ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి తోడు అందరికీ అర్థమయ్యేలా తెలుగు డబ్బింగ్ కూడా చేయడంతో ఆదరణ అంతకంతా పైకి వెళ్లడం తప్ప తగ్గేది కాదు. మమ్మీ సిరీస్ కు థియేటర్ల దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మిన ఉదంతాలున్నాయి. లక్ష్మి గణపతి ఫిలిమ్స్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ కేవలం ఇలాంటి చిత్రాల హక్కులతోనే కోట్ల రూపాయల వ్యాపారం చేయడం ఒక చరిత్ర.
తర్వాత వీటి ఊపు తగ్గిపోయింది. అవెంజర్స్ లాంటివి అప్పుడప్పుడు పెద్ద సౌండ్ చేసినా క్రమం తప్పకుండ ఒక ఫ్లోలో హాలీవుడ్ సినిమాలు ఆడింది తక్కువే. కానీ చూస్తుంటే మళ్ళీ వాటికి మంచి రోజులు వచ్చినట్టే ఉన్నాయి. రెండు వారాల క్రితం రిలీజైన ది ఒడిస్సి ఇప్పటికీ ఇండియాలో స్ట్రాంగ్ గా ఉండటం అసలు షాక్. వంద కోట్ల గ్రాస్ దాటిన తర్వాత కూడా ఏ సెంటర్స్ లో చాలా స్క్రీన్లు హౌస్ ఫుల్ అవుతున్న వైనం బుక్ మై షోలో చూడొచ్చు.
తాజాగా వచ్చిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే గురించి చెప్పాలంటే అరాచకం అనే మాట చిన్నదే అవుతుంది. ఇంకా ఆదివారం రాకుండానే 125 కోట్లకు పైగా గ్రాస్ లాగేయడం చూసి మతులు పోయినంత పనవుతోంది. టాక్ కొంచెం మిశ్రమంగా వచ్చినప్పటికీ ఆడియన్స్ దాన్ని లెక్క చేయడం లేదు. సాలీడు మనిషిని పెద్ద తెరపై ఎక్స్ పీరియన్స్ చేయాల్సిందేనంటూ కంకణం కట్టుకుని మరీ చూస్తున్నారు.
ట్రేడ్ వర్గాల ప్రకారం ప్రస్తుతం మన దేశంలో ఈ వీకెండ్ ది ఒడిస్సి, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కలిపి 20 వేలకు పైగా షోలు పడుతున్నాయి. ఇది చాలా పెద్ద నెంబర్. ఇప్పటిదాకా ఈ రెండు సినిమాల థియేటర్ రన్ కలుపుకుంటే 80 వేలకు పైగానే షోలు జరుగుతున్నాయి. ఇక్కడే ఇలా ఉంటే యుఎస్, యుకె, ఆస్ట్రేలియా, మలేషియా లాంటి విదేశాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉదాహరణకు ఒడిస్సి ఐమాక్స్ టికెట్లు కొన్ని చోట్ల సెప్టెంబర్ 10 దాకా అమ్ముడుపోయాయి. నలభై వేలకు పైగా ప్రేక్షకులు తమ వంతు కోసం ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. అప్పటికంతా ఓటిటిలో వచ్చినా ఆశ్చర్యం లేదు. స్పైడర్ మ్యాన్ కూడా నేనేం తీసిపోలేదనే తరహాలో రికార్డులను బద్దలు కొట్టుకుంటూ వెళ్తున్నాడు. ఆల్రెడీ అవెంజర్స్ ఎండ్ గేమ్ ని దాటేసి అవతార్ ని టార్గెట్ చేసుకున్న వైనం వసూళ్ల నెంబర్లు చూస్తే అర్థమైపోతుంది.
This post was last modified on August 1, 2026 4:22 pm
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…