తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు తాను ఇచ్చిన కథను ఎలా పడితే అలా మార్చేశారంటూ ఆ మధ్య రచయిత సాయి మాధవ్ బుర్రా ఎంత అసహనం వ్యక్తం చేశారో తెలిసిందే. దీని మీద వరలక్ష్మి సరైన సమాధానం ఇవ్వలేకపోయింది.
కట్ చేస్తే ఇప్పుడు ‘పోలీస్ కంప్లైంట్’ అనే సినిమాకు కోరినంత పారితోషకం తీసుకున్న వరలక్ష్మి.. ప్రమోషన్లకు మాత్రం రావడం లేదంటూ ఆ చిత్ర దర్శకుడు సంజీవ్ మేగోటి చేసిన ఆరోపణలు హాట్ టాపిక్గా మారాయి. వరలక్ష్మి సొంత సినిమా ‘సరస్వతి’ కోసం తమ చిత్రాన్ని ఆలస్యం చేసినా సర్దుకున్నామని, కానీ ఇప్పుడు ‘పోలీస్ కంప్లైంట్’ ప్రమోషన్లకు రాకుండా తమను వరలక్ష్మి ఇబ్బంది పడుతోందంటూ సంజీవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఆరోపణలపై వరలక్ష్మి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్పందించింది.
పోలీస్ కంప్లైంట్ టీంకు తన అవసరం ఉన్నపుడల్లా తాను అందుబాటులోనే ఉన్నానని.. సినిమాకు సంబంధించి ప్రతి కార్యక్రమానికీ హాజరయ్యానని వరలక్ష్మి స్పష్టం చేసింది. ‘పోలీస్ కంప్లైంట్’ ఈవెంట్లో దర్శకుడు ఏం మాట్లాడాడో తనకు ఎవరూ పూర్తిగా చెప్పలేదని చెప్పిన వరలక్ష్మి.. కొన్ని విషయాల్లో తనకంటూ సొంత అభిప్రాయాలు ఉంటాయని.. కాబట్టి తన మీద ఆ టీం చేసిన ఆరోపణల మీద బహిరంగంగా చర్చించాలని అనుకోవడం లేదని వరలక్ష్మి స్పష్టం చేసింది.
ఐతే నిన్నటి ఈవెంట్కు వరలక్ష్మి రాకపోవడం మీదే టీం నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ వరలక్ష్మి మాత్రం తాను ప్రతి కార్యక్రమానికీ హాజరయ్యానని అంటోంది.
వరలక్ష్మికి తెలుగు బాగానే వచ్చు. ఆమె తెలుగులో తన పాత్రలకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పకుంటోంది. అలాంటపుడు ఆ ఈవెంట్లో దర్శకుడు ఏం మాట్లాడాడో తనకు ఎవరూ పూర్తిగా చెప్పలేదని అనడం విడ్డూరం.
ఒకవేళ తనకు తెలుగు అర్థం కాదనుకున్నా.. మూణ్నాలుగు నిమిషాల స్పీచ్లో దర్శకుడేం మాట్లాడాడో ఎవరితో అయినా చెప్పించుకోవడం పెద్ద విషయం కాదు. ప్రమోషన్లకు ఎందుకు రాలేదనే విషయంలో సూటిగా సమాధానం చెప్పకుండా.. ఇలా అరకొర వివరణ ఇవ్వడం వల్ల వరలక్ష్మికి ఇంకా డ్యామేజ్ జరగడమే తప్ప ప్రయోజనం ఏమీ లేదనే చెప్పాలి.
This post was last modified on June 11, 2026 2:51 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…