Political News

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం పాటు పడుతున్న మోదీని అనకూడని మాటలు అంటుంటే నా గుండె కదిలించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆద్యంతం ఉద్వేగంతో సాగింది. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం, బంగారం అమ్ముకున్న దశలో పగ్గాలు చేబట్టి దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధానికి ఇదా మనం ఇచ్చే బహుమతి అని ప్రశ్నించారు. ఆయన మీద మాట పడితే మా మీద పడినట్లే స్పష్టం చేశారు . ఎంత దూషించినా పట్టించుకోకుండా తిట్టిన వాళ్ళను సైతం క్షమించిన పెద్ద మనసు కలిగిన మోదీకి పాదాభివందనాలు చేస్తున్నాను అన్నారు.

పవన్ ఇంకా ఏమన్నారంటే..

పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సంస్కారం నేర్పించడం చాలా అవసరమని తల్లీదండ్రులకు సూచించారు. ఒక కుటుంబాన్ని నడపడానికి కష్ట పడుతున్న మనకు 147కోట్ల జనాభా కలిగిన ఇంత పెద్ద దేశాన్ని నడపడం ఎంత కష్టమో ఆలోచించాలని సూచించారు.

పవన్ ప్రసంగానికి విశేష స్పందన…

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జంతర్ మంతర్లో విద్యార్థుల దూషణలను క్షమిస్తున్నట్లు ప్రధాని మోదీ శుక్రవారం వీడియా విడుదల చేసిన నేపథ్యంలో అదే విషయంపై పవన్ కళ్యాణ్ మాట్లాడ్డం గమనార్హం. భోగాపురం విమానాశ్రయం గురించి ప్రస్థావించినప్పటికీ జంతర్ మంతర్ దూషణలపైనే ఎక్కువగా మాట్లాడ్డం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

This post was last modified on August 1, 2026 4:35 pm

Share

Recent Posts

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

11 minutes ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

13 minutes ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

1 hour ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

2 hours ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

2 hours ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

3 hours ago