Political News

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పేరిట నెలకొల్పిన ఈ ఎయిర్ పోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉగ్వేభపూరిత ప్రసంగం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును సమూలంగా మార్చనున్న భోగాపురం ఎయిర్ పోర్టుకు కొబ్బరి కాయ కొట్టడంతోనే తాను ఆగిపోలేదని, ఆ ఎయిర్ పోర్టును పూర్తి చేసి దానికి గుమ్మడి కాయ కూడా తానే కట్టానని చంద్రబాబు అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు కొబ్బరికాయ కొట్టాం.. గుమ్మడి కాయ కట్టాం అంటూ ఆయన పవర్ ఫుల్ పంచ్ లు సంధించారు.

భోగాపురం ఎయిర్ పోర్టు రాష్ట్రానికి కొత్త దశ, దిశలను నిర్దేశించనుందని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా ఇప్పటిదాకా ఉత్తరాంధ్ర నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతూ ఉంటే…భోగాపురం ఎయిర్ పోర్టుతో ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రకు వలసలు ప్రారంభం కావడం ఖాయమని ఆయన అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు వైపు యావత్తు ప్రపంచం చూస్తోందన్న చంద్రబాబు… ఈ ఎయిర్ పోర్టు కారణంగా ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభించనున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములను ఉత్తరాంధ్ర రైతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు… ఎయిర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు. ఇక ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చనున్న భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టింది కూడా ఉత్తరాంధ్రకు చెందిన జీఎంఆరేనని ఆయన గుర్తు చేశారు. ఇక భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని రికార్డు వ్యవధిలో పూర్తి చేయించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఉత్తరాంధ్రకు చెందిన వారేనని ఆయన అన్నారు. ఇక భోగాపురం ఎయిర్ పోర్టుకు తొలి అడుగు వేసిన అశోక్ గజపతి రాజు కూడా ఉత్తరాంధ్రకు చెందిన వారేనన్నారు. 

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలోనే ఏపీ రూపురేఖలు మారిపోయాయన్న చంద్రబాబు… ఈ పెట్టుబడుల్లో ఉత్తరాంధ్రకే మెజారిటీ వాటా దక్కిందని గుర్తు చేశారు. గూగుల్ తో పాటు స్టీల్ కంపెనీలు ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెట్టాయని, తాజాగా భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్రకు మరిన్ని పెట్టుబడులు రానున్నాయని ఆయన అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్రకే కాకుండా యావత్తు ఏపీకి రవాణా మరింత సులభతరం కానుందని ఆయన పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుతో ఏపీ పారిశ్రామిక భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు.

This post was last modified on August 1, 2026 5:10 pm

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

1 hour ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

2 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

3 hours ago

మోదీని యువత తిడుతుంటే పవన్ కంట్లో నీళ్లు తిరిగాయి

బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…

4 hours ago