వైసీపీ గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. 151 స్థానాల నుంచి 11కు పడిపోయింది. దీనికి కారణాలు ఏంటన్నవి అందరికీ తెలిసినా.. వైసీపీకి మాత్రం ఇంకా బోధపడలేదు. దీంతో ఇటు పార్టీలోను, అటు నాయకుల్లోనూ మార్పు కనిపించడం లేదన్న వాదన ఉంది. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు కామనే అయినా.. కారణాలు తెలుసుకుని ముందుకు సాగాల్సిన అవసరం పార్టీలపై ఉంటుంది. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.
ఏం చేస్తున్నారు.. ?
ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత లేదా పుట్టబోయే వ్యతిరేకత తమకు మేలు చేస్తుందని వైసీపీ నాయకులు అంచనా వేసుకుంటున్నారు. వాస్తవానికి ఇది పార్టీ అధిష్టానంలోనే ఉంది. అందుకే క్షేత్రస్థాయి నాయకులు కూడా అదే దారిలో నడుస్తున్నారు. దీంతో వైసీపీలో సరైన దిశానిర్దేశం లేకుండానే నాయకులు ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా పార్టీ పుంజుకునే విషయంలో ఇంకా వెనుక బడే ఉందన్నది వాస్తవం.
ముఖ్యంగా నియోజకవర్గాల స్థాయిలో పార్టీకి భారీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వైఖరి పార్టీకి కలిసి రాకపోగా.. వివాదాలకు కేంద్రంగా మారుతోంది. దీనిని సరిచేయాల్సి పార్టీ అధిష్టానం కూడా మౌనంగానే ఉండడం గమనార్హం. అంతా నేతలే చూసుకుంటారులే అనే ధోరణి అవలంభించడంతో పరిస్థితి ఇబ్బందిగానే ఉందన్నది పార్టీకి తెలిసినా.. నాయకులకు ఎలాంటి దిశానిర్దేశం చేయడం లేదు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో కేవలం నలుగురైదుగురు నాయకులు మాత్రమే యాక్టివ్గా ఉన్నారు.
సీమలో కూడా కేవలం ఇద్దరు ముగ్గురు నేతలు మాత్రమే వాయిస్ వినిపిస్తున్నారు. ఇక, ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణాలో ఒకరిద్దరు కూడా తక్కువగానే ఉన్నారు. గుంటూరులో అయితే.. అంబటి రాంబాబు కేంద్రంగానే వైసీపీ రాజకీయాలు సాగుతున్నాయి. ఇలా.. చేయడం వల్ల పార్టీపరంగా వచ్చే ఇమేజ్ మాట ఎలా ఉన్నా.. పోతున్న ఇమేజే ఎక్కువగా ఉంది. దీంతో రాజకీయంగా వైసీపీ పుంజుకోవడం కూడా కష్టమేనన్న భావన వ్యక్తమవుతోంది. మొత్తంగా ఈ రెండేళ్లలో పార్టీ పెద్దగా పుంజుకున్నది అయితే లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పెద్దికి ఒళ్ళు హూనం చేసుకుని దర్శకుడు బుచ్చిబాబు అడిగిన దానికి రెండువందల శాతం ఎక్కువ ఇచ్చిన రామ్ చరణ్ దానికి…
కమెడియన్ పాత్రలు చేసుకునే సత్యం రాజేష్ను హీరోగా పెట్టి చాలా తక్కువ బడ్జెట్లో ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా తీశాడు…
తెలంగాణకు కీలక ప్రాజెక్టుగా రానున్న బుల్లెట్ రైలు రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారనుంది. మొత్తం మూడు బుల్లెట్ రైళ్లను కేంద్ర…
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు యువ హీరోయిన్ రాశీ సింగ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి…
క్రిస్టఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే గ్రీక్, ట్రాయ్…
72వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడు అవార్డు పుష్ప 2కి గాను అల్లు అర్జున్ కి మరోసారి రావొచ్చేమో అని…