Political News

జగన్ను అసలు మోడి పట్టించుకోవటం లేదా ?

ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇదే డౌటు పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రయోజనాలను కాదు కదా కనీసం రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవటంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిలయ్యారనే చర్చ పెరిగిపోతోంది. తాజాగా కేంద్రం న్యాయశాఖ మంత్రిని కిరణ్ రిజుజును వైసీపీ ఎంపిల బృందం కలిసి చేసిన విన్నపాలను చూసిన తర్వాత అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి.

విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేంద్రమంత్రిని కలిసిన ఎంపిల బృందం కొన్ని విజ్ఞప్తులు చేసింది. అందులో మొదటిది ఫిరాయింపులకు పాల్పడేవారిపై కచ్చితమైన గడువులోగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక రెండోది అమరావతిలోని ఉన్న హైకోర్టును కర్నూలుకు రీ లోకెట్ చేయటం. నిజానికి ఈ రెండు కూడా రాజకీయ ప్రయోజనాలే అనటంలో సందేహంలేదు. వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటుకు సంబంధించే ఫిరాయింపు ఎంపిలపై చర్యలకు కచ్చితమైన గడువుండాలని ఎంపిలు కోరింది.

ఇక్కడ విషయం ఏమిటంటే తిరుగుబాటు ఎంపి ఏపార్టీలోకి పిరాయించలేదు. కాబట్టి ఫిరాయింపుల నిరోధక చట్టం ఎంపికి వర్తించదు. వైసీపీ ఎంపి ముసుగులో చంద్రబాబునాయుడు అండ్ కో తో అంటకాగుతున్నది నిజం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడే కేంద్రంలో జగన్ కున్న పలుకుబడి ఏమిటనేది తేలుతుంది. గడచిన ఏడాదిపైనుండి ఎంపిపై అనర్హత వేటు వేయమని వైసీపీ ఎంపిలు అడుగుతునే ఉన్నారు, నరేంద్రమోడి, అమిత్ షా, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సరేనంటునే ఉన్నారు.

జగన్ తో ఎలాంటి అవసరమూ లేదుకాబట్టే మోడి అన్నింటికీ తలూపుతున్నారే కానీ ఏ డిమాండ్ నెరవేరటంలేదు. ఇక హైకోర్టును కర్నూలుకు తలించటం కూడా కేంద్రానికి పెద్ద పనికాదు. ఓసారి సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ తో అమిత్ షా మాట్లాడితే తేలిగ్గానే అయిపోవచ్చు. కానీ ఆ విషయం కూడా ఎన్నిరోజులైనా ముందుకు అడుగు పడటంలేదు. హైకోర్టు రీ లొకేషన్ కు సుప్రింకోర్టు, కేంద్రం ఓకే అంటే ఏపికి మూడు రాజధానులు ఏర్పడినట్లే. రీ లొకేషన్ అనుమతి రాని కారణంగానే జగన్ వైజాగ్ వెళ్ళటంలో లేటవుతోంది.

నిజానికి జగన్ పెడుతున్న పై రెండు డిమాండ్లలో కర్నూలు లో హైకోర్టన్నది 2019 ఎన్నికల్లో బీజేపీ మ్యానిఫెస్టోలోనే ఉంది. తమ పార్టీ మ్యానిఫెస్టోలో ఉన్న అంశాన్ని జగన్ ఆచరణలోకి తెస్తానంటున్నా ఎందుకనో కేంద్రంలో స్పీడు కనబడటంలేదు. అంటే ఢిల్లీ స్ధాయిలో జరుగుతున్నది చూసిన తర్వాత జగన్ను ప్రధానమంత్రి పట్టించుకోవటంలేదా ? అనే సందేహాలు పెరగక ఏమవుతాయి.

This post was last modified on August 13, 2021 10:55 am

Share
Show comments

Recent Posts

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

2 hours ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

2 hours ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

3 hours ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

3 hours ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

3 hours ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

3 hours ago