Political News

అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారు: అయ్య‌న్న పాత్రుడు

వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌హా.. ఆ పార్టీ ఎమ్మెల్యేల‌పై అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నార‌ని.. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లకు సేవ చేయకుండా వారి త‌ర‌ఫున గ‌ళం వినిపించ‌కుండా.. వారి సొమ్మును జీతంగా పొందే అర్హ‌త ఎవ‌రికీ లేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఆదర్శంగా ఉండాలని సూచించారు. అసెంబ్లీకి కనీసం 50 రోజులైనా హాజరు కావాలని అన్నారు. సభకు హాజరుకాకుండా మీడియా మీటింగులు పెట్ట‌డం స‌రికాద‌న్నారు.

తిరుప‌తిలో రెండు రోజులు పాటు జ‌రగ‌నున్న మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధుల సాధికార‌త క‌మిటీల జాతీయ స‌ద‌స్సులో స్పీక‌ర్ అయ్య‌న్న‌పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగానే జ‌గ‌న్‌పై ఆయ‌న ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు. స‌భ‌కు రాకుండా జీతం తీసుకోవ‌డం స‌రికాద‌న్నారు. ప్ర‌జ‌లు ఎన్నోఆశ‌లు పెట్టుకుని.. ఎంతో మందిని ఓడించి.. మ‌న‌ల్ని గెలిపించారంటే.. వారికి మ‌న‌పై ఎంతో విశ్వాసం ఉంటుంద‌న్నారు. అలాంటి విశ్వాసాన్ని నిల‌బెట్టుకునేందుకు.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించేందుకు స‌భ‌ను వినియోగించుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

అంతేకాదు.. దేశంలోని అనేక ప్రైవేటు కంపెనీల్లో చిరుద్యోగుల‌కు సైతం ప‌నిచేయ‌క‌పోతే.. వేత‌నం చెల్లించ‌ర‌ని అన్నారు. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్‌సభ స్పీకర్‌ మార్గదర్శకాలు ఇవ్వాల‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా స‌భ‌లో ఉన్న స్పీక‌ర్ ఓం బిర్లాకు విన్న‌వించారు. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేదే 45 రోజులని, వాటికి కూడా రాకపోతే ఎలా? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఇక‌, మ‌హిళ‌ల‌కు మేలు చేసేందుకు ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే అనేక సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని, వారికి ఆస్తిలో హ‌క్కును క‌ల్పించార‌ని అన్నారు.

చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌.. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేశార‌ని చెప్పారు. డ్వాక్రా సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏర్పాటు చేశార‌ని తెలిపారు. ఎంఎస్ ఎంఈల ద్వారా మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని తెలిపారు. మంత్రివ‌ర్గంలోనూ మ‌హిళ‌ల‌కు స‌మ ప్రాధాన్యం ఇస్తున్నార‌ని తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌రింత మంది మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం, ప్రాతినిధ్యం కూడా ద‌క్కుతుంద‌ని వ్యాఖ్యానించారు.

Satya

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

17 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

49 minutes ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

9 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

11 hours ago