Movie News

సిద్దు తీసుకుంది సరైన నిర్ణయమే

ఇమేజ్ ఉన్న హీరోలకు ఎదురయ్యే డైలమా ఒకటుంది. అదే వెబ్ సిరీస్ లకు ఎస్ చెప్పాలా వద్దాని. నాగ చైతన్య దూత ద్వారా సక్సెస్ అవ్వొచ్చని నిరూపించినప్పటికీ మిగిలిన స్టార్లు ఈ రూటు పట్టుకోలేకపోతున్నారు. థియేటర్ అయితేనే మార్కెట్ ఉంటుందని ఇలా డిజిటల్ రూటు పడితే ఇమేజ్ కు సమస్య వస్తుందని భావిస్తున్న వాళ్ళు లేకపోలేదు. అయినా సరే కిరణ్ అబ్బవరం లాంటి అప్ కమింగ్ కథానాయకులు సైతం వీటి పట్ల మొగ్గు చూపుతున్నారు.

తాజాగా సిద్ధూ జొన్నలగడ్డ ఈ లిస్టులో చేరబోతున్నాడు. వెంకీ అట్లూరి త్వరలో నెట్ ఫ్లిక్స్ కోసం తీయబోయే భారీ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సిద్ధూ అంటే సదరు సంస్థలో మంచి బ్రాండ్ వేల్యూ ఉంది. టిల్లు స్క్వేర్ తెచ్చిన వ్యూస్ దెబ్బకు తెలుసు కదా, జాక్ ని ఫాన్సీ రేటు ఇచ్చి మరీ కొనుక్కుంది. అలాంటప్పుడు నేరుగా ఒరిజినల్ సిరీస్ తీస్తే ఇంకా మంచి స్పందన దక్కించుకోవచ్చనే ఉద్దేశంతో ఇలాంటి తెలివైన స్ట్రాటజీ వేసింది.

ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించనుంది. జానర్ గట్రా వివరాలు ఇంకా బయటికి రాలేదు కానీ యాక్షన్, క్రైమ్ , ఎమోషన్ మూడు మిక్స్ చేసిన పవర్ ఫుల్ సబ్జెక్టు రాసుకున్నారని వినికిడి. టెక్నికల్ టీమ్ తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న వెంకీ అట్లూరి అది విడుదల కాగానే సిద్ధూ సిరీస్ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.

హైదరాబాద్ లో ఆఫీస్ ప్రారంభించాక ఒరిజినల్ కంటెంట్ మీద నెట్ ఫ్లిక్స్ సీరియస్ గా దృష్టి పెడుతోంది. కేవలం సినిమాల మీద వందల కోట్లు ఇన్వెస్ట్ చేయడం కన్నా అదే స్టార్లతో డైరెక్ట్ ఓటిటి మూవీస్, వెబ్ సిరీస్ తీయడమే లాభసాటిగా ఉందని గుర్తించి ఆ మేరకు కాంబోలు సెట్ చేయడానికి ప్రత్యేకంగా ప్రణాళికలు వేసుకుంది. ఏది ఏమైనా సిద్ధూ జొన్నలగడ్డ తీసుకున్న నిర్ణయం తెలివైందే కాదు లాభసాటి కూడా. ఆదాయం ప్లస్ సమయం రెండూ తెలివిగా వాడుకోవచ్చు.

Kumar

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

5 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

6 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

8 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

8 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

9 hours ago