Political News

మాటలు చెప్పినంత మాత్రాన తాను దీక్ష ఆపేది లేదు

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం తనకు హామీ ఇచ్చినట్లు ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఇటీవల వెల్లడించారు. జాతీయ స్థాయిలో సంచలనం రేపుతున్న ఈ ఇష్యూలో వాంగ్‌చుక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

వాంగ్‌చుక్ ప్రస్తుతం ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ స్వయంగా ఆయనను కలిసి దీక్ష విరమించాలని కోరారు. ఆ సమయంలోనే మంత్రి రాజీనామాతో పాటు, నీట్ లీక్ వివాదం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం ఇచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తుందని వారు హామీ ఇచ్చినట్లు వాంగ్‌చుక్ ఒక లేఖ ద్వారా తెలిపారు.

అయితే కేంద్రం ఈ మాటలు చెప్పినంత మాత్రాన తాను దీక్ష ఆపేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ పోరాటంలో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై భవిష్యత్తులో ఎలాంటి లీగల్ కేసులు పెట్టబోమని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోమని రాతపూర్వకంగా ఒక గ్యారెంటీ ఇస్తేనే తాను ఈ ఆమరణ దీక్ష విరమిస్తానని కరాఖండీగా స్పష్టం చేశారు.

జూలై 20వ తేదీన జరిగిన ‘చలో సంసద్’ మార్చ్ లో పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు. పోలీసులు వ్యవహరించినా తీరు అతిగా ఉందని, అయినా కూడా విద్యార్థులు చాలా శాంతియుతంగానే నిరసన తెలిపారని వాంగ్‌చుక్ అన్నారు. ఒక పారదర్శకమైన విద్యావ్యవస్థ కోసం గళం విప్పడమే ఆ యువత చేసిన నేరమా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన సుమారు 65 మంది ఎంపీలు తనను కలిసి దీక్ష ఆపాలని కోరినట్లు వెల్లడించారు.

తనకు కూడా ఆరోగ్యంగా బతకాలని ఉందని, తిరిగి తన విద్యార్థుల దగ్గరకు వెళ్లి పాఠాలు చెప్పాలని ఉందని ఆయన కాస్త ఎమోషనల్ అయ్యారు. కానీ ఎవరి భవిష్యత్తు కోసమైతే ఈ ఉద్యమం మొదలుపెట్టామో ఆ యువతను పోలీసు కేసుల పాలుచేసి తాను వెనక్కి తగ్గలేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి నిరసనకారుల భద్రతపై సరైన గ్యారెంటీ రాకపోతే తన దీక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని ఆయన తేల్చి చెప్పారు.

This post was last modified on July 22, 2026 6:11 pm

Share

Recent Posts

మోడీ చంద్రబాబుతో ప్రకటన చేయిస్తారా

అటు పార్లమెంటులోనూ.. ఇటు బయట కూడా.. నీట్ ప్రశ్నపత్రాలకు సంబంధించిన నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని…

2 hours ago

రణబాలి… వస్తే ఆశ్చర్యపోవాలి

విజయ్ దేవరకొండకు 2026 ఎంతో కీలకమైన సంవత్సరం. చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేని అతను.. ఈ ఏడాది…

2 hours ago

పూజా హెగ్డే మాస్ ఛాన్సు కొట్టేసిందా?

పూజా హెగ్డే పేరుకు ఉత్తరాది హీరోయినే కానీ.. ఆమె ఎక్కువ సినిమాలు చేసింది సౌత్‌లోనే. ముఖ్యంగా తెలుగులో ఆమె ఒకప్పుడు…

3 hours ago

విజయ్ అడిగితే ఏదైనా ఇచ్చేయమన్న రావిపూడి

తమిళంలో నంబర్ వన్ హీరో స్థానంలో ఉండగా సినిమాలకు టాటా చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు విజయ్. వెళ్తూ వెళ్తూ ఆయన…

3 hours ago

నాయకుడిపై కేసరి బరువు

రేపు జన నాయకుడు విడుదలవుతోంది. ఇది కాదు అసలు విశేషం. ఏపీ తెలంగాణ కొన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 7…

4 hours ago

మ్యాథ్స్ లో 51 మార్కులు… ఇప్పుడు నింగిలోకి రాకెట్ పంపాడు!

స్కూల్ లో చదివేటప్పుడు లెక్కల్లో కేవలం 51 మార్కులు వచ్చాయి. ఇంకో సబ్జెక్టులో అయితే ఏకంగా ఫెయిల్ అయ్యాడు. ఎనిమిదో…

4 hours ago