Political News

రాహుల్ ఇటలీ వెళితే.. ఇంత రచ్చనా?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా ఇటలీకి వెళ్లిన వైనంపై బీజేపీ తప్పు పడుతోంది. బాధ్యత లేకుండా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడుతోంది. ఈ వైఖరిని కాంగ్రెస్ తీవ్రంగా తప్పు పడుతోంది. వ్యక్తిగత టూర్ ను ఎందుకింత రాద్దాంతం చేస్తారని ప్రశ్నిస్తోంది. ఇంతకూ ఏమైందంటే..
ప్రస్తుతం దేశంలో కరోనా.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ.. విదేశాలకు వెళ్లే వారు.. అక్కడి నుంచి వచ్చే వారు అప్రమత్తంగా ఉంటున్నారు.

అయినప్పటికీ కేసుల సంఖ్య మాత్రం పెరగటమే కానీ తగ్గట్లేదు. దీంతో.. అవసరం ఉంటే తప్పించి బయటకు వెళ్లొద్దన్నట్లుగా పలువురు సూచన చేస్తున్నారు. ప్రజలతో పాటు ప్రభుత్వాలు సైతం అప్రమత్తంగా ఉంటున్నాయి. ఇలాంటివేళ.. రాహుల్ గాంధీ ఇటలీకి వెళ్లారు. ఇదో ఇష్యూగా మారింది. ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉన్న వేళలో రాహుల్ బాధ్యతను మరిచి విదేశాలకు ఎలా వెళతారు? అన్నదిప్పుడు చర్చగా మారింది. బీజేపీ నేతలు రాహుల్ ఇటలీ పర్యటననుప్రశ్నిస్తున్నారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ విదేశాలకు వెళ్లటం బాధ్యతారాహిత్యమని బీజేపీ నేతలు తప్పు పడుతున్నారు.

అంతేకాదు.. తరచూ ఆయన ఫారిన్ ట్రిప్ లకు ఎందుకు వెళుతున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇదే అంశంపై కేంద్రమంత్రి అమిత్ షా రాహుల్ విదేశీ పర్యటనలకు సంబంధించి వివరాల్నివెల్లడించిన అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. 2015 నుంచి 2019 మధ్య కాలంలో అంటే.. ఐదేళ్ల కాలంలో 247 సార్లు రాహుల్ విదేశాలకు వెళ్లారని పేర్కొన్నారు. తన విదేశీ పర్యటన సందర్భంగా కనీస ప్రోటోకాల్ కూడా పాటించరని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతలు వాదన మరోలా ఉంది. ఆయన వ్యక్తిగత పర్యటనలో భాగంగా ఇటలీకి వెళ్లారని.. ఈ విషయాన్ని బీజేపీ ఎందుకు అంత రచ్చ చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఎందుకు.. తరచూ తాను విదేశీ పర్యటనలకు ఎందుకు వెళుతున్నాన్న విషయం మీద రాహుల్ స్పష్టత ఇస్తే బాగుంటుంది కదా? ఎంత వ్యక్తిగతమైన తర్వాత.. ప్రజాసేవలో పునీతమవుతామని చెప్పే వారికి ప్రైవేటు అంటూ ఏం ఉంటుంది చెప్పండి

This post was last modified on December 31, 2021 2:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

8 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago