ఇమేజ్ ఉన్న హీరోలకు ఎదురయ్యే డైలమా ఒకటుంది. అదే వెబ్ సిరీస్ లకు ఎస్ చెప్పాలా వద్దాని. నాగ చైతన్య దూత ద్వారా సక్సెస్ అవ్వొచ్చని నిరూపించినప్పటికీ మిగిలిన స్టార్లు ఈ రూటు పట్టుకోలేకపోతున్నారు. థియేటర్ అయితేనే మార్కెట్ ఉంటుందని ఇలా డిజిటల్ రూటు పడితే ఇమేజ్ కు సమస్య వస్తుందని భావిస్తున్న వాళ్ళు లేకపోలేదు. అయినా సరే కిరణ్ అబ్బవరం లాంటి అప్ కమింగ్ కథానాయకులు సైతం వీటి పట్ల మొగ్గు చూపుతున్నారు.
తాజాగా సిద్ధూ జొన్నలగడ్డ ఈ లిస్టులో చేరబోతున్నాడు. వెంకీ అట్లూరి త్వరలో నెట్ ఫ్లిక్స్ కోసం తీయబోయే భారీ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సిద్ధూ అంటే సదరు సంస్థలో మంచి బ్రాండ్ వేల్యూ ఉంది. టిల్లు స్క్వేర్ తెచ్చిన వ్యూస్ దెబ్బకు తెలుసు కదా, జాక్ ని ఫాన్సీ రేటు ఇచ్చి మరీ కొనుక్కుంది. అలాంటప్పుడు నేరుగా ఒరిజినల్ సిరీస్ తీస్తే ఇంకా మంచి స్పందన దక్కించుకోవచ్చనే ఉద్దేశంతో ఇలాంటి తెలివైన స్ట్రాటజీ వేసింది.
ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించనుంది. జానర్ గట్రా వివరాలు ఇంకా బయటికి రాలేదు కానీ యాక్షన్, క్రైమ్ , ఎమోషన్ మూడు మిక్స్ చేసిన పవర్ ఫుల్ సబ్జెక్టు రాసుకున్నారని వినికిడి. టెక్నికల్ టీమ్ తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న వెంకీ అట్లూరి అది విడుదల కాగానే సిద్ధూ సిరీస్ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్ లో ఆఫీస్ ప్రారంభించాక ఒరిజినల్ కంటెంట్ మీద నెట్ ఫ్లిక్స్ సీరియస్ గా దృష్టి పెడుతోంది. కేవలం సినిమాల మీద వందల కోట్లు ఇన్వెస్ట్ చేయడం కన్నా అదే స్టార్లతో డైరెక్ట్ ఓటిటి మూవీస్, వెబ్ సిరీస్ తీయడమే లాభసాటిగా ఉందని గుర్తించి ఆ మేరకు కాంబోలు సెట్ చేయడానికి ప్రత్యేకంగా ప్రణాళికలు వేసుకుంది. ఏది ఏమైనా సిద్ధూ జొన్నలగడ్డ తీసుకున్న నిర్ణయం తెలివైందే కాదు లాభసాటి కూడా. ఆదాయం ప్లస్ సమయం రెండూ తెలివిగా వాడుకోవచ్చు.
This post was last modified on April 22, 2026 8:20 am
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…