పెద్దికి ఒళ్ళు హూనం చేసుకుని దర్శకుడు బుచ్చిబాబు అడిగిన దానికి రెండువందల శాతం ఎక్కువ ఇచ్చిన రామ్ చరణ్ దానికి తగ్గ పూర్తి ప్రతిఫలం అందుకోలేదన్నది వాస్తవం. తెలుగు రాష్ట్రాల్లో హిట్టయ్యిండొచ్చు కానీ బాలీవుడ్, ఓవర్సీస్ తో పాటు తమిళనాడు కేరళలో ఆశించిన ఫలితం రాకపోవడం ముమ్మాటికీ నిరాశ కలిగించే విషయమే. ఓటిటిలో వచ్చాక కూడా రిజల్ట్ పెద్దగా మారలేదు. చరణ్ పెర్ఫార్మన్స్ గురించి కామెంట్స్ లేవు కానీ బుచ్చిబాబు మీద అయితే ట్రోలింగ్ ఉంది.
సరే హిట్లు ఫ్లాపులు అందరికీ సహజమే కానీ రామ్ చరణ్ వీలైనంత త్వరగా గుర్తించాల్సిన సత్యం ఒకటుంది. ఆర్సి 17 ఏళ్లకేళ్లు షూటింగ్ జరగకుండా చూసుకోవాలి. గేమ్ ఛేంజర్ కు మూడు సంవత్సరాలు, పెద్దికి రెండు సంవత్సరాలు ఖర్చు పెడితే దక్కింది ఏముంది. ఆర్ఆర్ఆర్ తెచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ పెరగలేదు సరికదా ఇంకొంచెం రిస్కులో పడింది. అయితే రంగస్థలం లాంటి పాత్ బ్రేకింగ్ మూవీ ఇచ్చిన సుకుమార్ తో చేతులు కలిపాడు కాబట్టి ఫ్యాన్స్ ఆశాభావంతో ఉన్నారు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఆర్సి 17 నవంబర్ నుంచి ప్రారంభం కానుంది. సుకుమార్ ది వేగంగా తీసే స్టైల్ కాదు. పుష్ప 1, 2 రెండు కలిపి అల్లు అర్జున్ అయిదు సంవత్సరాలు త్యాగం చేశాడు. దానికి తగ్గ రిటర్న్ గిఫ్ట్ అందుకున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ రామ్ చరణ్ కు కూడా అదే చేస్తే ఇబ్బందవుతుంది. పక్కా ప్లానింగ్ ఉంటే 93 రోజుల్లో రెండు వేల కోట్ల సినిమా తీయొచ్చని క్రిస్టోఫర్ నోలన్ నిరూపించారు. అలాంటిది టాలీవుడ్ దర్శకులు చేయలేరా.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆర్సి 17 ఫైనల్ స్క్రిప్ట్ దాదాపు లాక్ అయ్యిందట. మొదట రెండు భాగాలనే ప్రచారం జరిగింది కానీ ఇప్పుడది సింగల్ పార్ట్ కే పరిమితం చేస్తున్నారని ఫ్రెష్ అప్డేట్. ఈసారి పల్లెటూరి బ్యాక్ డ్రాప్, మాఫియా లేకుండా ఫ్రెష్ జానర్ ఎంచుకున్నారట. స్టయిలిష్ యాక్షన్ తో పాటు అభిమానులు ఆశించే కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండేలా సుకుమార్ పక్కా ప్లానింగ్ తో ఉన్నారట. వీడియో రూపంలో అనౌన్స్ మెంట్ ఉండొచ్చని వినికిడి.
జాతీయ అవార్డుల మీద క్రమంగా అసంతృప్తి శాతం ప్రతి సంవత్సరం పెరుగుతూ పోయేలా ఉంది. ఇండియన్ ఆస్కార్ గా చెప్పుకునే…
వచ్చే వారం విడుదల కాబోతున్న రామాయణ ట్రైలర్ నిన్న ముంబైలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో మీడియా ప్రతినిధులకు…
సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్... ఈ పేరు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. కుర్రకారు అయితే దీని గురించి మరింత…
ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ హరిత విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టినట్టు సీఎం…
వైసీపీ గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. 151 స్థానాల నుంచి 11కు పడిపోయింది. దీనికి కారణాలు ఏంటన్నవి అందరికీ తెలిసినా..…
కమెడియన్ పాత్రలు చేసుకునే సత్యం రాజేష్ను హీరోగా పెట్టి చాలా తక్కువ బడ్జెట్లో ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా తీశాడు…