Political News

జగన్ను అసలు మోడి పట్టించుకోవటం లేదా ?

ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇదే డౌటు పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రయోజనాలను కాదు కదా కనీసం రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవటంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిలయ్యారనే చర్చ పెరిగిపోతోంది. తాజాగా కేంద్రం న్యాయశాఖ మంత్రిని కిరణ్ రిజుజును వైసీపీ ఎంపిల బృందం కలిసి చేసిన విన్నపాలను చూసిన తర్వాత అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి.

విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేంద్రమంత్రిని కలిసిన ఎంపిల బృందం కొన్ని విజ్ఞప్తులు చేసింది. అందులో మొదటిది ఫిరాయింపులకు పాల్పడేవారిపై కచ్చితమైన గడువులోగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక రెండోది అమరావతిలోని ఉన్న హైకోర్టును కర్నూలుకు రీ లోకెట్ చేయటం. నిజానికి ఈ రెండు కూడా రాజకీయ ప్రయోజనాలే అనటంలో సందేహంలేదు. వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటుకు సంబంధించే ఫిరాయింపు ఎంపిలపై చర్యలకు కచ్చితమైన గడువుండాలని ఎంపిలు కోరింది.

ఇక్కడ విషయం ఏమిటంటే తిరుగుబాటు ఎంపి ఏపార్టీలోకి పిరాయించలేదు. కాబట్టి ఫిరాయింపుల నిరోధక చట్టం ఎంపికి వర్తించదు. వైసీపీ ఎంపి ముసుగులో చంద్రబాబునాయుడు అండ్ కో తో అంటకాగుతున్నది నిజం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడే కేంద్రంలో జగన్ కున్న పలుకుబడి ఏమిటనేది తేలుతుంది. గడచిన ఏడాదిపైనుండి ఎంపిపై అనర్హత వేటు వేయమని వైసీపీ ఎంపిలు అడుగుతునే ఉన్నారు, నరేంద్రమోడి, అమిత్ షా, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సరేనంటునే ఉన్నారు.

జగన్ తో ఎలాంటి అవసరమూ లేదుకాబట్టే మోడి అన్నింటికీ తలూపుతున్నారే కానీ ఏ డిమాండ్ నెరవేరటంలేదు. ఇక హైకోర్టును కర్నూలుకు తలించటం కూడా కేంద్రానికి పెద్ద పనికాదు. ఓసారి సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ తో అమిత్ షా మాట్లాడితే తేలిగ్గానే అయిపోవచ్చు. కానీ ఆ విషయం కూడా ఎన్నిరోజులైనా ముందుకు అడుగు పడటంలేదు. హైకోర్టు రీ లొకేషన్ కు సుప్రింకోర్టు, కేంద్రం ఓకే అంటే ఏపికి మూడు రాజధానులు ఏర్పడినట్లే. రీ లొకేషన్ అనుమతి రాని కారణంగానే జగన్ వైజాగ్ వెళ్ళటంలో లేటవుతోంది.

నిజానికి జగన్ పెడుతున్న పై రెండు డిమాండ్లలో కర్నూలు లో హైకోర్టన్నది 2019 ఎన్నికల్లో బీజేపీ మ్యానిఫెస్టోలోనే ఉంది. తమ పార్టీ మ్యానిఫెస్టోలో ఉన్న అంశాన్ని జగన్ ఆచరణలోకి తెస్తానంటున్నా ఎందుకనో కేంద్రంలో స్పీడు కనబడటంలేదు. అంటే ఢిల్లీ స్ధాయిలో జరుగుతున్నది చూసిన తర్వాత జగన్ను ప్రధానమంత్రి పట్టించుకోవటంలేదా ? అనే సందేహాలు పెరగక ఏమవుతాయి.

This post was last modified on August 13, 2021 10:55 am

Share
Show comments

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

59 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago