చాలా కాలంగా ఫామ్ లో లేని అల్లరి నరేష్ కామెడీ వర్కౌట్ కావడం లేదని భావించి రకరకాల జానర్లు ట్రై చేశాడు. సీరియస్ గా ‘బచ్చల మల్లి’ చేస్తే జనాలు బాబోయ్ అని దండం పెట్టేశారు. పోనీ ట్రెండ్ ఫాలో అవుదామని హారర్ కాన్సెప్ట్ తో ’12 ఏ రైల్వేకాలనీ’ తీస్తే ఆడియన్స్ దాని దరిదాపుల్లోకి వెళ్ళలేదు. మెసేజ్ ఇద్దామని ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, రివెంజ్ చూపిద్దామని ‘ఉగ్రమ్’ ట్రై చేస్తే అన్నీ పోయాయి. నా సామి రంగా హిట్టయినా ఆ క్రెడిట్ నాగార్జున అకౌంటులోకి వెళ్ళిపోయింది.
వచ్చే నెల అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’తో వస్తున్నాడు. నిన్న టీజర్ లాంచ్ జరిగింది. కథేంటో చెప్పేశారు. ఒక మేజిక్ బుక్కు ద్వారా ఇంద్రలోకంలో ఉన్న రంభ ఊర్వశి మేనకలను భూలోకానికి రప్పిస్తాడు హీరో. ఆ తర్వాత జరిగే సంఘటనలు, ఇంద్రుడిగా నటించిన వెన్నెల కిషోర్ తో చేయించే విన్యాసాలు, మొత్తంగా లాజిక్స్ కి దూరంగా మేజిక్ కి దగ్గరగా వెళ్ళాడు దర్శకుడు చంద్రమోహన్ చింతల. రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రీషాలు దేవకన్యలుగా అందాలు ఒలకబోస్తున్నారు.
నిజానికి ఈ పాయింట్ కొత్త కాదు. ఎప్పుడో ముప్పై అయిదు సంవత్సరాల క్రితం రాజేంద్రప్రసాద్ హీరోగా రంభ రాంబాబు వచ్చింది. పెద్ద ఫ్లాప్. జగదేకవీరుడు అతిలోకసుందరిలో ఇంద్రుడి కూతురుని భూమికి రప్పిస్తే రికార్డులు తిరగరాసింది. ఇలా ఒకరిద్దరు ఎందుకని ఇప్పుడు రంభ ఊర్వశి మేనకలను అల్లరి నరేష్ కోసం కిందకు దించుతున్నారు. మాయలు చేసే పుస్తకం కాన్సెప్ట్ మనం ఎస్వి కృష్ణారెడ్డి యమలీలలో చూసిందే. అందుకే అల్లరోడి మూవీలో దానికి వేరే ట్విస్టు పెట్టారు.
ఇప్పుడు జెన్ జీ ప్రేక్షకులను నవ్వించడం అంత ఈజీ కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, చిరంజీవి కాలంలో రంభ ఊర్వశి మేనకల మీద విపరీతమైన క్రేజ్ ఉండేది కానీ కొత్త జనరేషన్ కు వాళ్ళ గురించి కనీస అవగాహన లేదు. అలాంటి బ్యాక్ డ్రాప్ తీసుకున్న దర్శకుడు చంద్రమోహన్ పూర్తిగా వినోదాన్ని నమ్ముకున్నారు. అందుకే ఇంద్రుడిని కూడా కామెడీ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సెప్టెంబర్ 4 ఈ సినిమా థియేటర్లకు రానుంది. చూడాలి మరి అల్లరోడికి ఎలాంటి బ్రేక్ ఇస్తుందో.
This post was last modified on August 12, 2026 10:52 am
నిన్న విడుదలైన యెషనాగుల కట్ట మీద పాట సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తోంది. ముఖ్యంగా ఇతర స్టార్ హీరోల…
భారీ అంచనాల మధ్య కెజిఎఫ్ ని మించి ఉంటుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న టాక్సిక్ రిలీజ్ రోజు ఉదయం నుంచే…
టయర్ 1 హీరోలు, ప్యాన్ ఇండియా సినిమాలకు రోజుల తరబడి హౌస్ ఫుల్స్ పడటం సహజం. కానీ వాటికి కూడా…
అంతా ఊహించినట్టే ఢిల్లీ కాంగ్రెస్ స్పందించింది. ఇన్నాళ్లు తెలంగాణా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను మౌనంగా గమనిస్తూ వచ్చిన అధిష్టానం…
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని వైసీపీ అధినేత జగన్ కోరుకుంటున్నారు. తద్వారా.. గత 2024 సాధారణ ఎన్నికల్లో ఎదురైన పరాభవం…
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గ వైసీపీ రాజకీయంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుత వైసీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే…