వచ్చే ఎన్నికల నాటికి గుడివాడ నియోజకవర్గంలో బలమైన నేత కోసం వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. బలమైన ఆర్థిక స్థాయి ఉండి, సామాజిక వర్గం పరంగా కూడా బలంగా ఉన్నవారి కోసం వెతుకుతోంది. గత మూడు నెలలుగా గుడివాడ నియోజకవర్గంపై వైసీపీ ఇదే దృష్టితో ఉంది. దీనికి కారణం, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని మాజీ మంత్రి కొడాలి నాని ప్రకటించిన నేపథ్యమే. గత ఎన్నికల్లోనే ఆయన ఈ ప్రకటన చేశారు.
అయితే ఇప్పుడు ఈక్వేషన్లు మారాయని కొడాలి వర్గం చెబుతోంది. వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేస్తానని సూచనలుగా కొడాలి నాని చెబుతున్నారు. అయితే అధిష్టానం అందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. నియోజకవర్గంలో కొడాలి పేరు పెద్దగా వినిపించడం లేదని, ఆయన ఫాలోవర్స్ కూడా తగ్గిపోయారని వైసీపీ ఐటీ విభాగం చేసిన సర్వేలో తేలిందని సమాచారం. దీంతో బలమైన నాయకుడి కోసం వెతుకుతున్నారు.
ఇది కొడాలి వర్గానికి మింగుడు పడడం లేదు. గత ఎన్నికల్లో ఏదో అనేశారని, ఇప్పుడు మనసు మార్చుకున్నారని, గెలుపు గుర్రం ఎక్కేందుకు మంచి అవకాశాలే ఉన్నాయని వారు చెబుతున్నారు. మరోవైపు, కొడాలి వర్గం నుంచి హెచ్చరికలు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. గుడివాడ బాధ్యతలు ఎవరికిచ్చినా సహకరించబోమని స్పష్టం చేస్తున్నారని సమాచారం. దీంతో పార్టీ పరంగా ఈ నియోజకవర్గంలో ఎలాంటి చర్యలు తీసుకునేందుకు కూడా జంకుతున్న పరిస్థితి ఏర్పడింది.
అందుకే ఇతర నియోజకవర్గాల్లో తీసుకున్న చర్యలు, వేస్తున్న అడుగుల మాదిరిగా గుడివాడలో ప్రయత్నాలు కనిపించడం లేదు. అలాగని వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ కొడాలికే టికెట్ ఇస్తారా అన్నది కూడా సందేహంగానే ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, పరిణామాలను పార్టీ నిశితంగా గమనిస్తోంది. ప్రతి అడుగు ఆచితూచి వేస్తోంది.
ఎన్నికలకు ముందు వరకు కూడా దీనిపై నిర్ణయం వాయిదా వేయడం ద్వారా చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణిలోనే పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. మరి చివరికి ఏం చేస్తారో చూడాలి. ప్రస్తుతం నాని నియోజకవర్గంలోనే ఉన్నా మౌనంగా ఉన్నారు.
This post was last modified on March 22, 2026 8:42 pm
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…