తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు తాను ఇచ్చిన కథను ఎలా పడితే అలా మార్చేశారంటూ ఆ మధ్య రచయిత సాయి మాధవ్ బుర్రా ఎంత అసహనం వ్యక్తం చేశారో తెలిసిందే. దీని మీద వరలక్ష్మి సరైన సమాధానం ఇవ్వలేకపోయింది.
కట్ చేస్తే ఇప్పుడు ‘పోలీస్ కంప్లైంట్’ అనే సినిమాకు కోరినంత పారితోషకం తీసుకున్న వరలక్ష్మి.. ప్రమోషన్లకు మాత్రం రావడం లేదంటూ ఆ చిత్ర దర్శకుడు సంజీవ్ మేగోటి చేసిన ఆరోపణలు హాట్ టాపిక్గా మారాయి. వరలక్ష్మి సొంత సినిమా ‘సరస్వతి’ కోసం తమ చిత్రాన్ని ఆలస్యం చేసినా సర్దుకున్నామని, కానీ ఇప్పుడు ‘పోలీస్ కంప్లైంట్’ ప్రమోషన్లకు రాకుండా తమను వరలక్ష్మి ఇబ్బంది పడుతోందంటూ సంజీవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఆరోపణలపై వరలక్ష్మి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్పందించింది.
పోలీస్ కంప్లైంట్ టీంకు తన అవసరం ఉన్నపుడల్లా తాను అందుబాటులోనే ఉన్నానని.. సినిమాకు సంబంధించి ప్రతి కార్యక్రమానికీ హాజరయ్యానని వరలక్ష్మి స్పష్టం చేసింది. ‘పోలీస్ కంప్లైంట్’ ఈవెంట్లో దర్శకుడు ఏం మాట్లాడాడో తనకు ఎవరూ పూర్తిగా చెప్పలేదని చెప్పిన వరలక్ష్మి.. కొన్ని విషయాల్లో తనకంటూ సొంత అభిప్రాయాలు ఉంటాయని.. కాబట్టి తన మీద ఆ టీం చేసిన ఆరోపణల మీద బహిరంగంగా చర్చించాలని అనుకోవడం లేదని వరలక్ష్మి స్పష్టం చేసింది.
ఐతే నిన్నటి ఈవెంట్కు వరలక్ష్మి రాకపోవడం మీదే టీం నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ వరలక్ష్మి మాత్రం తాను ప్రతి కార్యక్రమానికీ హాజరయ్యానని అంటోంది.
వరలక్ష్మికి తెలుగు బాగానే వచ్చు. ఆమె తెలుగులో తన పాత్రలకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పకుంటోంది. అలాంటపుడు ఆ ఈవెంట్లో దర్శకుడు ఏం మాట్లాడాడో తనకు ఎవరూ పూర్తిగా చెప్పలేదని అనడం విడ్డూరం.
ఒకవేళ తనకు తెలుగు అర్థం కాదనుకున్నా.. మూణ్నాలుగు నిమిషాల స్పీచ్లో దర్శకుడేం మాట్లాడాడో ఎవరితో అయినా చెప్పించుకోవడం పెద్ద విషయం కాదు. ప్రమోషన్లకు ఎందుకు రాలేదనే విషయంలో సూటిగా సమాధానం చెప్పకుండా.. ఇలా అరకొర వివరణ ఇవ్వడం వల్ల వరలక్ష్మికి ఇంకా డ్యామేజ్ జరగడమే తప్ప ప్రయోజనం ఏమీ లేదనే చెప్పాలి.
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…