ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్ కాక్రోచ్ పార్టీ ఆవిర్భావం. అంతా అప్ డేట్ అవుతుంటే… తాను కూడా అదే బాటన నడవాలని అనుకున్నారో, ఏమో తెలియదు గానీ… వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అప్ డేట్ అయిపోతున్నారు. జగన్ లో ఈ అప్ డేషన్ గురువారం నాటి మీడియా సమావేశంలో విస్పష్టంగా కనిపించిందని చెప్పాలీ.
ఎప్పటిలానే తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ చాలా అంశాలనే ప్రస్తావించారు. వాటితో పాటుగా అప్ డేటెడ్ వెర్షన్లనూ ఆయన ప్రస్తావించారు. మనమంతా ఇప్పుడు జెన్ జీ యుగంలో ఉన్నామన్న జగన్… అప్పుడు జెన్ ఆల్ఫా కూడా వచ్చేసిందంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపైకి కాక్రోచ్ లు లేస్తాయంటూ సెటైరిక్ కామెంట్లు చేశారు.
చంద్రబాబు తన పాలనలో తప్పులు చేస్తున్నారని రూలింగ్ ఇచ్చిన జగన్.. ఆ తప్పులను చంద్రబాబు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పులను ఒప్పుకోకుండా సాగడం చంద్రబాబుకు సాధ్యం కాదన్న మాటనూ జగన్ గట్టిగానే వినిపించారు. ఈ సందర్భంగానే జెన్ జీ, జెన్ ఆల్ఫాలను ప్రస్తావించిన జగన్.. చంద్రబాబు తన తప్పులను ఒప్పుకోని పక్షంలో ఆయనపైకి కాక్రోచ్ లు వచ్చి పడతాయని తెలిపారు.
ఈ అప్ డేటెడ్ వెర్షన్ల ప్రస్తావన సందర్భంగా జగన్ వాటిని పలికేందుకు ఒకింత ఇబ్బంది పడినట్లుగా కనిపించింది. అడ్వాన్స్ వెర్షన్లకు సంబందించిన పేర్లను ఓ నాలుగింటిని జగన్ బట్టి కొట్టి మరీ మీడియా మీట్ కు వచ్చినట్లుగా అనిపించిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. జెన్ జీ.. జెన్ ఆల్ఫా, కాక్రోచ్ అనే పదాలను పలికిన సందర్బంగా జగన్ పడిన ఇబ్బంది స్పష్టంగా కనిపించింది.
This post was last modified on June 11, 2026 1:40 pm
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…
సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…