Political News

స్వాతంత్ర్య వేడుకల్లో ఎర్రకోటపై జెన్ జీ

ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ లు చేపట్టిన ఆందోళన ప్రభావం కేంద్ర ప్రభుత్వం మీద ఎంతో తీవ్రమైన ఎఫెక్ట్ చూపించింది. విద్యార్థుల దెబ్బకు తొలిసారిగా కేంద్రంలో ఒక మంత్రి చేత రాజీనామా చేయించారు. బీజేపీ మాతృసంస్థ అధిపతి మోహన్ భగవత్ యువతతో మాటామంతి చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కనిపించకుండా ముఖం చాటేశారు. ఇప్పుడు తాజాగా స్వాతంత్ర్య వేడుకల్లో కూడా యువతను పిలిచి పెద్ద పీట వేస్తున్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి తగిన గౌరవం ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఇదంతా కాక్రోచ్ ఉద్యమ ప్రభావమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

భారత 80వ స్వాతంత్ర్య వేడుకలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఈ వేడుకలకు సంబందించి కేంద్ర ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. వేడుకల్లో జెన్ జీ కి విశేష ప్రధాన్యత కల్పించనున్నారు. 19 మంది యువ మేధావులను ఎర్రకోట ప్రధాన వేదిక వద్ద ప్రధాని మోదీకి సమీపంలో సీట్లు కేటాయించారు. రైతు ఉద్యమాలు ఉధృతం అవుతున్న నేపథ్యంలో స్వాతంత్ర్య వేడుకలను తిలకించేందుకు పలువురు రైతులకు కూడా ఆహ్వానాలు పంపించారు.

ఎర్రకోటకు ప్రధాన మార్గంలా వుండే జ్ఞాన్ పథ్ మార్గంలో మరో 2500 మంది ఎన్సీసీ అభ్యర్థులు, వైస్ కార్ప్స్ వాలంటీర్లు కలిసి వందేమాతరం ఆకారంలో ప్రదర్శన నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో ఎన్నడూ ఇవ్వనంతగా ఈసారి యువతకు ప్రాధాన్యత కల్పించాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

మరో ముఖ్యమైన మార్పు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి తగిన గౌరవం ఇవ్వడం. గత ఏడాది జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో రాహుల్ గాంధీకి ఐదవ వరసలో సీటు కేటాయించి అవమానించారు. ప్రధాన మంత్రి తర్వాత అంతటి హోదా కలిగిన ప్రతిపక్ష నేతకు వెనక వరసలో సీటు కేటాయించడం సమర్ధనీయం కాదని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి మారినట్లు కనిపిస్తుంది. ఈసారి వేడుకల్లో రాహుల్ గాంధీకి మంత్రుల తర్వాత సీటు కేటాయిస్తున్నట్లు పార్లమెంటులో ప్రకటించారు. నిబంధనల ప్రకారం ఆయనకు సీటు కేటాయిన్నట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

నిన్నా మొన్నటి వరకు ఏక పక్షంగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వంలో కనిపిస్తున్న మార్పును ప్రజాస్వామిక వాదులు స్వాగతిస్తున్నారు. పాలక ప్రతిపక్ష పార్టీలు బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం వుందని, ముఖ్యంగా పాలక వర్గం అందరినీ కలుపుకొని పోవడం గౌరవంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జెన్ జీ ప్రభావం కనిపిస్తున్న దశలో ప్రభుత్వం అప్రమత్తమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

This post was last modified on August 11, 2026 11:49 pm

Share

Recent Posts

ఒకే కారులో బీజేపీ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే!

తమ తమ నియోజకవర్గాల్లో ఏవైనా అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా వేర్వేరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు హాజరు కావడం…

1 hour ago

`జెన్‌జీకి` చేరువ‌గా జ‌న‌సేన‌… 2న `యువ‌ సేన`

ఏపీలో అధికారం పంచుకున్న కూట‌మి పార్టీ జ‌న‌సేన‌.. మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జెన్‌జీకి చేరువ అయ్యేలా.. `యూత్ @…

2 hours ago

జగన్ మన కులపొడే అని ఎగబడి ఓట్లు వేశాం

4 జిల్లాల‌కు సాగు నీరు, 4 ల‌క్ష‌ల మందికి తాగు నీరు అందించే వెలిగొండ ప్రాజెక్టు తొలి ద‌శ పూర్తయిన…

2 hours ago

కీరవాణి కొడుకు కన్ఫమ్ చేసేశాడు

తెలుగు సినీ పరిశ్రమలో బోలెడన్ని సినీ జంటలున్నాయి. ఆ జాబితాలోకి ఎప్పటికప్పుడు కొత్త జంటలు చేరుతూనే ఉంటాయి. ఒక యువ…

2 hours ago

చీరలోనే 47 ఏళ్ల తల్లి పరుగు.. ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు కోసం..

కాళ్లకు స్పోర్ట్స్‌ షూస్‌ లేవు.. ఒంటిపై ఖరీదైన క్రీడా దుస్తులు లేవు.. సాధారణ చీర, చెప్పులతోనే బరిలోకి దిగారు. పరుగులో…

3 hours ago

గ‌ణేష్ వేడుక‌…`చిరు` చెప్పిన‌ట్టు చేద్దామా!

సామాజిక కార్య‌క్ర‌మాల విష‌యంలో చురుగ్గా ఉండే మెగా స్టార్ చిరంజీవి.. త‌ర‌చుగా ర‌క్త‌దానం, మొక్క‌ల పెంప‌కం, ప‌ర్యావ‌ర‌ణం గురించి ప్ర‌జ‌ల‌కు,…

3 hours ago