ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా లేచి చూసే సరికి ఇంటి ఓనర్లు ఆ దొంగ చుట్టూ కర్రలు పట్టుకొని రెడీగా ఉండడం…ఇటువంటి సీన్లు సినిమాల్లో చాలా ఉన్నాయి. ఇదే తరహా సీన్ ఒకటి రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో కూడా జరిగింది. హైదరాబాద్ లో గంజాయి మత్తులో దొంగతనానికి వెళ్లిన దొంగ అడ్డంగా దొరికిపోయిన ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
హైదరాబాబ్ లోని పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వాడి- ఏ-ముస్తఫా ప్రాంతంలోని ఓ ఇంట్లో దొంగతనం చేయాలని ఓ దొంగ అనుకున్నాడు. అయితే, ఆల్రెడీ గంజాయి కొట్టిన ఆ దొంగ మత్తులో ఉన్నానన్న సంగతి మరచిపోయినట్లున్నాడు. ఓ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసిన దొంగ…ఆ తర్వాత మత్తులో చిత్తయి ఆ ఇంట్లోనే నిద్రపోయాడు. కట్ చేస్తే…ఈ లోపు ఇంటి ఓనర్లు వచ్చి గాఢ నిద్రలో ఉన్న దొంగను చూసి షాకయ్యారు. అతడి జేబులో తమ ఇంట్లోని బంగారు నగలు చూసి అవాక్కయ్యారు.
వెంటనే ఆ దొంగకు నిద్రాభంగం కలిగించిన ఇంటి యజమాని…ఆ దొంగ ఎవరు ఏంటి అని వాకబు చేశారు. గతంలో కూడా తమ ఇంట్లో మొబైల్ ఫోన్ చోరీ అయిందని ఆయన తెలిపారు. అయితే, తాను ఆ ఇంటికి సమీపంలోనే ఉంటానని, ఆ ఏరియావాడినేనని దొంగోడు సెలవిచ్చాడు. ఆ వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఆ అన్ ప్రొఫెషనల్ దొంగను పోలీసులకు అప్పగించారు. ఇక, కుంభకర్ణుడి కజిన్ లా ఉన్న ఆ దొంగ ఇంకెన్ని ఇళ్లలో దొంగతనం చేశాడోనని పోలీసులు విచారణ జరుపుతున్నారు.
This post was last modified on August 13, 2026 6:25 pm
రాష్ట్రంలో క్రెడిట్ వార్ ముదిరి పాకాన పడింది. ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఈ క్రెడిట్ మాదంటే కాదు మాదని…
నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సుజిత్ వదిలిన ఓజి యూనివర్స్ వీడియో మీద మిశ్రమ స్పందన కనిపిస్తోంది.…
స్థానిక ఎన్నికలు వాయిదా పడాలని గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలను తిప్పి కొడతామని, ఎన్నికలను వాయిదా వేసే ప్రసక్తే లేదని…
ఉత్తరాది, కర్ణాటక రాష్ట్రాల సంగతేమో కానీ తెలుగులో టాక్సిక్ కథ దాదాపు ముగింపుకు వచ్చినట్టే. రెండో వారంలోకి అడుగు పెట్టకముందే…
మాజీ టీమిండియా క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడిగా జన్మించిన అనయా బంగర్, జెండర్ ట్రాన్సిషన్ తర్వాత మహిళగా తన జీవితాన్ని…
గజం భూమి వేలల్లో ఉంటేనే సాధారణ మధ్యతరగతి ప్రజలు లబోదిబోమనే పరిస్థితి నెలకొంటుంది. అలాంటిది.. లక్షలు పలికితే .. ఇంకేం…