ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ.. ఎవరికి వారు పార్టీలో స్వతంత్ర నాయకులుగా వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం. ఇది .. పార్టీని ముందుకు తీసుకువెళ్లకపోగా.. మరింత వెనక్కి నెడుతోందని తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కన్నబాబును ఉత్తరాంధ్ర ఇంచార్జ్గా నియమించిన తర్వాత.. పార్టీలో సహకారం కొరవడింది. దీంతో ఆయనను కేవలం విశాఖకు పరిమితం చేశారు.
అయినా కూడా బొత్స సత్యనారాయణ సామాజిక వర్గం పార్టీలో వేర్వేరు గ్రూపులు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతోంది. జిల్లాల పరంగా చూసుకుంటే.. టీడీపీ, జనసేనలకు ఉన్న బలం వైసీపీకి కనిపించడం లేదు. విశాఖలో ఎంపీ భరత్ సహా టీడీపీ సీనియర్లు.. పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. కానీ, ఇదేసమయంలో వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపించే గుడివాడ అమర్నాథ్ వంటి వారికి పార్టీలో సహకారం అంతంత మాత్రమేనన్నది సీనియర్లే చెబుతున్నారు.
ఇక, శ్రీకాకుళంలో ధర్మాన సోదరులపైనే వైసీపీ ఆధారపడింది. మాజీ మంత్రిసీదిరి అప్పలరాజును వైసీపీ నాయకులు పక్కన పెట్టేశారు. మరోవైపు.. ఇదే జిల్లాలో జనసేన, టీడీపీ తరఫున కింజరాపు ఫ్యామిలీ సహా.. ఇతర నాయకులు బలంగా పార్టీ లను ముందుకు తీసుకువెళ్తున్నారు. వీరి దెబ్బతో వైసీపీ ఎక్కడా పుంజుకునే పరిస్థితి కూడా లేదని అంటున్నారు. పోనీ.. పాత నాయకులు అయినా.. బయటకు వస్తున్నారా? అంటే.. కేవలం మీడియా సమావేశాలకే పరిమితం అవుతున్నారు.
ఇక, విజయనగరంలో వైసీపీ చీలికలు పేలికలుగా తయారైందన్నది పార్టీలో కొన్నాళ్లుగా చర్చ సాగుతోంది. జిల్లాలో బొత్స ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ద్వారా.. వైసీపీ పెద్ద పొరపాటు చేసిందన్న వాదన వినిపిస్తోంది. ఇక, ఇదేజిల్లాలో జనసేన భారీగా పుంజుకుంటోంది. దీనికి టీడీపీ సహకారం కూడా తోడైంది. దీంతో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలలోనూ.. వైసీపీ వర్గ పోరుతో ముందుకు సాగలేక.. వెనక్కి రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటే.. జనసేన+టీడీపీ ఉమ్మడిగా జిల్లాలను దున్నేసే పరిస్థితి నెలకొంది.
This post was last modified on April 21, 2026 9:50 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…