కిష్కింధపురి.. ఈ వారం మంచి అంచనాల మధ్య బాక్సాఫీస్ బరిలో నిలిచిన సినిమా. రిలీజ్కు ముందు రోజే ఈ చిత్రానికి పెద్ద ఎత్తున పెయిడ్ ప్రిమియర్స్ వేశారు. వాటి నుంచి మంచి టాకే వచ్చింది. ఆ షోలన్నీ చాలా వరకు ఫుల్స్ అయ్యాయి. తొలి రోజు ఈ చిత్రానికి మోడరేట్ రివ్యూలు రాగా.. ఆడియన్స్ రెస్పాన్స్ పర్వాలేదనిపించింది. ఐతే ‘మిరాయ్’ లాంటి మంచి హైప్ ఉన్న సినిమాతో పోటీ పడడం దీనికి ప్రతికూలంగా మారింది.
నిజానికి సెప్టెంబరు 12న ఆ చిత్రం సోలోగా రిలీజ్ కావాల్సింది. కానీ సెప్టెంబరు 5కు అనుకున్న ‘మిరాయ్’ని వారం వాయిదా వేశారు. ఒక దశలో దుల్కర్ సల్మాన్ సినిమా ‘కాంత’ కూడా 12కే వస్తుందనుకున్నారు. కానీ ఆ చిత్రం పోటీ నుంచి తప్పుకుంది. దుల్కర్ సినిమా పోటీలో ఉండి, ‘మిరాయ్’ రాకపోతే ‘కిష్కింధపురి’ కచ్చితంగా బాక్సాఫీస్ విన్నర్ అయ్యేదేమో. కానీ ‘మిరాయ్’తో పోటీ పడడం మాత్రం మైనస్ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
రిలీజ్కు ముందు రోజు రాత్రంతా ‘కిష్కింధపురి’నే సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. కానీ ఉదయానికి పరిస్థితి మారిపోయింది. ‘మిరాయ్’ సోషల్ మీడియాను ముంచెత్తేసింది. ముందు ఉన్న హైప్కు తోడు.. ఆ సినిమాకు ఫుల్ పాజిటివ్ రివ్యూలు రావడంతో తొలి రోజు హౌస్ ఫుల్స్తో రన్ అయింది. సినిమాలో ఉన్న కంటెంట్కు మించి ‘మిరాయ్’కి పాజిటివ్ టాక్, హైప్ వచ్చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందీలో సైతం ఆ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడంతో సినిమా రేంజే మారిపోయేలా కనిపిస్తోంది.
‘కిష్కింధపురి’ డీసెంట్ హార్రర్ థ్రిల్లర్ అనడంలో సందేహం లేదు. జానర్ లవర్స్ కచ్చితంగా దీన్ని ఇష్టపడతారు. బి, సి సెంటర్లలో ఎలాగూ బెల్లంకొండ శ్రీనివాస్కు ఫాలోయింగ్ ఉంది. ఇదే సినిమా కనుక సోలోగా రిలీజైతే అది ‘రాక్షసుడు’ తరహాలోనే పెద్ద హిట్టయ్యే అవకాశముండేది. కానీ ఇప్పుడు ‘మిరాయ్’తో పోటీ వల్ల బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడలేకపోతోంది. వసూళ్ల పరంగా యావరేజ్ స్థాయిని మించడం కష్టంగానే కనిపిస్తోంది.
ముందు లీకైనట్టే ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం వాయిదా పడింది. జూలై 30 విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు…
టాలెంట్ ఉండి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలంటే ఎవరో ఒకరి దగ్గర శిష్యుడిగా చేరాలి. లేదా ఎవరైనా రిఫరెన్స్ తీసుకుని ప్రముఖ…
ఏపీలో విపక్షం వైసీపీ ఇటీవలి కాలంలో తిరిగి యాక్టివ్ మోడ్ లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రదాన…
టాలీవుడ్ లో జూన్ నెలలో పెద్ది, మా ఇంటి బంగారం తమ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చాయి. తెలుగు రాష్ట్రాల…
రిషికొండ పాలెస్ లను వినియోగంలోకి తీసుకువచ్చే దిశగా ఎట్టకేలకు ఓ కీలక అడుగు అయితే.పడింది. సాగర నగరం విశాఖ పర్యాటక…
బాలీవుడ్ మూవీ అల్ఫా ఇవాళ విడుదలైన సంగతి తెలిసిందే. అలియా భట్ టైటిల్ రోల్ పోషించగా శార్వరి వాఘ్ మరో…