చాలా కాలంగా ఫామ్ లో లేని అల్లరి నరేష్ కామెడీ వర్కౌట్ కావడం లేదని భావించి రకరకాల జానర్లు ట్రై చేశాడు. సీరియస్ గా ‘బచ్చల మల్లి’ చేస్తే జనాలు బాబోయ్ అని దండం పెట్టేశారు. పోనీ ట్రెండ్ ఫాలో అవుదామని హారర్ కాన్సెప్ట్ తో ’12 ఏ రైల్వేకాలనీ’ తీస్తే ఆడియన్స్ దాని దరిదాపుల్లోకి వెళ్ళలేదు. మెసేజ్ ఇద్దామని ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, రివెంజ్ చూపిద్దామని ‘ఉగ్రమ్’ ట్రై చేస్తే అన్నీ పోయాయి. నా సామి రంగా హిట్టయినా ఆ క్రెడిట్ నాగార్జున అకౌంటులోకి వెళ్ళిపోయింది.
వచ్చే నెల అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’తో వస్తున్నాడు. నిన్న టీజర్ లాంచ్ జరిగింది. కథేంటో చెప్పేశారు. ఒక మేజిక్ బుక్కు ద్వారా ఇంద్రలోకంలో ఉన్న రంభ ఊర్వశి మేనకలను భూలోకానికి రప్పిస్తాడు హీరో. ఆ తర్వాత జరిగే సంఘటనలు, ఇంద్రుడిగా నటించిన వెన్నెల కిషోర్ తో చేయించే విన్యాసాలు, మొత్తంగా లాజిక్స్ కి దూరంగా మేజిక్ కి దగ్గరగా వెళ్ళాడు దర్శకుడు చంద్రమోహన్ చింతల. రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రీషాలు దేవకన్యలుగా అందాలు ఒలకబోస్తున్నారు.
నిజానికి ఈ పాయింట్ కొత్త కాదు. ఎప్పుడో ముప్పై అయిదు సంవత్సరాల క్రితం రాజేంద్రప్రసాద్ హీరోగా రంభ రాంబాబు వచ్చింది. పెద్ద ఫ్లాప్. జగదేకవీరుడు అతిలోకసుందరిలో ఇంద్రుడి కూతురుని భూమికి రప్పిస్తే రికార్డులు తిరగరాసింది. ఇలా ఒకరిద్దరు ఎందుకని ఇప్పుడు రంభ ఊర్వశి మేనకలను అల్లరి నరేష్ కోసం కిందకు దించుతున్నారు. మాయలు చేసే పుస్తకం కాన్సెప్ట్ మనం ఎస్వి కృష్ణారెడ్డి యమలీలలో చూసిందే. అందుకే అల్లరోడి మూవీలో దానికి వేరే ట్విస్టు పెట్టారు.
ఇప్పుడు జెన్ జీ ప్రేక్షకులను నవ్వించడం అంత ఈజీ కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, చిరంజీవి కాలంలో రంభ ఊర్వశి మేనకల మీద విపరీతమైన క్రేజ్ ఉండేది కానీ కొత్త జనరేషన్ కు వాళ్ళ గురించి కనీస అవగాహన లేదు. అలాంటి బ్యాక్ డ్రాప్ తీసుకున్న దర్శకుడు చంద్రమోహన్ పూర్తిగా వినోదాన్ని నమ్ముకున్నారు. అందుకే ఇంద్రుడిని కూడా కామెడీ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సెప్టెంబర్ 4 ఈ సినిమా థియేటర్లకు రానుంది. చూడాలి మరి అల్లరోడికి ఎలాంటి బ్రేక్ ఇస్తుందో.
This post was last modified on August 12, 2026 10:52 am
పెద్ద సినిమాలకు షూటింగ్ పూర్తి చేయడమే కాదు సరైన రిలీజ్ డేట్లు సెట్ చేసుకోవడం చాలా పెద్ద ఛాలెంజ్. ఈ…
కూటమిలో నాయకులకు కలివిడితప్పదు. ఈ విషయాన్ని గతంలో అనేక సందర్భాల్లో టీడీపీ-జనసేన కూడా స్పష్టం చేశాయి. అయినప్పటికీ.. కొందరు నాయకులు…
నిన్న జరిగిన కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ లో చిరంజీవి మెగా 158 గురించి ఇచ్చిన లీక్ అభిమానుల్లో రకరకాల…
భారతీయులందరూ సగర్వంగా ఫీలయ్యే రోజు ఆగస్ట్ 15. బ్రిటిష్ పాలకుల దాస్య సంకెళ్లను తెచ్చుకుని ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు…
ప్రస్తుతం వివిధ కేసుల్లో చిక్కుకుని.. జైలు పాలైన కొందరు నాయకులను, మాజీ మంత్రులను వైసీపీ అధినేత జగన్ ఓదారుస్తున్న విషయం…
వైసీపీ నాయకులతో వేదికలు పంచుకుంటున్న టీడీపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి నుంచి వివరణ తీసుకుంటున్నారు. పార్టీ…