Political News

అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారు: అయ్య‌న్న పాత్రుడు

వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌హా.. ఆ పార్టీ ఎమ్మెల్యేల‌పై అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నార‌ని.. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లకు సేవ చేయకుండా వారి త‌ర‌ఫున గ‌ళం వినిపించ‌కుండా.. వారి సొమ్మును జీతంగా పొందే అర్హ‌త ఎవ‌రికీ లేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఆదర్శంగా ఉండాలని సూచించారు. అసెంబ్లీకి కనీసం 50 రోజులైనా హాజరు కావాలని అన్నారు. సభకు హాజరుకాకుండా మీడియా మీటింగులు పెట్ట‌డం స‌రికాద‌న్నారు.

తిరుప‌తిలో రెండు రోజులు పాటు జ‌రగ‌నున్న మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధుల సాధికార‌త క‌మిటీల జాతీయ స‌ద‌స్సులో స్పీక‌ర్ అయ్య‌న్న‌పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగానే జ‌గ‌న్‌పై ఆయ‌న ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు. స‌భ‌కు రాకుండా జీతం తీసుకోవ‌డం స‌రికాద‌న్నారు. ప్ర‌జ‌లు ఎన్నోఆశ‌లు పెట్టుకుని.. ఎంతో మందిని ఓడించి.. మ‌న‌ల్ని గెలిపించారంటే.. వారికి మ‌న‌పై ఎంతో విశ్వాసం ఉంటుంద‌న్నారు. అలాంటి విశ్వాసాన్ని నిల‌బెట్టుకునేందుకు.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించేందుకు స‌భ‌ను వినియోగించుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

అంతేకాదు.. దేశంలోని అనేక ప్రైవేటు కంపెనీల్లో చిరుద్యోగుల‌కు సైతం ప‌నిచేయ‌క‌పోతే.. వేత‌నం చెల్లించ‌ర‌ని అన్నారు. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్‌సభ స్పీకర్‌ మార్గదర్శకాలు ఇవ్వాల‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా స‌భ‌లో ఉన్న స్పీక‌ర్ ఓం బిర్లాకు విన్న‌వించారు. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేదే 45 రోజులని, వాటికి కూడా రాకపోతే ఎలా? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఇక‌, మ‌హిళ‌ల‌కు మేలు చేసేందుకు ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే అనేక సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని, వారికి ఆస్తిలో హ‌క్కును క‌ల్పించార‌ని అన్నారు.

చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌.. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేశార‌ని చెప్పారు. డ్వాక్రా సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏర్పాటు చేశార‌ని తెలిపారు. ఎంఎస్ ఎంఈల ద్వారా మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని తెలిపారు. మంత్రివ‌ర్గంలోనూ మ‌హిళ‌ల‌కు స‌మ ప్రాధాన్యం ఇస్తున్నార‌ని తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌రింత మంది మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం, ప్రాతినిధ్యం కూడా ద‌క్కుతుంద‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on September 15, 2025 11:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

43 minutes ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

46 minutes ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

1 hour ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

2 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

3 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

4 hours ago