార్, బొల్ల దుర్గా ప్రసాద్, బొల్ల కమలాకర్ కొంత కాలంగా గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి పెద్ద మొత్తంలో గంజాయి తీసుకొచ్చి చిన్న చిన్న పాకెట్లుగా చేసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈగల్ టీం ఆకస్మిక దాడులు చేసి తనిఖీలు నిర్వహించింది. దాంతో గంజాయి ముఠా గుట్టు రట్టయ్యింది. 2025 నుంచి 1400 ఆన్ లైన్ లావాదేవీలు నిర్వహించి 20 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు ఈగల్ టీం నిర్దారించింది. ఈ వ్యవహారంలో 31 మంది సరఫరాదారులను, 240 మంది వినియోగదారులను గుర్తించి కేసు నమోదు చేశారు.

సోదాలకు బాలా నగర్ వెళ్లిన ఈగల్ టీం పై బొల్ల బ్రదర్స్ తిరగబడ్డారు. కుక్కలను వొదిలి హల్ చల్ చేశారు. కత్తితో దాడి చేసి భయబ్రాంతులు సృష్టించారు. పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అయినా వెనకంజ వేయని ఈగల్ టీం నలుగురిని అరెస్టు చేసింది. మరికొందరు వినియోగదారులను కూడా అరెస్టు చేశారు. ఈ ఘటన తెలంగాణాలో సంచలనం సృష్టిస్తుంది.

This post was last modified on August 13, 2026 9:56 pm

Share

Recent Posts

‘జగన్ వస్తున్నారా.. అయితే మూతే’

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…

7 minutes ago

వైసీపీకి చెక్‌: మండలి వైస్ చైర్మన్‌పై కూటమి కీలక నిర్ణయం!

ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…

11 minutes ago

జగన్ కు జైల్లో అవమానం?

కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…

2 hours ago

దొంగతనం చేసిన ఇంట్లోనే నిద్రపోయిన దొంగ!

ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…

4 hours ago

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం… పొత్తే కారణమా?

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…

4 hours ago

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతు

రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…

7 hours ago