బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ… వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నేతగానూ ఇటీవలే నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును నెలకొల్పారు. సమీప భవిష్యత్తులోనే కాదు… భవిష్యత్తులో ఏ ఒక్క నేత కూడా మోదీ రికార్డును బద్దలు కొట్టడం దుస్సాధ్యమేనని చెప్పక తప్పదు. ఇలాంటి నేపథ్యంలో దేశ ప్రధానిగా మోదీ ఎంతకాలం పాటు ఉంటారన్న విషయంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ తనకు తాను ఇక దిగిపోతానని చెప్పేదాకా… దేశానిక ప్రధానిగా మోదీనే కొనసాగుతారని పవన్ వ్యాఖ్యానించారు.
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామారాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని హోదాలో మోదీ శనివారం ఉదయం లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూటమి సర్కారు నుంచి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఇటీవలే భుజానికి శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో చేతికి కట్టుతోనే పవన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పవన్… మోదీ పడ్డ కష్టాన్ని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.
దేశ పురోభివృద్దికి ప్రదాని హోదాలో నరేంద్ర మోదీ శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని పవన్ అన్నారు. ప్రధానిగా పదవీ ప్రమాణం చేసిన నాటి నుంచి మోదీ ఒక్కటంటే ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని పవన్ గుర్తు చేశారు. వెరసి అలుపెరని శ్రామికుడిగా మారిన మోదీ… దేశాన్ని పురోభివృద్దిలో పయనించేలా చేస్తున్నారని అన్నారు. అలాంటి ప్రధాని మోదీని దేశ యువత దూషించిందని… ఈ విషయం తనను చాలా భాధకు గురి చేసిందని.. మోదీని తిడుతుంటే నా కంట్లో నీళ్లు తిరిగాయని అన్నారు. జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన నిరసనల్లో దేశ యువత ప్రధాని మోదీపై నిందలేసిందని విచారం వ్యక్తం చేశారు.
తనపై నిందలు మోపిన దేశ యువతపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి బదలుగా… వారిని క్షమించారని పవన్ గుర్తు చేశారు. దేశం కోసం శ్రమిస్తున్న మోదీ లాంటి నేతలను మరింతగా ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ పనితీరును గుర్తించేలా దేశ యువతకు తెలివితేటలను ఇవ్వాలని కూడా ఆయన ఆకాంక్షించారు. దేశ యువతకు వారి తల్లిదండ్రులు విద్యాబుద్ధులు నేర్పాల్సి ఉందని కూడా పవన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మోదీని ఓడించే నేత దేశంలో లేరన్న పవన్.. మోదీ తనకు తానుగా ఇక ప్రదాని పదవి నుంచి దిగిపోతానని భావించే దాకా… దేశానికి ప్రధానిగా మోదీనే కొనసాగుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on August 1, 2026 1:54 pm
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…