Political News

స్వాతంత్ర్య వేడుకల్లో ఎర్రకోటపై జెన్ జీ

ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ లు చేపట్టిన ఆందోళన ప్రభావం కేంద్ర ప్రభుత్వం మీద ఎంతో తీవ్రమైన ఎఫెక్ట్ చూపించింది. విద్యార్థుల దెబ్బకు తొలిసారిగా కేంద్రంలో ఒక మంత్రి చేత రాజీనామా చేయించారు. బీజేపీ మాతృసంస్థ అధిపతి మోహన్ భగవత్ యువతతో మాటామంతి చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కనిపించకుండా ముఖం చాటేశారు. ఇప్పుడు తాజాగా స్వాతంత్ర్య వేడుకల్లో కూడా యువతను పిలిచి పెద్ద పీట వేస్తున్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి తగిన గౌరవం ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఇదంతా కాక్రోచ్ ఉద్యమ ప్రభావమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

భారత 80వ స్వాతంత్ర్య వేడుకలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఈ వేడుకలకు సంబందించి కేంద్ర ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. వేడుకల్లో జెన్ జీ కి విశేష ప్రధాన్యత కల్పించనున్నారు. 19 మంది యువ మేధావులను ఎర్రకోట ప్రధాన వేదిక వద్ద ప్రధాని మోదీకి సమీపంలో సీట్లు కేటాయించారు. రైతు ఉద్యమాలు ఉధృతం అవుతున్న నేపథ్యంలో స్వాతంత్ర్య వేడుకలను తిలకించేందుకు పలువురు రైతులకు కూడా ఆహ్వానాలు పంపించారు.

ఎర్రకోటకు ప్రధాన మార్గంలా వుండే జ్ఞాన్ పథ్ మార్గంలో మరో 2500 మంది ఎన్సీసీ అభ్యర్థులు, వైస్ కార్ప్స్ వాలంటీర్లు కలిసి వందేమాతరం ఆకారంలో ప్రదర్శన నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో ఎన్నడూ ఇవ్వనంతగా ఈసారి యువతకు ప్రాధాన్యత కల్పించాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

మరో ముఖ్యమైన మార్పు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి తగిన గౌరవం ఇవ్వడం. గత ఏడాది జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో రాహుల్ గాంధీకి ఐదవ వరసలో సీటు కేటాయించి అవమానించారు. ప్రధాన మంత్రి తర్వాత అంతటి హోదా కలిగిన ప్రతిపక్ష నేతకు వెనక వరసలో సీటు కేటాయించడం సమర్ధనీయం కాదని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి మారినట్లు కనిపిస్తుంది. ఈసారి వేడుకల్లో రాహుల్ గాంధీకి మంత్రుల తర్వాత సీటు కేటాయిస్తున్నట్లు పార్లమెంటులో ప్రకటించారు. నిబంధనల ప్రకారం ఆయనకు సీటు కేటాయిన్నట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

నిన్నా మొన్నటి వరకు ఏక పక్షంగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వంలో కనిపిస్తున్న మార్పును ప్రజాస్వామిక వాదులు స్వాగతిస్తున్నారు. పాలక ప్రతిపక్ష పార్టీలు బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం వుందని, ముఖ్యంగా పాలక వర్గం అందరినీ కలుపుకొని పోవడం గౌరవంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జెన్ జీ ప్రభావం కనిపిస్తున్న దశలో ప్రభుత్వం అప్రమత్తమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

This post was last modified on August 11, 2026 11:49 pm

Share

Recent Posts

జైలు నేత‌లకు ప‌రామర్శ‌… సమర్థించుకున్నారా జగన్?

ప్ర‌స్తుతం వివిధ కేసుల్లో చిక్కుకుని.. జైలు పాలైన కొంద‌రు నాయ‌కుల‌ను, మాజీ మంత్రుల‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ ఓదారుస్తున్న విష‌యం…

4 minutes ago

పార్టీలు కావాలా.. ఉద్యోగాలు కావాలా… పోలీసులు తేల్చుకోవాలి!

వైసీపీ నాయ‌కుల‌తో వేదిక‌లు పంచుకుంటున్న టీడీపీ నేత‌ల‌పై చంద్ర‌బాబు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. వారి నుంచి వివ‌ర‌ణ తీసుకుంటున్నారు. పార్టీ…

9 minutes ago

చేతులు మారిన ర‌వితేజ సినిమా?

చాలా కాలంగా స‌రైన విజ‌యం లేక ఇబ్బంది ప‌డుతున్న‌ప్ప‌టికీ.. మాస్ రాజా ర‌వితేజకు అవ‌కాశాల విష‌యంలో లోటేమీ లేదు. ఇంత‌కుముందులా…

3 hours ago

హద్దుల్లేని విచ్చలవిడితనం తెర మీద చూస్తారా

కరోనా సమయంలో బ్లాక్ బస్టర్ అనిపించుకున్న వెబ్ సిరీస్ లలో మీర్జాపూర్ ఒకటి. కలీన్ భాయ్, అతని కొడుకుతో పాటు…

3 hours ago

అల్లరోడి సత్తాకి దేవకన్యల పరీక్ష

చాలా కాలంగా ఫామ్ లో లేని అల్లరి నరేష్ కామెడీ వర్కౌట్ కావడం లేదని భావించి రకరకాల జానర్లు ట్రై…

4 hours ago

ఫేకు కుట్రలకు కూటమి చెక్

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేసి 164 సీట్లలో విజయభేరి…

4 hours ago