Political News

‘చంద్రబాబు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు’

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌తిప‌క్ష(ప్ర‌ధాన కాదు) నాయ‌కుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు రాష్ట్రంలో అన్యాయంగా పాల‌న చేస్తున్నార‌ని.. విమ‌ర్శించారు. తాజాగా వైసీపీ అనుకూల నాయ‌కుడు, ప్ర‌భుత్వ ఉద్యోగి, స‌చివాల‌య ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాక‌ర్ల వెంక‌ట్రామిరెడ్డిని ప్ర‌భుత్వం ఉద్యోగం నుంచి తొల‌గించింది. దీనిపై స్పందించిన జ‌గ‌న్‌.. భారీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అన్యాయంగా వెంక‌ట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి తొల‌గించార‌ని అన్నారు. ఉద్యోగులు రాజ‌కీయాల్లో భాగం కావ‌డం అనేది చంద్ర‌బాబు హ‌యాంలోనే ప్రారంభ‌మైంద‌న్నారు.

గ‌తంలో ఎన్‌జీవో సంఘం అధ్య‌క్షుడిగా ఉన్న‌ అశోక్ బాబును టీడీపీ వినియోగించుకోలేదా? అని ప్ర‌శ్నించారు. అప్ప‌ట్లో కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పుడు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అన్నారు. త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉండేవారికి ఒక నియమం.. మ‌రొక‌రికి మ‌రో నియ‌మ‌మా? అని నిల‌దీశారు. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో విఫ‌ల‌మైన చంద్ర‌బాబును ఎవ‌రూ ప్ర‌శ్నించ‌రాద‌న్న ధోర‌ణితో ఉన్నార‌ని ఆగ్ర‌హించారు. ఇది ప్ర‌జాస్వామ్యం లో స‌రైన విధానం కాద‌ని తెలిపారు.

హామీలు ఏమ‌య్యాయి?

ఎన్నిక‌లకు ముందు సూప‌ర్ సిక్స్ అంటూ ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయ‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఈ హామీల‌ను అమలు చేయాల‌ని ప్ర‌శ్నించినందుకే వెంక‌ట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి తీసేశార‌ని అన్నారు. ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌లేక పోతున్నార‌ని విమ‌ర్శించారు. ఈ క్ర‌మంలో హామీల‌ను అమ‌లు చేయాల‌న్న గ‌ళాల‌ను తొక్కేస్తున్నార‌ని విమ‌ర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మందిని ఉద్యోగాల నుంచి తీసేశార‌ని ఆరోపించారు. గ‌తంలో ఓ సీఐ.. అసెంబ్లీ సాక్షిగా చంద్ర‌బాబు అబ‌ద్ధాలు చెప్పార‌ని అన్నందుకు.. ఆయ‌న‌ను తొల‌గించార‌న్నారు.

వలంటీర్ల‌పై తొల‌సారి..

ఈ సంద‌ర్భంగా వైసీపీ హ‌యాంలో నియ‌మించిన వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌పై జ‌గ‌న్ తొలిసారి స్పందించారు. వారిని అన్యాయంగా రోడ్డు పాలు చేశార‌ని అన్నారు. తాము అధికారంలోకి వ‌స్తే.. 10 వేల రూపాయ‌ల వేతనం ఇస్తామ‌న్న హామీని నెర‌వేర్చ‌క‌పోగా.. వారిని గాలికి వ‌దిలేశార‌న్నారు. వైసీపీ హ‌యాంలో నియ‌మితులైన స‌చివాల‌య ఉద్యోగుల‌పైనా ఒత్తిడి తెచ్చి.. స్వ‌చ్ఛందంగా ఉద్యోగాలు వ‌దిలి వెళ్లిపోయేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. ఈ కార‌ణంగా ఇప్ప‌ట‌కే ప‌లువురు మృతి చెందార‌ని ఆరోపించారు.  

This post was last modified on April 22, 2026 8:54 am

Share

Recent Posts

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

1 hour ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

3 hours ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

8 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

11 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

11 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

11 hours ago