Political News

టార్గెట్ కాంగ్రెస్‌… పవన్ కీల‌క వ్యూహం?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజ‌కీయంగా త‌న‌కు ఉన్న ల‌క్ష్యాన్ని కూడా వివ‌రించారు. దేశాన్ని ఐక్యం చేయ‌డంతోపాటు.. ఉత్త‌ర‌-ద‌క్షిణ ప్రాంతాలు అనే భేదాన్ని తుడిచి పెట్టి.. అంద‌రూ ఒక్క‌టే అనే విధంగా దేశాన్ని క‌లిపి ఉంచాల‌న్న త‌న మ‌న‌సులోని భావాల‌ను వెల్ల‌డించారు. అదేస‌మ‌యంలో త‌న టార్గెట్ కూడా కాంగ్రెస్ పార్టీనేన‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ విధానాల కార‌ణంగానే దేశంలో విభ‌జ‌న వాదం వ‌చ్చింద‌ని పేర్కొన్నారు.

అంతేకాదు… ఏపీ, తెలంగాణ‌ల‌ను విడ‌దీసినందుకు, తెలంగాణ ఇచ్చినందుకు త‌న‌కు బాధ‌లేద‌న్న ఆయన‌.. విభ‌జ‌న చేసిన తీరును, ఏపీకి మిగిల్చిన క‌ష్టాల‌పైనే త‌న ఆవేద‌న అని పేర్కొన్నారు. దీనికి మూల కార‌ణం.. కాంగ్రెస్ పార్టీనేన‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు.. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలోనూ కాంగ్రెస్ పార్టీ చేసిందే ఘోర త‌ప్పిద‌మ‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌ధాని మోడీని ఆడిపోసుకోవ‌డం స‌రికాద‌ని పేర్కొన్నా రు. ఆనాడే పార్ల‌మెంటులో చ‌ట్టంలో చేర్చి ఉంటే స‌మ‌స్య ఉండేది కాద‌న్నారు.

అంతేకాదు.. ప‌లువురు ముఖ్య‌మంత్రులు(కాంగ్రెస్‌) ఉత్త‌రం, ద‌క్షిణం అంటూ.. దేశానికి గోడ‌లు క‌ట్టే ప్ర‌యత్నం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. త‌న దృక్ఫ‌థంలో దేశం అంతా ఒక్క‌టేన‌ని చెప్పారు. దేశ ఐక్య‌త కోసం.. ఎంతోమంది ప్ర‌య‌త్నించార‌ని.. కానీ.. కాంగ్రెస్ పార్టీ విభ‌జ‌న వాదాన్ని భుజాన మోస్తోంద‌ని చెప్ప‌కనే చెప్పారు. త‌ద్వారా.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న రాజ‌కీయ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ పార్టీనేన‌ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. దీనిని బ‌ట్టి రాబోయే రోజుల్లో జాతీయ‌స్తాయి కావొచ్చు.. ప్రాంతీయ స్థాయి కావొచ్చు.. ప‌వ‌న్ వ్యూహం.. కాంగ్రెస్‌పైనే ఉంటుంద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

మోడీ దిశానిర్దేశం..

ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను నిశితంగా గ‌మ‌నిస్తే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు లేని ఉత్తేజం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఏపీకి, తెలంగాణ‌కు ప‌రిమిత‌మైతే.. తొలిసారి దేశ ఐక్య‌త‌, స‌మ‌గ్ర వ్యూహం.. అన్ని ప్రాంతాలు ఒక్క‌టేన‌న్న భావ‌న‌ను వినిపించారు. త‌ద్వారా.. దేశంలోని త‌ట‌స్థుల‌ను ఆయ‌న ఆక‌ర్షించే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే.. దీనివెనుక ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ దిశానిర్దేశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇది ప‌వ‌న్‌ను జాతీయ నేత‌గా తీర్చిదిద్దినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు.

This post was last modified on June 11, 2026 12:44 pm

Share

Recent Posts

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

45 minutes ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

8 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

9 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

9 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

10 hours ago

కూతురి పెద్ద మాటలు… నాకు సంబంధం లేదన్న కొండా

సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…

12 hours ago