Movie News

సుకుమార్ మహేష్‌ను కలిశాడు కానీ.


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, అగ్ర దర్శకుడు సుకుమార్‌ల కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘1 నేనొక్కడినే’పై విడుదలకు ముందు ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో ఆ చిత్రం విఫలమైంది. ఆ సమయానికి మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిందీ సినిమా. రిలీజ్ తర్వాత క్లాసిక్ స్టేటస్ తెచ్చుకుంటేనేమి.. ఆ చిత్రాన్ని నమ్ముకున్న వాళ్లందరికీ చేదు అనుభవమే మిగిల్చిందా సినిమా. మళ్లీ వీరి కలయికలో ఓ సినిమా కోసం రెండేళ్ల ముందు సన్నాహాలు జరగడం తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్ బేనర్లో ఇద్దరూ సినిమా చేయడానికి ఓకే అనుకున్నారు. దాదాపు ఆరు నెలల పాటు కథా చర్చలు నడిచాయి. కానీ తర్వాత ఏమైందో ఏమో ఈ సినిమా ఉన్నట్లుండి ఆగిపోయింది. మహేష్‌తో అనుకున్న కథతోనే అల్లు అర్జున్ హీరోగా సినిమా మొదలుపెట్టాడు సుక్కు. అదే.. పుష్ప. ఆ టైంలో మహేష్, సుక్కుల మధ్య గ్యాప్ వచ్చిన మాట వాస్తవం.

ఐతే ఇద్దరూ మళ్లీ కలిసి ఓ సినిమా చేస్తారని ఎప్పటికప్పుడు గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఆ దిశగా సంకేతాలు మాత్రం కనిపించడం లేదు. ఎవరికి వాళ్లు వేరే కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు. ఐతే తాజాగా మహేష్, సుకుమార్ మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్‌లో కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకోవడంతో మళ్లీ కలిసి సినిమా చేస్తారా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఐతే ఈ ఇద్దరూ వేర్వేరుగా మైత్రీ బేనర్లో పని చేస్తున్న నేపథ్యంలోనే అనుకోకుండా అక్కడ కలిశారు. చాన్నాళ్లకు అనుకోకుండా కలిశారు కాబట్టి రకరకాల విషయాలపై మాట్లాడుకున్నారు.
అంతే తప్ప ఇద్దరి కలిసి సినిమా చేసే విషయం ఎంతమాత్రం చర్చకు రాలేదని సమాచారం.

సుకుమార్ సినిమా చేయాలనుకున్నా.. మహేష్ ఇంకో ఐదేళ్ల వరకు ఆయనకు దొరికే పరిస్థితి లేదు. ‘సర్కారు వారి పాట’ అవ్వగానే త్రివిక్రమ్ సినిమా చేయాలి. ఆపై రాజమౌళి సినిమా మొదలవుతుంది. ఈ మూడూ పూర్తయ్యేసరికే ఇంకో రెండు మూడేళ్లు పడుతుంది. ఆపై సందీప్ రెడ్డి వంగ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి లైన్లో ఉన్నారు. సుకుమార్ లైన్లోకి వచ్చినా ఆయన నంబర్ వీళ్ల తర్వాతే. అంత ఖాళీగా లేని హీరోతో ఇంత ముందుగా సుక్కు కమిట్మెంట్ తీసుకునే టైపైతే కాదు. కాబట్టి వీరి కలయిక గురించి మరీ ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదేమో.

Satya

Recent Posts

దెయ్యాలంటే మనోళ్లకు ప్రేమ ఎక్కువే

ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…

40 minutes ago

ముద్రగడ పద్మనాభం కన్నుమూత

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…

1 hour ago

అఖిల్ ఈసారి ఆ తప్పు చేయకూడదు

అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…

3 hours ago

తారక్ సినిమా లక్ష్యాలు చాలా పెద్దవి

ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…

3 hours ago

వెయ్యి కోట్ల దురంధర్… అక్కడేమో డిజాస్టర్

పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు…

4 hours ago

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

5 hours ago