ఇదే చివ‌రి ఎన్నిక‌.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి: చంద్ర‌బాబు

క‌ర్నూలు జిల్లాలోని పత్తికొండ‌, నంద్యాల‌, కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ర్య‌టించారు. మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం క‌ర్నూలుకు వెళ్లిన చంద్ర‌బాబు ఇక్క‌డి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చంద్ర‌బాబు ప్ర‌సంగించారు. ప‌త్తికొండ‌లో నిర్వ‌హించిన ర్యాలీ, అనంత‌రం స‌భ‌లో చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తూ.. ఒకింత భావోద్వేగానికి గుర‌య్యారు. గ‌త ఏడాది అసెంబ్లీలో జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు.

“నేను సీనియర్ నాయకుడిని. నన్ను అవమానించిన వారు ఇప్ప‌టి వ‌ర‌కు లేరు. కానీ, అసెంబ్లీకి వెళ్లిన నన్నే కాదు.. మా భార్యను కూడా వైసీపీ కౌర‌వ సైన్యం అవమానించింది. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని బయటకి వచ్చా, మళ్లీ క్షేత్ర స్థాయిలో గెలిచి గౌరవ సభలో అడుగు పెడతా. నేను ఆసెంబ్లీకి వెళ్లాలంటే. రాజకీయాల్లో ఉండాలంటే. ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే.. ఈ ఎన్నికల్లో మనమంతా కష్టపడి గెలవాలి. గెలిపిస్తే స‌రే! లేదంటే ఇదే నా చివ‌రి ఎన్నిక‌” అని చంద్ర‌బాబు గ‌ద్గ‌ద స్వ‌రంతో వ్యాఖ్యానించారు.

ఏపీలో మధ్యం డిస్టరీలన్నీ జగన్‌వేన‌ని చెప్పారు. ప్రభుత్వం మద్యం దుకాణాల్లో ఆయన బ్రాండ్లే అమ్ముతున్నారని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. సాయంత్రం బటన్ నొక్కితే డబ్బులన్నీ ఆయనకే చేరిపోతాయని తెలిపారు. ఇటీవల ఢిల్లీలో మద్యంపై దాడులు చేశారు. ఏపీలో ఎప్పుడు దాడులు చేస్తారో అనే భ‌యంతో వైసీపీ నాయ‌కులు బిక్క‌చ‌చ్చి బ‌తుకుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల ప్రధాని మోడీ విశాఖకు వచ్చినప్పుడు పార్టీ నాయకులతో మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘాల ద్వారా చంద్రబాబు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిచారని న‌న్ను కొనియారు.. అని పేర్కొన్నారు.

“మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది టీడీపీనే. సమైఖ్యాంధ్రలో విజన్ -2024 తయారు చేసి అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర విభజన తర్వాత విజన్-2029కు ప్రణాళిక చేశాం. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీని చూడాలనుకున్నాను. ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న న‌ర‌కరాసురులను, నరరూప హంతకులను కట్టడి చేయడానికి మనమంతా కష్టపడాలి” అని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.

హైకోర్టుకు నేను అడ్డుకాదు!

కర్నూలులో హైకోర్టుకు తాను అడ్డుపడుతున్నానని ప్రచారం చేస్తున్నారని, తాను అడ్డు పడడం లేదని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. వైసీపీకి 151 సీట్లు ఇచ్చారని, 36 మంది ఎంపీలను ఇచ్చారని, మీ కేసుల కోసం ముగ్గురు ఎంపీలను అమ్ముకున్నార‌ని వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. “నేను నందిగామకు వెళితే. నాపైనే రాళ్లు వేశారు. పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెడితే గాల్లో రాళ్లు వచ్చాయంటున్నారు. రేపు పూలల్లో బాంబులు వస్తాయంటేరేమో” అని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు.