తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలకు దిగారు. జిల్లాలు, మండలాలు, నియోజకవర్గాల స్థాయిలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసనగా ధర్నాలు చేపట్టారు. రాజధాని హైదరాబాద్లో గవర్నర్ బంగళాను(లోక్భవన్) కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ మహేష్ గౌడ్ సహా పలువురు మంత్రులు ముట్టడించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మంత్రులతో పాటు పలువురు నేతలను కూడా అరెస్టు చేశారు.
ఎందుకీ నిరసన?
కేంద్ర ప్రభుత్వం విద్యావ్యవస్థకు సంబంధించి వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీలు సహా.. మిత్రపక్షాల నాయకులు సైతం మంగళవారం మెరుపు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆరోపిస్తూ.. నిరసనలకు పిలుపునిచ్చారు.
తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. హైదరాబాద్లో మహేష్ కుమార్ గౌడ్.. ఆధ్వర్యంలో చలో లోక్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెక్లెస్ రోడ్డు నుంచి గవర్నర్ బంగళా వరకు చేపట్టిన నిరసనలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అజారుద్దీన్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సహా అనేక మంది పాల్గొన్నారు. అయితే.. ర్యాలీ గవర్నర్ భవన్ వరకు చేరుకున్నా.. అక్కడ పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం.. పోలీసులు మంత్రులు సహా నేతలను అరెస్టు చేసి.. మసాబ్ట్యాక్ సమీపంలోని పోలీసు స్టేషన్కు తరలించారు.
ఇక, రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ మంత్రులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో జరిగిన నిరసనలో పాల్గొన్నారు. అడ్లూరి లక్ష్మణ్, కొండా సురేఖ సహా.. ఇతర మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో పార్టిసిటిపేట్ చేశారు. భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకుల ను సమీకరించడంతో పలు రహదారులు కాంగ్రెస్ నిరసన కారులతో నిండిపోయాయి.
ఇవీ డిమాండ్లు..
1) రాహుల్గాంధీపై చేయి చేసుకున్న పోలీసులను తక్షణం సస్పెండ్ చేయాలి.
2) ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలి.
3) నీట్ పరీక్ష లోపాలకు బాధ్యత వహిస్తూ..కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
4) విద్యార్థులతో చర్చించి.. మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం అందించాలి.
5) దేశ ప్రజలకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలి.
This post was last modified on July 22, 2026 8:20 pm
కేంద్ర ప్రభుత్వానికి ఇంటా బయటా కూడా.. నీట్ పరీక్షకు సంబంధించిన సెగ భారీగా తగులుతోంది. నిన్న మొన్నటి వరకు ఈ…
బస్సులో మనం ఒక సీట్ ని రిజర్వ్ చేసుకుని, తీరా ప్రయాణానికి వెళ్లలేకపోతే వేరొకరికి ఇవ్వడమో లేదా అమ్మడమో జరుగుతుంది.…
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కొడుకు ఆరవ్ ను హిట్…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద బజ్ బాగానే ఉంది. కిరణ్ అబ్బవరం కెరీర్…
దేశ రాజధానిలో రగులుకున్న విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న పరిస్తితి. ఈ పరిస్థితికి కారణం బీజేపీ సీనియర్ మోస్ట్ నేత, కేంద్ర…
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని…